Author: Admin

వికారాబాద్ క‌లెక్ట‌ర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్ స‌హా అధికారుల‌పై దాడి కోసం ముందు నుంచి ప‌థ‌కం రచించినట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ కేసులో ఇప్ప‌టికే 46 మంది నిందితుల‌ను గుర్తించి ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఏ-1గా ఉన్న బోగ‌మోని సురేష్ తో పాటూ ప‌లువురు ప‌రారీలో ఉన్నారు. అయితే దాడిలో పాత్రధారిగా ఉన్న సురేష్ కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ఇక ఈ ఘ‌ట‌న‌లో సురేష్ ను వెనుకుండి ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లిస్తూ నడిపించిన బీఆర్ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క‌లెక్ట‌ర్ పై దాడికి కొన్ని గంట‌ల ముందు, ఆ త‌ర్వాత కాల్స్ లిస్ట్ ప‌రిశీలించిన పోలీసుల‌కు కీల‌క స‌మ‌చారం లభించింది. ఏ-1 సురేష్ కు బీఆర్ఎస్ నేత ప‌ట్నం న‌రేందర్ రెడ్డి నుంచి ఏకంగా 50 సార్ల‌కు…

Read More

అవినీతి మెడ‌కు గ‌ట్టిగా బిగుస్తుండ‌టంతో హ‌స్తిన‌కు ప‌రుగులు పెట్టారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ – కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో ఏసీబీ దూకుడుతో ఆయ‌న హుటాహుటిన ఢిల్లీలో వాలిపోయారు. అప్ప‌టికే ఆయన ర‌హ‌స్య మిత్రుల్ని క‌లిసేందుకు వెళ్లార‌ని సోష‌ల్ మీడియా కోడై కూయ‌డంతో…అక్క‌డికెళ్లి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించారు. ఏ మాత్రం ప‌స‌లేని ఆరోప‌ణ‌లను వినిపించేందుకు కేంద్ర‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ క‌లిసేందుకు వెళ్లారు. నిజానికి ఆయ‌న చెప్పింది కేవ‌లం సాకు మాత్ర‌మే అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఫార్ములా ఈ – కార్ కేసు నుంచి త‌ప్పించండి మహా ప్ర‌భో అంటూ వేడుకోవ‌డమే కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుకున్న ఆంత్య‌ర్యం అనేది ఆయ‌న స‌న్నిహితుల‌కు కూడా తెలుసు. పైగా ఆర్ఎస్ఎస్ కు స‌న్నిహితుడైన కేంద్ర‌మంత్రిని కలిసి..త‌న అరెస్టును ఎలాగైనా ఆపేందుకు గ‌వ‌ర్న‌ర్ పై ఒత్తిడి తెచ్చేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించార‌ని గులాబీ కార్య‌క‌ర్త‌లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. అంతేకాదు కేటీఆర్ రాత్రికి రాత్రి హోంమంత్రి…

Read More

వరంగల్ లో జరిగిన గ్లోబ‌ల్ యాక్ష‌న్ టీం 1.5 మిలినియం కార్య‌క్ర‌మంలో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ కేసముద్రం కు అవార్డు ల‌భించింది. వారు చేస్తున్న సేవ‌ల‌కు గానూ సేవా అవార్డును అంద‌జేశారు. సోమ‌వారం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో లయన్స్ 320 ఎఫ్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన కార్య‌క్ర‌మంలో అవార్డును అందించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాబురావు చేతుల మీదుగా క్లబ్ లకి అవార్డులు అందజేసారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం ద్వారా మరెంతో సమాజ సేవ చేయాలని గట్టమనేని బాబు రావు క్లబ్ సభ్యులకి సూచించారన్నారు అధ్యక్షుడు మామిడి అశోక్. కార్యక్రమంలో పాస్ట్ మాజీ జెడ్ సి లయన్ ఉకంటి యాకూబ్ రెడ్డి, లయన్ ప్రభు కిరణ్, లయన్ సుధాకర్, లయన్ కె రమేష్, రాము గౌడ్ రమేష్, నాయుడు తదితరులు ఉన్నారు.

Read More

ఏళ్లుగా పాతుకుపోయిన నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు. -వాళ్ళు చేయాలనున్నదే ఫైల్, లేకుంటే వెనక్కి తిప్పి ముప్పుతిప్పలు. ఎచ్ఎండిఏ లో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా ఉండే మెట్రోపాలిటన్ అథారిటీకి కొత్త కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిని వేశాక అందులో కొంత ప్రక్షాళన జరుగతుంది. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసి అక్రమాలకు ఆలవాలంగా మారిన కొన్ని శాఖలను ఇప్పటికే దుమ్ము దులిపారు. కానీ కొందరు నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు మాత్రం కొన్నేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక నాన్ క్యాడర్ ఉన్నతాధికారి తన దగ్గరకి వచ్చే ఫైల్స్ విషయంలో ఏదైనా ముట్టజెపితేనే ఆ ఫైల్ ముందుకు పోతుంది. లేకుంటే అది తిరిగి మళ్ళీ పై పేషీకి వెళ్ళిపోతుంది. దీంతో ఈ మధ్యే ఎచ్ఎండిఏ కు వచ్చిన ఐఏఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఫైల్స్ పెండింగ్ లో పడి అనుమతులు ఆగిపోయి…

Read More

నాన్న లేరు.. తాత పట్టించుకోలేదు! అమ్మ కసితో పెంచిన ఈ రాఖీ భాయ్ కథ తెలుసా? మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై.., కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ.., టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా కథ ఇలాంటిది కాదు. అక్కడ ఉప్పొంగిన కన్నీరు తరువాత.. ఓ అద్భుతం జరిగింది. ఆకలిపస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లువెరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జిత్‌ కౌర్‌ బుమ్రా. వేలుపట్టుకుని నడిచే కొడుకు తప్ప పక్కన ఎవ్వరూ లేరు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని స్థితి. మామూలుగా అయితే ఓ స్త్రీ కుప్పకూలిపోయేది. కానీ.., దల్జిత్‌ కౌర్‌ అక్కడే ఆగిపోలేదు. పరిస్థితులను ఎదిరించింది, నిలబడింది. ఆ బిడ్డలో తన భవిష్యత్ చూసుకుంది. అతన్ని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఆ…

Read More

మర్పల్లి ఎమ్మార్వో గణేష్ నాయక్ వసూళ్ల పర్వం… ధరణిని అడ్డుపెట్టుకుని దందా. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ అధికారి ప్రధాన కర్తవ్యం. ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే స్పందించి, పరిష్కార మార్గం చూపాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వ అధికారిపై ఉంటుంది. ఇలాంటి గౌరవనీయమైన స్థానంలో ఉంటూ కూడా వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎమ్మార్వో గణేష్ నాయక్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు. అక్రమార్జనే ధ్యేయంగా, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకుంటున్నాడు. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి తిరిగి వారినే పట్టి పీడిస్తున్నాడు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల ఎమ్మార్వో గణేష్ నాయక్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అనేక అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈయన ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. పైసలు ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలదు. ధరణి పోర్టల్‌లో మార్పులొచ్చాక ఎమ్మార్వో గణేష్ నాయక్ వ్యవహారం మరింత ముదిరిందని స్థానిక మండల రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ వివరాలు…

Read More

లోక్ సభ ఎన్నికల్లో సీఎం , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ 14. కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ వెనకబడిందన్న ప్రచారం జరిగింది. అభ్యర్థుల్లో కూడా కొంత ఆందోళన కనిపించింది. కానీ, రేవంత్ రెడ్డి సీన్ లోకి దిగితే ఎలా ఉంటుందో రుచి చూపించారు. నిజామాబాద్ , మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ వెనుకంజలో ఉందన్న ప్రచారం జరిగింది. కానీ, రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్, మాల్కాజ్ గిరి సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాదు. ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను ఇరకాటంలోకి నెట్టేసేలా ప్రసంగించారు. నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని.. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చేసే బాధ్యత నాదంటూ చెప్పుకొచ్చారు. అంటే జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయితే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏమంత కష్టం కాదు.…

Read More

కోదండరాం…మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి. రాజకీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన మేధావి. ఉద్యమ చరిత్రలో చెరిగిపోని ఘట్టాలుగా గుర్తుండిపోయే మిలియన్ మార్చ్, సాగర హారం వంటి ఉద్యమాలు ఆయన సారధ్యంలో జరిగినవే. ఉద్యమ కాలంలో ఎన్నో ఒత్తిళ్ళు, మరెన్నో సవాళ్ళు. అయినా వాటిన్నింటిని ఎదుర్కొని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు వ్యూహం రచించిన ఉద్యమకారుడు. అలాంటి కోదండరాముడిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విషం కక్కుతోంది. పదవుల కోసం వెంపర్లాడుతున్నాడని చిల్లర ఆరోపణలు చేస్తోంది.పదవులే ముఖ్యం అనుకుంటే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజ్యసభ సీట్ ను కోదండరాంకు ఆఫర్ చేశారు. కానీ తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాను తప్పితే పదవులు అక్కర్లేదని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత కేసీఆర్ అవలంభించిన విధానాలు, నిరుద్యోగ ర్యాలీకు పిలుపునిచ్చినప్పుడు ఆయన పట్ల బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిన తీరు ఉద్యమకారులను ఆవేదనకు గురి చేశాయి. బీఆర్ఎస్…

Read More

    అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మ సమ్మతం కాదంటారు. ఎందుకలా అంటారు. పెళ్లికి, అగ్నికి సంబంధం ఏంటి. వేదాల్లో ఏం చెప్పారు. హిందూ సంప్రదాయంలో ఎందుకిలా పాటిస్తారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోకుంటే ఏమవుతుంది?       పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీ భూతం అని పురాణాలు చెబుతున్నాయి . అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. అందుకే ఆయన సాక్షిగా శ్రీరాముడు మైత్రి చేసుకున్నాడు. అగ్ని పునీత అయిన సీతాదేవిని అయోధ్యకి తీసుకొచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. దేవతలకు అగ్ని పురోహితుడని చెబుతారు. అసలు అగ్నిని సాక్షిగా ఎందుకు పెడతాం.. ముఖ్యంగా వివాహ సమయంలో అగ్ని సాక్షి అని ఎందుకు అంటాం అనే విషయం రుగ్వేదంలో చాలా స్ప‌ష్టంగా ఉంటుంది. వివాహ సమయంలో వరుడు… వధువుకు ప్ర‌మాణం చేస్తాడు.అంటే నీ బాధ్యతని ప్రారంభ కాలంలో సోముడు, ఆ తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని తీసుకున్నారు.…

Read More

గుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లగానే అప్రయత్నంగానే వంగి ద్వారానికి నమస్కారం చేస్తారు. దాదాపు 90శాతం భక్తులు ఇలా చేస్తుంటారు. ఎందుకిలా చేస్తారు, ఆ గడపకి నమస్కరించడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందా?.గుడిలో అడుగుపెట్టే ముందు గడపకి ఎందుకు నమస్కారం చేస్తారు? భగవంతుడి ఆవాసంగా భావిస్తూ ఆరాధించే మందిరమే దేవాలయం. భగవంతుడికి-మానవుడికి మధ్య అనుసంధానం ఈ దేవాలయాలు. భారతదేశ చరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయడంలో ఆలయాలు ఘనమైన పాత్ర పోషిస్తున్నాయి. సమాజంలో సమస్త రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలు తోడ్పాడు అందించాయి. హిందువులు భగవంతుడిని చేరుకునేందుకు ఎన్నో మార్గాలు అవలంభిస్తూ వస్తున్నారు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞయాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు… పౌరాణిక మూర్తిమత్వ ఆరాధన మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం సమాజంలో కన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. కానీ ఆలయ వ్యవస్థ మాత్రం కుల,మత, వర్ణ, లింగ బేధాలకు అతీతంగా అందర్నీ ఒకే…

Read More