Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
బీఆర్ఎస్ వికృత క్రీడకు తెర తీసింది. ప్రజాపాలనను తట్టుకోలేక కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. అధికారం కోల్పోయి నిండా సంవత్సరం కూడా పూర్తికాలేదు. అప్పుడే అరాచక శక్తుల్ని రంగంలోకి దించుతోంది. ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక ప్రత్యక్షంగా కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు రుజువైంది. పరోక్షంగా గులాబీ బాస్ ఉన్నట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అయితే తవ్వేకొద్ది బీఆర్ఎస్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ లో అల్లర్లకు కుట్ర చేసి ఫెయిల్ అయిన సంగతి తెలిసింది. అయితే ఇవి మాత్రమే కాదు వీలైన ప్రతీ చోటా అశాంతిని రాజేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీనికోసం బీహారీ గ్యాంగ్ ను రంగంలోకి దించింది. మాజీ మంత్రి హరీష్ రావు వీటిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ గ్యాంగ్ సభ్యులు పల్లెల్లో పర్యటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు తీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ…
అధికారం కోల్పోగానే ఆగం ఆగం అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శల వరకు వచ్చారు. కిందిస్థాయి క్యాడర్ ను కంట్రోల్ లో పెట్టాల్సిన అధ్యక్ష స్థాయి నేతే నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. సీఎం, మంత్రులు అని చూడకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. అవన్నీ రాజకీయ విమర్శలు అని సరిపెట్టుకుందాం అనుకుంటే..ఈ మధ్య అధికారులను కూడా వదలడం లేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేసుకునేవారిని రొచ్చులోకి లాగుతున్నాడు కేటీఆర్. వారి పనులకు పదే పదే అడ్డుపడేలా కిందిస్థాయి క్యాడర్ ను రెచ్చగొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నిజంగా సైకో రామ్ లాగానే వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అధికారంలో ఉండగా కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న అహంకారాన్ని…ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొన్నటికి మొన్న వికారాబాద్ కలెక్టర్ పై దాడికి అమాయకుల్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేయడం వంటివి ప్రజలందరికీ తెలిసిందే. అధికారం కోల్పోతే ఇంతగా…
నిజమైన ప్రజా పాలకులకు ఎలాంటి బేషజాలు ఉండవు. ఏడాది కాలంగా ఈ విషయం తెలంగాణ ప్రజలు పలు సందర్భాల్లో అర్ధమైంది. ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ కు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా వారి మనసు నొచ్చుకుంటుంది. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే మొండిపట్టుదల వారిలో కనిపించదు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించిన తీరు..ఏడాది కాలంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానానికి వెయ్యి రెట్లు తేడా ఉన్నది. ప్రజల మనసెరిగి పాలించేవాడే నిజమైన నాయకుడు అని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి నమ్ముతారు. అందుకే ఎక్కడా బేషజాలకు వెళ్లకుండా పాలన సాఫీగా సాగుతోంది. తాజాగా అదానీ సంస్థల నుంచి సీఎస్ఆర్ ఫ్రండ్స్ కింద ప్రకటించిన రూ. 100 కోట్లను సున్నితంగా తిరస్కరించడం అదే కోవలోకి వస్తుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పాలకుడి దార్శనికతకు అడ్డం పడుతున్నాయి. తప్పు, ఒప్పుల సంగతి…
కారు పార్టీ అధినేత గారాలపట్టి వేరు కుంపటి పెట్టబోతున్నారా? పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేస్తున్న హడావుడి వెనుక అసలు మర్మం అదే అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటెక్కడా కనిపించని ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య యాక్టీవ్ అయ్యారు. తన అంతరంగీకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ జెండా, కండువా ఎక్కడా లేకుండా కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలతో కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వేరు కుంపటి ఖాయమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్లో క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఇది ఇటీవల జరుగుతున్న వ్యవహారం కాదు. ఆమె జైలుకు వెళ్లక ముందు నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. కేటీఆర్ తో విభేధాలకు సంబంధించి రక రకాల పుకార్లు ఉన్నాయి. వాటిలో నిజాలు కూడా చాలానే ఉన్నాయన్నది బీఆర్ఎస్ నేతల మాట. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత…
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. స్పీకర్ దే తుది నిర్ణయమని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అంతేకాదు స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి డెడ్ లైన్ లేదని కూడా స్పష్టం చేసింది కోర్టు. సరైన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతోపాటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది డివిజన్ బెంచ్. ఈ తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, త్వరలోనే ఎన్నికలు వస్తాయని ఊహల పల్లకిలో ఊరేగిన బీఆర్ఎస్ నేతల ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. హైకోర్టు తీర్పు ప్రజా ప్రభుత్వానికి బూస్ట్ ఇచ్చింది. ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న బీఆర్ఎస్ వాదనలకు కూడా బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాది కాలంగా ప్రజా సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే…బీఆర్ఎస్ వాదనంతా ఉత్తిదే అని స్పష్టమవుతోంది. రెండు టర్ముల్లో ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ వ్యవహారశైలి..ఇప్పుడు రేవంత్…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న అబద్దపు వార్తలకు HMDA వెల్లడించిన నిజాలు చెక్ పెట్టాయి. HMDA పరిధిలో అప్లికేషన్ల పరిష్కారం ఆలస్యం అవుతుందని, TGbPASS ద్వారా నిర్మాణ అనుమతులు ఆలస్యం అవుతున్నాయని కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో కొద్దిరోజులు విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. HMDA లో అప్లికేషన్ల సంఖ్య చాలా తగ్గిందని, వాటి క్లియరెన్స్ ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతున్నదని మీడియాలో రాసుకొచ్చారు. కానీ అవేమి నిజాలు కాదని HMDA స్పష్టం చేస్తోంది. అనుమతుల ప్రక్రియ గతంలో పోలిస్తే వేగవంతమైందని అధికారులు తెలిపారు. తమ నుంచి ఎలాంటి వివరాలు, వివరణ కోరకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అందించడం ఏ మాత్రం మంచిది కాదు. HMDA కు వచ్చిన అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారయంత్రాంగం శ్రమిస్తోందన్నారు. అంతేకాదు గతడాదితో పోలిస్తే అప్లికేషన్ల సంఖ్య కూడా పెరిగిందని, నిత్యం…
మహారాష్ట్ర ఎన్నికల్లో కారు హారన్ మూగబోయింది. రెండేళ్ల క్రితం ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి..తమ మొదటి టార్గెట్ మహారాష్ట్ర ఎన్నికలే అని ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన హడావుడి, ప్రచార ఆర్భాటం అంతా ఇంతాకాదు. మేం అడుగు పెట్టగానే అక్కడి నేతల గుండెల్లో వణుకు మొదలైందని కేసీఆర్ సభల్లో స్వయంగా ప్రకటించుకున్నారు. వందలాది కార్లతో రోడ్ షో..మాజీ వార్డు మెంబర్ల నుంచి మాజీ సర్పంచ్ లు, జెడ్పీటీసీలు, ఒకరిద్దరు ఎన్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలకు గులాబీ కండువాలు కప్పేశారు. ఇక మహారాష్ట్ర రైతుల జీవితాలు బాగు చేసేవరకు విశ్రమించేది లేదని స్పీచ్ లు దంచికొట్టారు. అయితే ఏడాదిలోపే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్సయింది. దీంతో కారు పార్టీ అధినేత ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. రైతుల జీవితాలను బాగు చేసేవరకు తనకు విశ్రాంతి లేదన్న…
బీఆర్ఎస్ లో కేటీఆర్ ఒంటెత్తు పోకడలపై కార్యకర్తలే కాదు..కుటుంబ సభ్యులు కూడా అసహనంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడో..ఏం చేస్తున్నాడో తెలియకుండా గుడ్డి గుర్రం చేనులో పరిగెత్తినట్లు సాగుతున్న కేటీఆర్ వ్యవహారశైలిపై ఇప్పటికే గులాబీ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. పార్టీని నడిపించాల్సిన కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. తోడుగా ఉంటాడనుకున్న హరీష్ రావు కలిసి రావడం లేదు. తన వర్గం నేతలను కూడా అటువైపు వెళ్లనివ్వడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మాజీ మంత్రులు తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూడటం లేదు. కేటీఆర్ మాటల్లో అహంకారం, ఓ విజన్ లేకుండా సాగుతున్న విమర్శలతో గులాబీ క్యాడర్ ఒకరొక్కరుగా దూరమవుతున్నారు. తాజాగా ఆయన సోదరి కవిత కూడా కేటీఆర్ పై తిరుగుబావుటా ఎగురవేసినట్లు కనిపిస్తోంది. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినప్పటి నుంచి కవిత పెద్దగా కనిపించలేదు. కొన్నాళ్లు ఫామ్ హౌజ్ లో ఉండిపోయారు. తెలంగాణ…
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కొన్ని సందర్భాల్లో మనం చేసే విమర్శ నిజం కాదు అని తెలిసినప్పటికీ.. ఎదుటివారిని ఏదో ఒకటి అనాలి కాబట్టి నోటికి వచ్చింది వాగడం ఈ మధ్య ప్రతిపక్ష నేతలకు అలవాటుగా మారింది. ముఖ్యంగా తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు స్కాంలో అడ్డంగా బుక్కవ్వడం, ఏసీబీ దూకుడు పెంచడంతో ఆయనలో ఫ్రస్టేషన్ తారాస్థాయికి చేరింది. దానికి తోడు లగచర్లలో వేసిన స్కెచ్ బెడిసికొట్టడంతో ఆయా గ్రామాల రైతులు బీఆర్ఎస్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో అరిగి పోయిన గ్రామ్ ఫోన్ రికార్డును బయటకు తీశాడు. సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలాడు. మూసీ సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గుజరాత్ లోని కెవాడియాలో…
లగచర్ల ఘటనలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది. అధికారం కోల్పోయాక ఫ్రస్టేషన్ లోకి వెళ్లిన గులాబీ బాస్..ప్రజాప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని కొద్దినెలలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతిపనికి మోకాలడ్డుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్నికూల్చేందుకు భారీ స్కెచ్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అశాంతిని రాజేసి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భూసేకరణను అడ్డుపెట్టుకున్నారు. రైతుల్ని రెచ్చగొట్టి అధికారులపై తిరగబడేలా చేయడం, అదే సమయంతో తన కిరాయి మనుషులతో కలెక్టర్ సహా అధికారులను అంతమొందించడం వంటి కుట్రలు చేశారు. అంతేకాదు రైతుల ముసుగులోని కొందరు కిరాయి వ్యక్తులు పోలీసులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం..కాల్పులు జరిగే సీన్ క్రియేట్ చేయాలని కూడా పథకం రచించించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఫామ్ హౌజ్ నుంచి గులాబీ బాస్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఈ మధ్య జరుగుతున్న తంతుకాదు..కొన్నినెలలుగా రేవంత్ సర్కారుపై బురదజల్లడం, గ్రామాల్లోకి పట్నం నరేందర్ రెడ్డి వెళ్లి రైతుల్ని రెచ్చగొట్టడం వంటివి…