Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు రెఫరెండం ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 65 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి అధికారం అందిస్తే…తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేశారు. ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లాంటి అర్బన్ ఏరియాల్లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్కు పట్టం గట్టారు పట్నం ప్రజలు. ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ అఖండ మెజార్టీ అందించి అండగా నిలిచారు పల్లెవాసులు. రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి వందకు వందశాతం మార్కులు వేసి, సంపూర్ణంగా ఆశీర్వదించారు. మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ 8 వేల 335 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కూడా 33శాతం స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. ఏకంగా 66శాతం స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులు గెలవడమంటే…పల్లెల్లో ప్రజాపాలనపై ఏ స్థాయిలో నమ్మకం పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.…
ఎన్నికలు ఏవైనా సరే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతూనే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓట్షేర్తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన రెండేళ్లలో ప్రజలు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్షేర్ పెరుగుతూనే వస్తుంది. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏకంగా 50 శాతానికి పైగా ఓట్షేర్ దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ ఉండదు. అయితే జూబ్లీహిల్స్లాంటి అర్బన్ ఏరియాలో మాత్రమే కాదు..పల్లెల్లో కూడా మూడురంగుల జెండాకు నీరాజనం పట్టారు ప్రజలు. తాజాగా మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు జయకేతనం ఎగురవేశారు.…
కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ఎప్పుడూ ముందుంటారు బీఆర్ఎస్ నేతలు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించిన మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్తో రాజకీయాలు చేస్తూ వికృతానందం పొందుతున్నారు. మట్టిలో మాణిక్యాల్లాంటి సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఏకంగా ప్రపంచ దిగ్గజ ఆటగాడితో కలిసి గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడితే ఓర్చుకోలేకపోతున్నారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగుతూ…వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. మెస్సీ రాక సందర్భంగా అంతర్జాతీయ మీడియా మొత్తం తెలంగాణవైపు చూసి అబ్బురపడుతుంటే..బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్పై లేనిపోని తప్పుడు ప్రచారాలతో తెలంగాణకు వచ్చిన మంచి పేరును చెడగొడుతున్నారు. ది గోట్ ఇండియా టూర్ పేరిట దేశంలోని పలు నగరాల్లో మెస్సీతో పాటూ మరో ఇద్దరు ఫుట్బాల్ ప్లేయర్లు పర్యటిస్తున్నారు. కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ టూర్ సాగింది. తొలుత కోల్కతాలో జరగాల్సిన మ్యాచ్ అక్కడి నిర్వాహకుల…
రెండేళ్లలోనే ఎంత మార్పు… పదేళ్ల పాటూ దోచుకోవడం, దాచుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నాయకులు…తెలంగాణ ఖ్యాతిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కానీ కేవలం రెండేళ్లలో తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతున్నది. మిస్ వరల్డ్ పోటీల నుంచి ఈ నెలలో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వరకు ప్రతి దశలో తెలంగాణ పేరు దేశదేశాన మార్మోగుతున్నది. కేవలం ఐటీ, ఫార్మా, డాటా సైన్సెస్ రంగాల్లో మాత్రమే కాదు…క్రీడా రంగంలోనూ తెలంగాణకు ప్రత్యేక పేజీ ఉండాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నది. క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు…గ్రామాల్లోని ప్రతిభావంతులను, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్ధులతో వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్ బాల్ ప్లేయిర్ లియోనెల్ మెస్సీ గేమ్ ఆడనున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి…
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఒక దశ నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగాలి కానీ పరోక్షంగా పార్టీల హడావుడి స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ…స్థానికంగా నాయకులు మాత్రం బల ప్రదర్శన చేస్తున్నారు. ఈ హడావుడిలో బీఆర్ఎస్ పార్టీ చాలా వెనుకబడిపోయింది. తొలిదశ నామినేషన్లు వేసిన చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుతో నిలబడేందుకు అభ్యర్ధులు వెనుకడుగు వేస్తున్నారు. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాం కానీ బీఆర్ఎస్ మద్దతు వద్దంటూ చెప్తున్నారట అభ్యర్ధులు. కారుపార్టీ మద్దతుతో పోటీ చేస్తే తమకు ఓటమి తప్పదన్న భయం పట్టుకుంది. ఇక తొలిదశ నామినేషన్లలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్ధులే ఏకగ్రీవమవుతున్నారు. ఇక కాంగ్రెస్ మద్దతుకోసం పెద్ద ఎత్తున పైరవీలు కూడా చేస్తున్నారు. కానీ మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్న వారికి, గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నవారికే కాంగ్రెస్ మద్దతు…
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికలతో హైదరాబాద్తో పాటూ రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం జోరు కాస్త తగ్గింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న అభివృద్ధితో గత ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేలంలో ప్రభుత్వ భూములకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతోంది. ఇప్పటికే ఎకరం 177 కోట్లు పలుకగా…తాజాగా హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో కోకాపేట నియోపోలిస్ లే అవుట్ లో ఎకరం భూమి 151.25 కోట్లు పలికింది. మొత్తం రెండు ప్లాట్లు వేలం వేయగా…ప్రభుత్వానికి ఏకంగా రూ.1352 కోట్లు వచ్చి ఖజానాలో పడ్డాయి. ప్లాట్ నెంబర్ 15లో 4.03 ఎకరాలుండగా ఎకరా 151.25 కోట్ల చొప్పున మొత్తం రూ.609.5 కోట్లకు GHR అర్బన్ బ్లాక్స్ & లక్ష్మీ ఇన్ఫ్రాకు చెందిన గుమ్మడి లక్ష్మీనారాయణ దక్కించుకున్నారు. ఇక రెండో ప్లాట్ అయిన ప్లాట్…
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు. దేశమంతా హైదరాబాద్ వైపు చూసేలా సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల కంటే అతిపెద్ద నగరంగా ఆవిర్భవించనుంది. పక్కా ప్రణాళిక, పర్ఫెక్ట్ విజన్తో ముందుకువెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రపంచదేశాలతో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొదలు పెట్టారు. అంతకంటే ముందు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్కు మరింత ఇంధనం పోస్తూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం అవతరించనుంది. మొత్తం 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో నగర జనాభా 2 కోట్లకు చేరుకోనుంది. దీంతో నగర శివార్లలో అభివృద్ధి మరింత…
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందనడానికి మరో ఉదాహరణ ఇది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్…మరోసారి బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చింది. మొత్తం పదవుల్లో ఏకంగా 14 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. కేవలం మాటివ్వడం మాత్రమే కాదు…దాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మరోసారి రుజువు చేసింది. మొత్తం 36మంది డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ..అందులో 14 మంది బీసీలకు స్థానం కల్పించింది. ఇక 9 మంది ఓసీలు, ఆరుగురు ఎస్టీలు, ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీ నేతలకు డీసీసీ పదవులు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్న సిన్సియర్ నాయకులను గుర్తించి..సామాజిక న్యాయం, అనుభవాలను సమపాళ్లలో రంగరిస్తూ డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తిచేశారు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్…కాంగ్రెస్ అంటనే సామాజిక న్యాయం. తమకు అవకాశం వచ్చిన ప్రతీసారి..ప్రతీచోటా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే ఉంటారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నో ఏళ్లుగా…
తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టి…ఆత్మను వదిలేసి త్వరలోనే కాలగర్భంలో కలిసిపోనున్న పార్టీ బీఆర్ఎస్. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదు. అధికారం పోయిన తర్వాత కార్యకర్తల్ని ఆగం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ ఈ స్థితికి వచ్చేందుకు ప్రధాన కారణం కేటీఆర్ అనే వాదన కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఎప్పుడైతే కేటీఆర్ చేతికి పార్టీ పగ్గాలు వెళ్లాయో..అప్పుడే బీఆర్ఎస్ నాశనానికి పునాది పడిందనే అభిప్రాయంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వాదుల్ని దూరం పెట్టి కేసీఆర్ తప్పు చేస్తే…వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ జెండా మోసిన కార్యకర్తల్నే పక్కన పెట్టారు కేటీఆర్. దీంతో అసలు బ్యాచ్ మొత్తం పక్కకు వెళ్లింది…కేవలం కేటీఆర్ కోటరీ మాత్రమే మిగిలింది. 2020 సంవత్సరంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతూ వస్తున్నది. వరుస పరాజయాలతో పార్టీని అధఃపాతాళానికి పడిపోయేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.…
ఫార్ములా ఈ కార్ రేస్ స్కాంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్నాళ్లూ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూసిన ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ అనుమతితో చార్జిషీట్ ఫైల్ చేయనుంది ఏసీబీ. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ స్కాంలో కేటీఆర్ నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ అధికారులకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. తనకేమీ సంబంధం లేదు..ఇదంతా అధికారులు తీసుకున్న నిర్ణయమే అని కేటీఆర్ బుకాయించారు. అసలు అది కేసే కాదు..అందులో తనకేమీ కాదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణంలో తీగ లాగి డొంకను బయటపెట్టారు. అనుమతులు లేకుండా కోట్ల రూపాయలు విదేశాలకు తరలించడంపై పక్కా ఆధారాలను ఇప్పటికే రెడీ చేశారు. చార్జిషీట్ త్వరలోనే రెడీ అవడం ఖాయంగా కనిపిస్తుండంలో కేటీఆర్ శిబిరంలో కొత్త చర్చ మొదలైంది. అసలే…