Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
త్వరలోనే సిరిసిల్లకు ఉప ఎన్నిక రాబోతుందా? కేటీఆర్ రాజీనామాతో సిరిసిల్లకు మహర్ధశ పట్టబోతున్నట్లు కనిపిస్తోంది. నిజంగా చిత్తశుద్ది ఉంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నోటికి వచ్చిన అబద్దాలు మాట్లాడుతున్న కేటీఆర్…ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సవాళ్లు కూడా విసురుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత అక్కడ అభివృధ్దే జరుగలేదంటూ తన మార్కు ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. దీన్ని నమ్మించేందుకు సవాల్ కూడా విసిరారు. అయితే కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృధ్ధి ముందు కేటీఆర్ ఫేక్ ప్రచారం బొక్క బోర్లా పడింది. అక్కడ ఏకంగా 4వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నట్లు ఆధారాలతో సహా రుజువు చేశారు స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు. ఇందుకు సంబంధించిన లెక్కలు విడుదల చేశారు. వారు చెప్పిన లెక్కల ప్రకారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు ఇలా ఉన్నాయి… 1. పారడైజ్ జంక్షన్…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వార్ వన్సైడ్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలతో ప్రత్యర్ధులు చిత్తవుతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజార్టీ వర్గాలు కాంగ్రెస్కు మద్దతు తెలిపాయి. తాజాగా సీఎం రేవంత్రెడ్డి రోడ్ షోతో లెక్కలన్నీ మారిపోయాయి. నియోజకవర్గానికి ఏం కావాలో, ఏం చేస్తామో స్పష్టంగా చెప్పడంతో ప్రత్యర్ధుల గుండెల్లో రాయి పడింది. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల ద్వారా లబ్దిపొందిన వారితో పాటూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో జూబ్లీహిల్స్ బస్తీల్లో జరిగిన అభివృద్ధి, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో తర్వాత జూబ్లీహిల్స్ బస్తీల్లో కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, నవీన్ యాదవ్ ప్రజాసేవపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు ఓటర్లు. పేరుకే నగరం నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తమ బస్తీల్లో ఒక్క ఇంచు కూడా మార్పు జరుగలేదని పలు…
అన్ని వర్గాలను కడుపులో పెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత. ప్రాంతీయ పార్టీల మాదిరిగా నియంతృత్వ, కుటుంబ పోకడలకు దూరం. అందుకే కాంగ్రెస్ ప్రజల పార్టీ అయింది. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఇదే ఆనవాయితీన ముందు నుంచి కొనసాగిస్తూ వస్తున్నది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లడమే ప్రజా సర్కారు ఉద్దేశం. అందుకే ఎక్కడా లేని విధంగా తెలంగాణ కేబినెట్ సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. కేబినెట్లో ముగ్గురు బీసీలు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ఉన్నారు. తాజాగా అజారుద్దీన్కు కేబినెట్లో చోటు కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దేశానికి ప్రపంచకప్ తీసుకువచ్చిన టీమ్లో సభ్యుడు, కెప్టెన్గా టీమ్ ఇండియాను నడిపించిన సమర్ధవంతమైన లీడర్, హైదరాబాద్లో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న అజారుద్దీన్ ఈ పదవికి అర్హుడని అంటున్నారు. ఈ పదవి జూబ్లీహిల్స్ ఉప…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అభివృద్ధికి జై కొడుతున్నాయి. దీంతో రహస్య మిత్రులు బీఆర్ఎస్, బీజేపీలకు వణుకు పుడుతోంది. అందుకే ప్రతి పనికి అడ్డుపడుతున్నాయి. తాజాగా అజారుద్దీన్కు మంత్రిపదవి విషయంలో బీజేపీ చేసిన పని అందుకు నిదర్శనం. తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్ తీసుకుంటున్నట్లు వార్తలు రాగానే…బీజేపీ ఉలిక్కిపడింది. ప్రతి అంశాన్ని కులం, మతం అంటూ లింక్ పెడుతూ అభివృధ్ధికి ఆటంకంగా మారుతోంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఆ పార్టీ సంకుచిత స్వభావాన్ని తెలియజేస్తున్నది. అజారుద్దీన్ ముస్లిం నేత కాబట్టి జూబ్లీహిల్స్లో ముస్లింలను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనం. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ మాట్లాడుతుంటే…బీజేపీ మాత్రం కులాలు, మతాలు అంటూ తన మార్కు రాజకీయాలు చేస్తోంది. నిజానికి అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సిద్దాంతం అందుకే బీసీలకు 42 శాతం…
బీఆర్ఎస్కు సినిమా చూపించిన రేవంత్రెడ్డి మా దేవుడు నువ్వేనయ్యా అంటూ సినీ కార్మికులు సంబురాలు బీఆర్ఎస్ వెన్నులో వణుకు మొదలైంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఆగం అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. తాజాగా తెలుగు సినీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార శైలి మారిపోయింది. ఒక్కో వర్గం క్రమంగా కాంగ్రెస్కు మద్దతు పలుకుతుండటంతో వార్ వన్ సైడ్ అని అంతా ఫిక్సయ్యారు. పదేళ్ల పాటూ సినీ రంగం కోసం ఇది చేశామంటూ చెప్పుకునేందుకు ఏ ఒక్క పనీ లేకపోవడంతో…బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. సినీ కార్మికుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ ఇచ్చిన హామీలతో ఆ వర్గాల్లోనూ హర్షాతిరేకాలు మొదలయ్యాయి. రేపటి భవిష్యత్ కోసం ఆలోచించే విజన్ ఉన్న రేవంత్ రెడ్డి..రాజకీయాల కోసం కాకుండా మనసున్న మనిషిలా ఆలోచించారు. సినీ కార్మికుల పిల్లలకు ఉన్నత…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవడం కష్టమని తేలిపోయింది. అందుకే కావాల్సినంత డ్యామేజ్ చేయాలని అన్ని రకాలుగా ప్లాన్ చేస్తోంది. ఇన్నాళ్లూ కలిసున్న ప్రజల్ని కులాలు, వర్గాలుగా విడదీస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పదేళ్లు ఏం చేశామో చెప్పేందుకు ఏమీ లేకపోవడంతో…తప్పుడు ప్రచారాలు, ఎన్నికల ఉల్లంఘనలతో బరితెగిస్తోంది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాలన్న తపనతో అడ్డమైన గడ్డీ కరుస్తోంది. పదేళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్కు ఎన్నికల నిబంధనలు తెలియనివి కాదు. కానీ పోల్ చిట్టీలు పంచుతూ స్వేచ్ఛంగా ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అంతేకాదు కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ..ప్రజలతో విభజన రాజకీయాలు చేస్తోంది. ఇక ముస్లీంలను రెచ్చగొట్టేలా విభజన గీత గీస్తోంది. ఎన్నికలంటే ప్రజలకు తాము ఏం చేశామో…ఏం చేస్తామో చెప్పాలి. కానీ బీఆర్ఎస్ మాత్రం అవన్నీ పక్కన పెట్టి ఫేక్ ప్రచారాలు, నాలుగు తిట్లు మాత్రమే ఎన్నికల ప్రచారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు సెంటిమెంట్ రాజకీయాలకు పదును పెడుతోంది. కానీ ఏ ఒక్క…
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. తమ అరాచకాలకు అడ్డు పడుతున్నందుకు ఓ కంపెనీ చేసిన తప్పుడు ప్రచారమే ఈ మొత్తం వ్యవహారానికి కారణమని తెలుస్తోంది. తప్పుడు సమాచారంలో పోలీసులను తప్పుదోవ పట్టించడమే కాకుండా…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వాడుకుంటూ దందాలు చేయడమే ఆ కంపెనీ నైజం. ఇచ్చిన పర్మీషన్లను మించి మైనింగ్ చేయడమే కాకుండా.. ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న దక్కన్ సిమెంట్స్ కంపెనీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బీఆర్ఎస్ హయాంలో సాగినట్లు..తమ దందాలు ఇప్పుడు సాగకపోవడంతో దక్కన్ సిమెంట్స్ ప్రతినిధులు అల్లిన కట్టుకథ అని తేలిపోయింది. దక్కన్ సిమెంట్స్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినందుకు రోహిన్ రెడ్డిపై కావాలని తప్పుడు ప్రచారం చేశారని ఎవరికైనా అర్ధం అవుతుంది. అంశాన్ని లోతుగా తెలుసుకోకుండా బద్నాం చేయడం సరికాదు.#DeccanCements #RohinReddy #CMRevanthReddy #KondaSurekha pic.twitter.com/MnNiy2Yx7g — PolyTricks (@PolyTricks_in) October 24, 2025 నిజానికి ఈ…
టీకప్పులో తుపాన్ ముగిసింది. కాంగ్రెస్ కుటుంబమంతా ఒకటే అని మరోసారి రుజువైంది. తెలంగాణ మంత్రివర్గంలో ఏదో జరిగిపోతుందని చిలువలు పలువలు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటూ నాయకులకు రాత్రంతా నిద్ర పట్టలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం కొండాసురేఖ ఇచ్చిన క్లారిటీతో సమస్య సమసిపోయింది. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె క్లారిటీ ఇవ్వడంతో అక్కడితో పుల్స్టాప్ పడింది. తమది ఒక కుటుంబం అని..ఇందులో చిన్న చిన్న బేధాభిప్రాయాలు సహజమే అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ముఖ్యమంత్రిపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం…ఇక్కడ మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. పార్టీ విధివిధానాలు, ప్రభుత్వ పనితీరుపై ఓపెన్ గా మాట్లాడే ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఎక్కడా వెనుకాడదు ప్రజా సర్కార్. విమర్శలను కూడా చాలా హుందాగా స్వీకరిస్తుంది. అయితే…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ గెలుపును ఆపేందుకు బీఆర్ఎస్ నానా విధాలుగా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ సీటులో తిరిగి గెలిచేందుకు తంటాలు పడుతున్నప్పటికీ …అది సాద్యం కాదని వారికి అర్ధమయింది. కాబట్టి ఏదో రకంగా కాంగ్రెస్పై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను వర్గాలుగా విభజించే కుట్రలకు తెరతీసింది. వాస్తవానికి జూబ్లీహిల్స్లోని ముస్లిం ఓటర్లంతా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఎంఐఎం కూడా నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వానికి మద్దతు పలికింది. దీంతోపాటూ జూబ్లీహిల్స్లో స్థానికుడైన నవీన్ యాదవ్కు సమస్యలపై అవగాహన, కొట్లాడేతత్వం ఉందని ప్రజలందరి నోటా వినిపిస్తున్న మాట. వీటన్నింటికీ తోడు ప్రజా సర్కార్ చేస్తున్న సంక్షేమ పాలనపై ప్రజల్లో ఉన్న పాజిటివ్ రెస్పాన్స్ కూడా నవీన్ యాదవ్ గెలుపునకు కారణంగా మారుతుంది. ఈ క్రమంలో ముస్లీం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఏళ్లుగా ముస్లింలకు…
ఎంపీటీసీ స్థాయి వ్యక్తి అయినా సరే తన ప్రత్యర్ధినో, లేదా తనతో విభేధించే వ్యక్తి కనిపిస్తే అధికార దర్పం ప్రదర్శిస్తారు. పదవులు రాగానే తనకంటే సీనియర్లను కూడా లెక్క చేయరు. రాజకీయాల్లో సీనియారిటీ కంటే పదవులకే పవర్ ఎక్కువ కాబట్టి ఇది సాధారణమే. మరి సీఎం స్థాయి వ్యక్తికి ఎంత పవర్ ఉంటుంది. ఆయన తలచుకుంటే తనతో విభేదించే ఎమ్మెల్యేను ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు. కావాలంటే ముప్పుతిప్పలు పెట్టొచ్చు. కానీ రేవంత్ రెడ్డి స్టయిలే వేరు. అందరినీ కలుపుకొని వెళ్లడమే ఆయన సక్సెస్ మంత్రా. వ్యక్తిగతంగా తనతో ఎంత విభేధించే నాయకుడు అయినా సరే..కలుపుకొని వెళ్లేందుకే ప్రయత్నిస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులను వరించని ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది. గత ఎన్నికల ముందు బేషజాలకు వెళ్లకుండా అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీని విజయతీరాలకు చేర్చాడు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసిన సందర్భంలో…