Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
గచ్చిబౌలిలో 400 ఎకరాల భూవివాదం ఓ పచ్చి నిజాన్ని బయటపెట్టింది. చాలా రోజులుగా రహస్యంగా సాగుతున్న బీఆర్ఎస్, బీజేపీ స్నేహం బట్టబయలైంది. నిజానికి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందినదని అక్కడ ఆందోళనలు చేస్తున్నవారికి కూడా తెలుసు. దాని వెనుకున్న నిజానిజాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. సర్వేనం.25 లోని 400 ఎకరాల భూమిని 2004 లో నాటి ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం IMG అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే ఆ కంపెనీ ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూకేటాయింపును రద్దు చేసింది. దీంతో ఆ కంపెనీ 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన అన్ని రుజువులను కోర్టుల్లో రుజువు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ భూమి చట్టపరంగా తమదేనని, ఏ ప్రైవేట్ సంస్థకు లేదా వ్యక్తికి…
ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేత.. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి కొత్త ఇంచార్జి జనరల్ సెక్రెటరీ. ఇలాంటి సందర్భంలో ఇంచార్జి దృష్టిలో పడటానికి కాంగ్రెస్ నాయకులు పడని పాట్లు ఉండవు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్లు వేయడం, భారీ కాన్వాయ్ లు, ఫ్లెక్సీలు గట్రా కట్టి హడావుడి చేయడం కామన్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పని చేసిన గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లు గాంధీ భవన్ వస్తె హైదరాబాద్ మొత్తం పబ్లిసిటీతో నిండిపోయేది. అలాంటిది దేశంలోనే రిచేస్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఇంచార్జి అంటే ఇంకొంచెం ఎక్కువగానే ఆర్భాటం ఉంటుంది…కానీ సీన్ కట్ చేస్తే…. ఆమె మాత్రం ట్రెయిన్ లో నుండి దిగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రూటే సపరేటు. ఆమె అసలు సిసలైన గాంధేయవాది. సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆమెకు రాజకీయ నాయకులకు ఉండే హంగు ఆర్భాటాలు అబ్బలేదు.…
తెలంగాణలో ఏం నడుస్తుండంటే…జనాల నోటి నుంచి వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రజా ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉంటే..ప్రతిపక్షం మాత్రం అబద్దాలను ప్రచారం చేసే పనిలో బిజీ అయిపోయిందని చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. రాష్ట్రంలో అవకాశాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయనపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సింగపూర్కు చెందిన పలు కంపెనీలు రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమల్లో ఇన్వెస్టిమెంట్ చేయనున్నారు. రాబోయే రోజుల్లో వేల కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నారు. సీఎం వెళ్లి స్వయంగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు వివరించి..పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇస్తే ఎవరు కాదంటారు. గతంలో అమెరికా పర్యటనలోనూ పెట్టుబడుల కోసం అనేక సమావేశాలు నిర్వహించారు రేవంత్రెడ్డి. ఆయన కృషితో పలు రంగాల్లో 31వేల 532 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 30వేల నూతన ఉద్యోగాలు రానున్నాయి. ఇక…
అధికారం పోయినప్పటి నుంచి ఆగం ఆగం అవుతున్న గులాబీ పార్టీ నేతలకు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువై పోయాయి. పార్టీలో ఆధిపత్యం కోసం నాలుగు వర్గాలుగా ఏర్పడి కొట్టుకుంటున్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులు…బయటకు సఖ్యతగా కనిపిస్తున్నప్పటికీ..లోపల మాత్రం కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే భారత జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకొని రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మిగిలిన కేటీఆర్, హరీష్ రావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఫార్ములా ఈ కార్ స్కామ్ లో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో హరీష్ రావు వర్గం లోలోపల చాలా సంతోషంగా ఉందంట. అయితే ఫార్ములా ఈ కార్ స్కామ్ తో పాటూ కేటీఆర్ చేసిన అరాచకాలన్నీ తెలిసిన హరీష్ రావు వాటి బంఢారం కూడా బయట పడితే బాగుండు అని అనుకుంటున్నారట. ఇందుకోసం వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఒకవైపు…
నిజం చెప్పులేసుకునేలోపు…అబద్దం దునియా మొత్తం తిరిగి వస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అబద్దాలను ప్రచారం చేయడంలో అభినవ గోబెల్స్ గా మారిపోయింది. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఉన్నవి లేనట్లు చూపిస్తోంది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిచేస్తుంటే కూడా వాటిని వక్రీకరించి చూపిస్తోంది. నానక్ రాంగూడలో ఏర్పాటు చేసిన 23 కిలో మీటర్ల సైకిల్ ట్రాక్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజానికి ట్రాక్ ను బీఆర్ఎస్ హయాంలోనే హడావుడిగా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాన్ని కంప్లిట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంతో అధికారులు చేసిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకోలేదు. శివారు ప్రాంతంలో నిర్మించిన సైకిల్ ట్రాక్ ఒక రికార్డుగా మిగిలిపోవాలనే ఉబలామే తప్పితే..దాని వల్ల వచ్చే సమస్యలను పట్టించుకోలేదు. నానక్ రాంగూడ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో గచ్చిబౌలిని…
పుష్ప క్రేజ్ తో వాపును చూసి బలుపు అనుకున్నాడు బన్నీ. అది ఆయన తప్పిదమా? లేకపోతే చుట్టూ ఉన్న మందీ మార్భలం చూపించిన అత్యుత్సాహమా? అన్న చర్చ విస్తృతంగా నడుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు. సెలబ్రెటీ అరెస్టు కాబట్టి శాంతిభద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. అందుకే మొత్తం ఎపిసోడ్ చాలా ప్రశాంతంగా సాగింది. ఆయన్ను అదుపులోకి తీసుకోవడం తర్వాత నిబంధనల ప్రకారం ఆస్పత్రికి, కోర్టుకు తీసుకెళ్లడంలో ఎక్కడా జాప్యం చేయకుండా కట్టుదిట్టంగా సాగింది ప్రక్రియ. దీనిపై పోలీసు శాఖను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. అయితే అసలు అల్లు అర్జున్ అరెస్టుకు ఆయన సొంత మేనేజర్ చేసిన నిర్వాకమే కారణమన్న విషయం బయటకు పొక్కింది. సంధ్యా థియేటర్ ఘటనపై రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్…బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. దీంతో అంతా ప్రశాంతమే అనుకున్నారు.…
ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే తెలుసు కదా! ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాల పని అలాగే ఉంది. చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తుంటే ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయి. పదేళ్లు అధికారం వెలగబెట్టిన వారికి చట్టం ఎలా పనిచేస్తుంది. ఒక కేసు నమోదైతే ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయన్నది తెలియక కాదు. కానీ రేపో…ఎల్లుండో తమకు కూడా ఇలాంటి గతే పడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఇంతకీ ఇదంతా దేని గురించో అర్ధమైంది కదా! అల్లు అర్జున్ అరెస్ట్ గురించే. సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా మహిళ మృతిపై నమోదైన కేసులో అల్లు అర్జున్ ఏ 11గా ఉన్నారు. ఇప్పటికే థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఇంచార్జ్, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇదంతా చట్టప్రకారం జరుగుతున్న చర్య. నిజానికి తన అరెస్ట్ విషయం అల్లు అర్జున్ కు కూడా ముందే తెలుసు…అందుకే హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దానిపై…
వరంగల్ జిల్లాలోని ఆ పోలీస్ స్టేషన్ లో అసలు కేసులే రిజిస్టర్ అవ్వవు. ప్రతి సంవత్సరం ముగింపులో జరిగే మదింపులో వారి పీఎస్ పరిధిలోనే అతితక్కువ కేసులు నమోదవతున్నాయి. అబ్బా ఎంత చక్కటి పరిపాలన, శాంతిభద్రతలు ఎంత చక్కగా కాపాడుతున్నారు. ఇదే కదా మీ మదిలోకి వచ్చిన ఆలోచన. నిజానికి ఇక్కడ పనిచేస్తున్నది పోలీసుల సమర్ధవంతమైన పహారా కాదు. స్థానిక ఎస్సై బెదిరింపులు, అమ్యామ్యాలు. ఇంతకీ ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడనే కదా మీ అనుమానం. నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ పోలీస్ స్టేషన్. కేసులు పెట్టేందుకు ఎవరైనా స్టేషన్ కు వచ్చారంటే అంతే సంగతులు. వారి జేబులు ఖాళీ అవ్వాల్సిందే. వారి కేసు నమోదు అయ్యేందుకు తిరిగి, తిరిగీ చెప్పులు అరగాల్సిందే. ఎన్ని ఆధారాలున్నా అక్కడ పనిచేయవు. కేవలం అక్కడ పనిచేసేంది లంచాలు మాత్రమే. చేయి తడపనిదే ఆ పోలీస్ స్టేషన్ లో పని జరుగదు. ఒకవేళ కేసు రిజిస్టర్ చేయాల్సిందే…
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడాది ప్రజా విజయోత్సవాలను చూస్తూ ఓ పక్క బాధలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు..తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏడాది పాలనపై చేసేందుకు విమర్శలు ఏవీ లేకపోవడతో చిల్ అయ్యేందుకు కేటీఆర్ విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఈ ఉత్సవాలపై పడి ఎలా ఏడ్వాలో తెలియక గులాబీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో కవిత మళ్లీ యాక్టీవ్ అయ్యారు. అలాగని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. కేవలం తనకు కావాల్సిన కొందరు నేతలతో మాత్రమే క్రియాశీలకంగా మాట్లాడుతున్నారు. దీంతో కారు పార్టీ నేతల్లో ఓ చర్చ ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైఎస్ జగన్ కు షర్మిల్ ఎలా కొరకరాని కొయ్యగా మారిందో…ఇక్కడ కేటీఆర్ కు కవిత కూడా అలాగే తయారయ్యారని చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకునేందుకు కేటీఆర్ కంటే తనకు తక్కువ అవకాశం లభించిందని, పార్టీలో కూడా తన మాట చెల్లలేదని ఆమె…
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజులుగా ఆయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఘటనలు జరిగాయి. ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరిని మావోయిస్టులు చంపేశారు. ఆ తర్వాత రోజే భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయన మరణానికి కారణాలపై అనేక కథనాలు వచ్చాయి. ఎన్ కౌంటర్, ఇన్ ఫార్మర్ల హత్యకు లింక్ పెట్టి వార్తలు వచ్చాయి. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో జరిగిన ఆత్మహత్యగా తేలింది. ఆయనకు ఉన్న వ్యక్తిగత కారణాల వల్లనే ఆయన సూసైడ్ చేసుకున్నారని సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఎస్సై హరీష్ స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం. ఆయనకు…