Author: Admin

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తి అవుతున్న‌ది. కేవలం ఏడాదిలోనే రుణ‌మాఫీ, ఉద్యోగాల క‌ల్ప‌న స‌హా అనేక అంశాల్లో రేవంత్ రెడ్డి సాధించిన విజ‌యాలు బీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ కోసం ఐదేళ్లు రైతుల్ని త‌మ చుట్టు తిప్పుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఎక్క‌డ‌.. ఒకే విడ‌త‌లో రెండు ల‌క్ష‌లు మాఫీ చేసిన ప్ర‌జా ప్ర‌భుత్వం ఎక్క‌డ అని రైతుల్లో చ‌ర్చ మొద‌లైంది. మెగా డీఎస్సీ ప్ర‌క్రియును చ‌క చ‌కా పూర్తిచేసిన రేవంత్ స‌ర్కారుపై నిరుద్యోగ యువ‌త ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఆరోగ్య శ్రీ పెంపుతో ల‌బ్ది పొందిన కుటుంబాలు ప్ర‌భుత్వాన్ని ఆశీర్వ‌దిస్తున్నాయి. దేశంలోనే అతి ఎక్కువ వ‌రి పండిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇలా రాష్ట్రం ప‌చ్చ‌బ‌డుతుంటే గులాబీ నేత‌ల క‌ళ్ల‌లో నిప్పులు పోసుకుంటున్నారు. ఏడాది సంబురాల‌ను నీరు గార్చాల‌ని ప‌క్కా ప‌థ‌కం రచించారు. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కుట్ర‌లు చేసి…

Read More

కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో తొంద‌ర‌ప‌డి బీఆర్ఎస్ కోయిల ముందే కూసింది. కోట్లు ఖ‌ర్చు చేసి వేసిన ప్లాన్ వ‌ర్క‌వుట్ అయింద‌ని సంబురాలు చేసుకున్నారు కేటీఆర్ అండ్ బ్యాచ్. కొడంగ‌ల్ అభివృద్దిని అడ్డుకున్నామ‌ని ఆనందంతో త‌బ్బిబ్బ‌య్యారు. అయితే అస‌లు కథ తెలిసి ఉసూరుమ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ ను తేరుకోలేకున్నారు. ల‌గ‌చర్ల‌, పోలేప‌ల్లి, హ‌కీంపేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో రానున్న‌ది ఫార్మా కంపెనీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ అని ఎప్ప‌టి నుంచో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. ఏడు నెల‌ల క్రిత‌మే ఫార్మా కంపెనీ ప్ర‌తిపాద‌న‌ను వెన‌క్కు తీసుకున్న‌ట్లు అక్క‌డ ప్ర‌జల్లో చాలామందికి తెలుసు. ఈ విషయాన్ని అధికారులు చెప్తూనే వ‌చ్చారు. కానీ కోట్లు ఖ‌ర్చు పెట్టి బీఆర్ఎస్ చేసి విష‌ప్రచారంలో ఇది చాలామంది వ‌ర‌కు వెళ్ల‌లేక‌పోయింది. గ‌తంలో ఐదేళ్ల పాటూ కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిని కావాల‌ని నిర్ల‌క్ష్యం చేసిన బీఆర్ఎస్..ఇప్పుడు అక్క‌డ యువ‌తకు ఉపాధి ల‌భిస్తుందంటే క‌ళ్ల‌లో నిప్పులు పోసుకుంటోంది. ఇండ‌స్ట్రీలు…

Read More

ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ విష‌యంలో బీఆర్ఎస్, బీజేపీ నేత‌ల ప‌రిస్థితి తేలు కుట్టిన దొంగ‌ల్లా త‌యారైంది. రైతుల ఆందోళ‌న‌ల‌తో ప్ర‌జా ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించి…అనుమ‌తుల‌పై పున‌రాలోచ‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే ప్రధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కంటికి కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే అటువైపు వెళ్లే రైతులు త‌మ‌ను త‌రిమి కొడ‌తార‌ని బీఆర్ఎస్, బీజేపీ నేత‌ల‌కు తెలుసు. అస‌లు ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ అంశంపై కాంగ్రెస్ కు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ ఆ బుర‌ద‌ను ప్ర‌స్తుత స‌ర్కారుకు అంటించేందుకు కారు పార్టీ సోష‌ల్ మీడియా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే దిలావార్ పూర్, గుండంప‌ల్లి మ‌ధ్య ఇథ‌నాల్ కంపెనీ కోసం బీఆర్ఎస్ హ‌యాంలోనే అనుమ‌తులు ల‌భించాయ‌న్న సంగ‌తి బ‌య‌టకు రావ‌డంతో ఆ పార్టీ నేత‌లు కిక్కురుమ‌నం లేదు. ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎలాంటి ప్రక్రియ చేప‌ట్ట‌లేదు. కానీ రేవంత్ స‌ర్కారుకు ఈ పాపాన్ని అంట‌గ‌ట్టేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.…

Read More

బీఆర్ఎస్ వికృత క్రీడ‌కు తెర తీసింది. ప్ర‌జాపాల‌న‌ను త‌ట్టుకోలేక కుట్ర రాజ‌కీయాలను ప్రోత్స‌హిస్తోంది. అధికారం కోల్పోయి నిండా సంవ‌త్స‌రం కూడా పూర్తికాలేదు. అప్పుడే అరాచ‌క శ‌క్తుల్ని రంగంలోకి దించుతోంది. ఇప్ప‌టికే వికారాబాద్ క‌లెక్ట‌ర్ పై దాడి వెనుక ప్ర‌త్య‌క్షంగా కేటీఆర్, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు ఉన్న‌ట్లు రుజువైంది. ప‌రోక్షంగా గులాబీ బాస్ ఉన్న‌ట్లు ఆధారాలు కూడా ల‌భ్య‌మ‌య్యాయి. అయితే త‌వ్వేకొద్ది బీఆర్ఎస్ అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. మ‌హ‌బూబాబాద్ లో అల్ల‌ర్ల‌కు కుట్ర చేసి ఫెయిల్ అయిన సంగ‌తి తెలిసింది. అయితే ఇవి మాత్ర‌మే కాదు వీలైన ప్ర‌తీ చోటా అశాంతిని రాజేయాల‌ని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీనికోసం బీహారీ గ్యాంగ్ ను రంగంలోకి దించింది. మాజీ మంత్రి హ‌రీష్ రావు వీటిని పర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ గ్యాంగ్ స‌భ్యులు ప‌ల్లెల్లో ప‌ర్య‌టించి ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా వీడియోలు తీయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్న‌డూ…

Read More

అధికారం కోల్పోగానే ఆగం ఆగం అవుతున్నారు బీఆర్ఎస్ నేత‌లు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు మాని వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల వ‌ర‌కు వచ్చారు. కిందిస్థాయి క్యాడ‌ర్ ను కంట్రోల్ లో పెట్టాల్సిన అధ్యక్ష స్థాయి నేతే నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. సీఎం, మంత్రులు అని చూడ‌కుండా తిట్ల పురాణం అందుకున్నాడు. అవ‌న్నీ రాజ‌కీయ విమ‌ర్శ‌లు అని స‌రిపెట్టుకుందాం అనుకుంటే..ఈ మ‌ధ్య అధికారుల‌ను కూడా వ‌ద‌లడం లేదు. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ప‌నిచేసుకునేవారిని రొచ్చులోకి లాగుతున్నాడు కేటీఆర్. వారి ప‌నుల‌కు ప‌దే ప‌దే అడ్డుప‌డేలా కిందిస్థాయి క్యాడ‌ర్ ను రెచ్చ‌గొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లు నిజంగా సైకో రామ్ లాగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. అధికారంలో ఉండ‌గా క‌లెక్ట‌ర్ల‌తో కాళ్లు మొక్కించుకున్న అహంకారాన్ని…ఇప్పుడు కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేత‌లు. మొన్న‌టికి మొన్న వికారాబాద్ క‌లెక్ట‌ర్ పై దాడికి అమాయ‌కుల్ని రెచ్చ‌గొట్ట‌డం, ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు కుట్ర చేయ‌డం వంటివి ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. అధికారం కోల్పోతే ఇంతగా…

Read More

నిజ‌మైన ప్ర‌జా పాల‌కుల‌కు ఎలాంటి బేష‌జాలు ఉండ‌వు. ఏడాది కాలంగా ఈ విష‌యం తెలంగాణ ప్ర‌జ‌లు ప‌లు సంద‌ర్భాల్లో అర్ధ‌మైంది. ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ కు ఏ మాత్రం ఇబ్బంది క‌లిగినా వారి మ‌న‌సు నొచ్చుకుంటుంది. నేను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే మొండిప‌ట్టుద‌ల వారిలో క‌నిపించదు. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం స్పందించిన తీరు..ఏడాది కాలంగా ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న విధానానికి వెయ్యి రెట్లు తేడా ఉన్న‌ది. ప్ర‌జ‌ల మ‌నసెరిగి పాలించేవాడే నిజ‌మైన నాయ‌కుడు అని సీఎం రేవంత్ రెడ్డి మొద‌టి నుంచి న‌మ్ముతారు. అందుకే ఎక్క‌డా బేష‌జాల‌కు వెళ్ల‌కుండా పాల‌న సాఫీగా సాగుతోంది. తాజాగా అదానీ సంస్థ‌ల నుంచి సీఎస్ఆర్ ఫ్రండ్స్ కింద ప్ర‌కటించిన రూ. 100 కోట్ల‌ను సున్నితంగా తిర‌స్క‌రించ‌డం అదే కోవ‌లోకి వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పాల‌కుడి దార్శ‌నిక‌త‌కు అడ్డం ప‌డుతున్నాయి. త‌ప్పు, ఒప్పుల సంగ‌తి…

Read More

కారు పార్టీ అధినేత గారాల‌ప‌ట్టి వేరు కుంప‌టి పెట్ట‌బోతున్నారా? పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేస్తున్న హ‌డావుడి వెనుక అస‌లు మ‌ర్మం అదే అనే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత బ‌య‌టెక్క‌డా క‌నిపించ‌ని ఎమ్మెల్సీ క‌విత ఈ మ‌ధ్య యాక్టీవ్ అయ్యారు. త‌న అంత‌రంగీకుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీ జెండా, కండువా ఎక్క‌డా లేకుండా కార్య‌క్ర‌మాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నేత‌ల‌తో కూడా అంటీ ముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎమ్మెల్సీ క‌విత వేరు కుంప‌టి ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే బీఆర్ఎస్ నేత‌ల్లో క్లారిటీ వ‌చ్చేసింది. నిజానికి ఇది ఇటీవ‌ల జ‌రుగుతున్న వ్య‌వ‌హారం కాదు. ఆమె జైలుకు వెళ్ల‌క ముందు నుంచే పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా లేరు. కేటీఆర్ తో విభేధాల‌కు సంబంధించి ర‌క ర‌కాల పుకార్లు ఉన్నాయి. వాటిలో నిజాలు కూడా చాలానే ఉన్నాయ‌న్న‌ది బీఆర్ఎస్ నేత‌ల మాట‌. ఇక జైలు నుంచి విడుదలైన త‌ర్వాత…

Read More

పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. స్పీక‌ర్ దే తుది నిర్ణ‌య‌మ‌ని డివిజ‌న్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అంతేకాదు స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేందుకు ఎలాంటి డెడ్ లైన్ లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది కోర్టు. స‌రైన స‌మ‌యంలో స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతోపాటూ గ‌తంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది డివిజ‌న్ బెంచ్. ఈ తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌ని, త్వర‌లోనే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఊహ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగిన బీఆర్ఎస్ నేత‌ల ఆశ‌ల‌న్నీ అడియాశ‌లే అయ్యాయి. హైకోర్టు తీర్పు ప్ర‌జా ప్ర‌భుత్వానికి బూస్ట్ ఇచ్చింది. ప్ర‌తిప‌క్షం ఉండకూడ‌ద‌నే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌న్న బీఆర్ఎస్ వాదన‌ల‌కు కూడా బ్రేక్ ప‌డింది. అయితే ఈ ఏడాది కాలంగా ప్రజా స‌ర్కార్ వ్య‌వ‌హార‌శైలి చూస్తుంటే…బీఆర్ఎస్ వాద‌నంతా ఉత్తిదే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. రెండు ట‌ర్ముల్లో ప్ర‌తిప‌క్షాల ప‌ట్ల కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి..ఇప్పుడు రేవంత్…

Read More

కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయింద‌న్న అబ‌ద్ద‌పు వార్త‌ల‌కు HMDA వెల్ల‌డించిన నిజాలు చెక్ పెట్టాయి. HMDA ప‌రిధిలో అప్లికేష‌న్ల ప‌రిష్కారం ఆల‌స్యం అవుతుంద‌ని, TGbPASS ద్వారా నిర్మాణ అనుమతులు ఆల‌స్యం అవుతున్నాయ‌ని కొన్ని ప్రింట్, ఎల‌క్ట్రానిక్, డిజిట‌ల్ మీడియాల్లో కొద్దిరోజులు విప‌రీతంగా త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారు. HMDA లో అప్లికేష‌న్ల సంఖ్య చాలా త‌గ్గింద‌ని, వాటి క్లియ‌రెన్స్ ప్ర‌క్రియ కూడా నెమ్మ‌దిగా సాగుతున్న‌దని మీడియాలో రాసుకొచ్చారు. కానీ అవేమి నిజాలు కాద‌ని HMDA స్ప‌ష్టం చేస్తోంది. అనుమ‌తుల ప్ర‌క్రియ గ‌తంలో పోలిస్తే వేగ‌వంత‌మైంద‌ని అధికారులు తెలిపారు. త‌మ‌ నుంచి ఎలాంటి వివ‌రాలు, వివ‌ర‌ణ కోరకుండా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించ‌డం స‌రికాదన్నారు. బాధ్య‌తాయుత‌మైన మీడియా సంస్థ‌లు ఇలాంటి త‌ప్పుడు స‌మాచారాన్ని అందించ‌డం ఏ మాత్రం మంచిది కాదు. HMDA కు వ‌చ్చిన అప్లికేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు అధికార‌యంత్రాంగం శ్ర‌మిస్తోందన్నారు. అంతేకాదు గత‌డాదితో పోలిస్తే అప్లికేష‌న్ల సంఖ్య కూడా పెరిగిందని, నిత్యం…

Read More

మహారాష్ట్ర ఎన్నికల్లో కారు హార‌న్ మూగ‌బోయింది. రెండేళ్ల క్రితం ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన భార‌త రాష్ట్ర స‌మితి..త‌మ మొద‌టి టార్గెట్ మ‌హారాష్ట్ర ఎన్నిక‌లే అని ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ చేసిన హ‌డావుడి, ప్ర‌చార ఆర్భాటం అంతా ఇంతాకాదు. మేం అడుగు పెట్ట‌గానే అక్క‌డి నేత‌ల గుండెల్లో వ‌ణుకు మొద‌లైంద‌ని కేసీఆర్ స‌భ‌ల్లో స్వయంగా ప్ర‌క‌టించుకున్నారు. వంద‌లాది కార్ల‌తో రోడ్ షో..మాజీ వార్డు మెంబ‌ర్ల నుంచి మాజీ స‌ర్పంచ్ లు, జెడ్పీటీసీలు, ఒక‌రిద్ద‌రు ఎన్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేత‌లకు గులాబీ కండువాలు కప్పేశారు. ఇక మ‌హారాష్ట్ర రైతుల జీవితాలు బాగు చేసేవ‌ర‌కు విశ్ర‌మించేది లేద‌ని స్పీచ్ లు దంచికొట్టారు. అయితే ఏడాదిలోపే జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స‌యింది. దీంతో కారు పార్టీ అధినేత ఫామ్ హౌజ్ కే ప‌రిమిత‌మ‌య్యారు. రైతుల జీవితాల‌ను బాగు చేసేవ‌ర‌కు త‌న‌కు విశ్రాంతి లేద‌న్న…

Read More