Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతో రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోన్న చక్రధర్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను రేప్ కేసులో అరెస్ట్ చేసినట్లు శామీర్ పేట పోలీసులు మీడియాకు వెల్లడించారు. చక్రధర్ గౌడ్ అతని స్నేహితుడి భార్యపై కన్నేసి .. అత్యాచారయత్నం చేసినట్లు ఫిర్యాదు అందటంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఇక…చక్రధర్ గౌడ్ అరెస్ట్ పై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. రాజకీయ కుట్రతోనే అత్యాచారం కేసులో చక్రధర్ అరెస్ట్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. రైతు బంధు పథకంలో భారీగా అవినీతి జరుగుతుందని చక్రధర్ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా మంత్రులు , ఎమ్మేల్యేలు, ఎంపీలు రైతు బంధును వదులుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పెడుతున్నారు. రైతులపై ప్రేమతోనే ‘రైతుబంధు గీవ్ ఇట్ అప్’ పేరుతో ఆయన రైతు బంధు ను స్వచ్ఛందంగా…
సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ కు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలివచ్చారు. టికెట్ల జారీలో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది గేట్లు దూకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. భారత్ – కంగారుల మధ్య టీ -20 మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ ఏర్పాట్లు చేసింది. జింఖానా మైదానంలో టికెట్లు విక్రయాలు జరుగుతాయని హెచ్ సీఏ వెల్లడించింది. టికెట్ల కోసం తల్లవారుజాము నుంచే క్రీడాభిమానులు బారులుతీరారు. మూడు వేల టికెట్ల కోసం ముప్పై వేల మంది రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొంతమంది గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించగా ఖాకీలు తమ లాఠీలకు పని చెప్పారు.…
దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన వెనక లొగొట్టు ఏంటి..? ఈ పథకం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుతోనే కేసీఆర్ ప్రకటించారా..? రేవంత్ ను నిలువరించాలంటే గిరిజన బంధు అస్త్రాన్ని ప్రయోగించాలని కేసీఆర్ అండ్ కో భావించిందా..? ఈ పథకం రేవంత్ విజయమా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మాత్రం టీఆరెస్ కు గెలుపు అంత ఈజీ కాదని అర్థమైపోయింది. 2018 ముందస్తు ఎన్నికల్లో రేవంత్ ను కొడంగల్ లో ప్రచారం నిర్వహించకుండా అరెస్టు చేసి, మొత్తం మంత్రివర్గం అంత అక్కడే మకాం వేసి లేనిపోని హామీలు ఇచ్చి రేవంత్ ను ఓడించారు కాని, ఈసారి మాత్రం రేవంత్ ను మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడం కష్టమేనని కేసీఆర్ కు భయం పట్టుకుంది. పైగా, ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి…
“యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా “అంటే స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. కాని నేటి సమాజం స్త్రీని ఒక ఆట వస్తువులాగా, పిల్లలను కనే ఒక యంత్రంలాగా వంట వండి పెట్టే ఒక సాధనం లాగా చూస్తుంది. మనదేశంలో సినిమాలు , సీరియళ్లు, వ్యాపార, వాణిజ్య ప్రకటనలు మహిళలను ( వస్తువులుగా పరిగణిస్తున్నాయి.) అగౌరవపరుస్తూ చూపిస్తూనే ఉన్నాయి. దీనితో పసికందు నుండి పండు ముసలి వరకు మహిళలపై లైంగిక అత్యాచారాలు నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. ఆడ శిశువులను పొత్తిల్లో చంపేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల పట్ల పురుషులు చూసే ఆలోచనా విధానంలో మార్పు రానంతవరకు స్త్రీల పట్ల నేరాలు పెరుగుతూనే ఉంటాయి. అందుకు దేశవ్యాప్తంగా NCRB 2021 సంవత్సరంలో స్త్రీల పైన పెరిగిన దారుణాలు ఈ నెలలో NCRB విడుదల చేసింది. భారతదేశంలో 2021 సంవత్సరంలో మహిళలకు జరుగుతున్న నేరాలపై ప్రతి గంటకు 49 కేసులు నమోదవుతున్నాయి.…
సెప్టెంబర్ 17పై టీపీసీసీ కీలక ప్రతిపాదనలు సెప్టెంబర్ 17కు సంబంధించి మూడు కీలక అంశాలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపాదించారు. టీఆరెస్ కు పర్యాయపదంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చాడని..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీన్ని సవరించి టీజీ పెట్టుకోవాలని ఆయన సమావేశంలో ప్రతిపాదించారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలిన అవసరముందన్నారు. అలాగే సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. సెప్టెంబరు 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు సూచనలు చేయాల్సిందిగా పార్టీ నేతలను కోరారు రేవంత్. సెప్టెంబర్ 17తో ఎలాంటి సంబంధం లేని బీజేపీ… మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పేటెంట్ ను బీజేపీ, టీఆరెస్ హైజాక్ చేస్తున్నాయని…
జీడి గింజ సిగ్గు లేదా అంటే నల్లుగున్న నాకేం సిగ్గు అన్నదంట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో కాంట్రాక్ట్ బేరగాడు ఆర్జీ పాల్ వ్యవహరిస్తోన్న తీరు కూడా ఇలాగే ఉంది. నాపాటికి నేను పార్టీ వీడితే రేవంత్ నన్ను అన్నేసి మాటలు అంటాడా అనే ఫ్రస్టేషన్ లో తెగ ఊగిపోతు ఎదో మాట్లాడబోయి.. ఎదో మాట్లాడుతూ నవ్వులపాలైంది చాలక తాజాగా మరో కార్యం ముంగిటేసుకొని జనాల చేత ఛీ కొట్టించుకుంటున్నాడు ఆర్జీ పాల్. ఎమ్మెల్సీ కవితకు చెందిన కంపెనీలతో అడికోర్ కంపెనీ వ్యాపార సంబంధాలు కలిగి ఉండటంపై ఆర్జీ పాల్ ఎత్తిచూపారు. ఎందుకంటే ఈ అడికోర్ కంపెనీ మొదటి డైరక్టర్ గానున్నది రేవంత్ కాబట్టి. అయితే, రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ బుక్ చేద్దామా అనే ఆవేశంలో వాస్తవాలకు ముసుగు తొడుగుతున్నాడు ఆర్జీ పాల్. ఇందులో భాగంగా వెంటనే ప్రగతి భవన్ – గాంధీ భవన్ భాయ్ భాయ్…
Q:- రేవంత్ రెడ్డి ఎంపీ గా ఉండి ghmc ల ఎన్ని సీట్లు గెలిపించిండు?Ans:- నీ సొంత ఊర్ల సర్పంచ్ ను గెల్పించుకున్నవా! నీ అన్నని జెడ్పీటీసీ గ గెల్పించుకున్నవా? Q:- రేవంత్ రెడ్డి బ్లాక్ మేయలర్!Ans:- నీకొచ్చిన కాంట్రాక్టును టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు కమీషన్లకు అమ్ముకున్నది నిజం కాదా! నెల కింద నువ్వు పొయ్యి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ను ఎందుకు కలిసినట్టు..?? Q:- రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎడ ఉన్నడు, ఎక్కడా పాల్గొనలేదు..!Ans:- సీమాంధ్ర ముఖ్యమంత్రిపై అసెంబ్లీల గర్జించిన మాటలు ఇంకా అట్లనే ఉన్నయి.. నువ్వన్నటే చెయ్యలేదు అనుకుందాం, మరి ఆరోజు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒకటికి నాలుగసార్లు ఎందుకు ఆహ్వానించినట్టు..!! Q:- కాంగ్రెస్ పార్టీ కోసం నేను రాజ్ న్యూస్ పెట్టిన..Ans:- పెట్టినవ్ కరెక్టే, నువ్వు కాంగ్రెస్ లనే ఉండి బీజేపీ కి అమ్ముకున్నవ్ కదా!! Q:- రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నడు,…
హైడ్రామాకు తెరదించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి లాజిక్ లేకుండా మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని ఓసారి… మరోసారి కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకే రాజీనామా అంటూ నాలుక మడతేశారు. అంతేకాదు.. తన రాజీనామా మునుగోడు ఆత్మగౌరవానికి సంబంధించినది అంటూ నియోజకవర్గ ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కాని తను కాంగ్రెస్ కోసం త్యాగం చేశానని మాట్లాడం ఆశ్చర్యపరిచింది. 2009లో వ్యాపారవేత్తగా ఉన్న రాజగోపాల్ కు భువనగిరి లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అవకాశం కల్పించింది కాంగ్రెస్. 2014లో భువనగిరిలో ఓటమి పాలైతే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి గౌరవించింది. ఆ తరువాత 2018ముందస్తు ఎన్నికల్లో మునుగోడు…
రాజన్న మేము గుర్తున్నమ అన్న … గాదె అన్న నికోసం … మా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాం చూడు … మమల్ని కార్యకర్త అంటారు అన్న … నీకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటిది అన్న … ఓ … నీ జీవితానికి గుర్తింపు ఈచ్చిందుకు కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … గట్లనే నిన్ను ఎంపీ చేసినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … మీ అన్నకు మంత్రిని చేసే , ఎమ్మెల్యే నీ చేసే గందుకే కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … నీకు mlc , ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … నీ company లు పెంచుకున్నవ్ కదా అన్న గందుకే కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … బీజేపీ రేట్లు పెంచి…
తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలలో కలుషిత ఆహరం తిని తల్లడిల్లుతోన్న విద్యార్థుల వేదనలే పేపర్లో బ్యానర్ ఐటెం గా ప్రతిరోజు కనిపిస్తున్నాయి. జిల్లాకో చోట కలుషిత ఆహరం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలైన సంఘటనలు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. అంగన్ వాడీ, ప్రాథమిక , సెకండరీ , హై స్కూల్ , గురుకుల స్కూళ్ళ నుంచి యూనివర్సిటీల స్థాయివరకున్న వసతి గృహాలలో కలుషిత ఆహరంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి అవుతున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.. ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన భోజనం అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఫెయిల్ అయింది. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన టీఆర్ఎస్…సర్కార్ సంక్షేమ వసతి గృహాల్లో తినే తిండిని కూడా కలుషితం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. గత కొన్నాళ్ళుగా కలుషిత ఆహరం తిని విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతున్నా ప్రభుత్వం మకేమి అన్నట్లుగా…