Author: Admin

త‌న అన్న కిషోర్ రెడ్డి వైసిపిలో చేర‌డం అఖిల‌కు మైన‌స్ అవుతోందా?..అఖిల‌కు వ్య‌తిరేకంగానేసుబ్బారెడ్డి రాజ‌కీయాలు ఉండ‌బోతున్నాయా?.అఖ‌ల‌కు కుటుంబ స‌భ్యులే ఎందుకు యాంటీ అయ్యారు? క‌ర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం రాజకీయంగా దశాబ్దాల కాలం శాసించింది. నాగిరెడ్డి దంప‌తుల మరణం అనంతరం జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆ కుటుంబం ప్రాతనిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు ఖిల్లాగా ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలిగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ.. అనేక వివాదాలు చుట్టుముట్టి న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆమెకు సీటు ఇవ్వ‌డ‌మే పెద్ద విజ‌య‌మ‌ని ఆమె అనుచరులే వ్యాఖ్యానిస్తుంటారు. అయితే, రాజ‌కీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే వాద‌న ఇప్పుడు కూడా జ‌రిగింది. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో దూసుకెళ్తున్న భూమా కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది అని…

Read More

…ఖ‌మ్మం కాంగ్రెస్ ఎంపిగా సుహాసిని పోటీ చేస్తార‌నే ప్ర‌చారంలో వాస్త‌వం ఎంత‌?…సుహాసిని రేవంత్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యారు?…ఇదంతా చంద్ర‌బాబు స్కెచ్ అని ప్ర‌చారం ఎందుకు తెర‌పైకి వ‌చ్చింది? ఎన్టీఆర్ మనవరాలు చంద్రబాబు మేనకోడలు జూనియర్ ఎన్టీఆర్ అక్క అయిన నందమూరి సుహాసిని తెలంగాణా నుంచి మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు ఆమె 2018 లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీ తరఫున కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చూసారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కూటమిగా వచ్చినా అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఆ తరువాత 2023లో టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో సుహాసిని కూడా రాజకీయంగా తెలంగాణా లో కనిపించలేదు. ఈ మధ్యలో ఆమె ఏపీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారన్న చర్చ న‌డిచింది. ఆమె వల్లభనేని వంశీని ఓడించడానికి గన్నవరం నుంచి బరిలో ఉంటారని ప్రచారం చేశారు.…

Read More

విడ‌ద‌ల ర‌జ‌నీ వ‌ర్సెస్ మాధ‌వి అన్న తీరుగా గుంటూరు వెస్ట్ రాజ‌కీయాలు మారిపోయాయా?…విడ‌ద‌ల ర‌జ‌నీకి ఉన్న ఇక్క‌డ ఉన్న క్రేజ్ ఎంత‌?..మాధ‌వి పై కూట‌మి ఎఫెక్ట్ ఎంత‌వ‌ర‌కూ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇంకా ఎన్నికలకు 40 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. దీంతో అభ్యర్థులు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇక్కడ ఇద్దరు మహిళా నేతలు నువ్వా.. నేనా అనేరీతిలో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. వైసీపీ తరఫున వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి రంగంలోకి దిగారు. అటు రజిని, ఇటు మాధవి ఇద్దరూ బీసీ…

Read More

త‌న శిష్యుడు అవంతిపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి రెడీ అయ్యాడా?.అస‌లు గంటా పూర్తిగా ఎంట‌ర్ కాక‌ముందే అవంతి అనుచ‌రులు క‌ల‌వ‌ర ప‌డుతున్నారా?ఇక్క‌డ వ‌రుస బెట్టి వైసిపి నేత‌లు టిడిపిలో ఎందుకు చేరుతున్నారు? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఘటనా ఘటన సమర్ధుడు అని అంటారు. ఆయనకు ఓటమెరుగని నేత అని మరో పేరు ఉంది. ఆయనది పాతికళ్ళ రాజకీయం. ఇప్పటిదాకా గంటా అయిదు ఎన్నికలు చూసారు. కానీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఓటమి పాలు కాలేదు. అసలు గంటా పొలిటికల్ టూర్ స్టైలే వేరుగా ఉంటుంది. ఆయన విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలోనూ గెలుపొందారు. అందులోనూ పోటీ చేసిన సీట్లో మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.కానీ రాజకీయ జీవితంలో మొదటిసారి ఆయన పోటీ చేసిన సీటులో మళ్ళీ పోటీకి దిగుతున్నారు. అదే భీమునిపట్నం. అయితే పదేళ్ళ తరువాత ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారు. 2014లో భీమిలీ నుంచి పోటీ చేసి…

Read More

త‌క్కువ స‌మ‌యంలోనే త‌న సినిమాల‌తో అవార్డులు ఎలా కొల్ల‌గొడుతున్నారు?…జ‌క్క‌న్న ఆస్తుల విలువెంత‌?..డైర‌క్ట‌ర్ గా ఆయ‌న తీసుకునే పారితోషికం ఎంత‌? సంచ‌ల‌నాల‌కు మారుపేరుగా మారాడు ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి. అత‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 చిత్రాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన రాజ‌మౌళి భార‌తీయ సినిమా తీరు తెన్నుల‌ను మార్చ‌డంలో కీల‌క భూమిక పోషించారు. పాన్ ఇండియన్ సినిమా అనే ప‌దానికి సిస‌లైన నిర్వ‌చ‌నం చెప్పిన ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి పేరు మార్మోగుతోంది. ఇటీవ‌ల RRR చిత్రంతో క‌మర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డ‌మే గాక‌.. నాటు నాటు పాటకు ఆస్కార్ ని దేశానికి అందించిన తొలి ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి రికార్డుల‌కెక్కారు. బాహుబలి- RRR వంటి పాన్-ఇండియా చిత్రాల భారీ విజయంతో రాజమౌళి భార‌త‌దేశానికి ఇంటి పేరుగా మారారు. అత‌డికి అవ‌కాశం ఇవ్వాలే కానీ మార్వ‌ల్ త‌ర‌హా సినిమా తీయ‌గ‌ల‌డ‌న‌డంలో ఎలాంటి…

Read More

చీపురుప‌ల్లిని లైట్ తీసుకుని మ‌రీ వైజాగ్ ఎంపి సీటు మీదే బొత్స ఎందుకు క‌న్నేశారు?..బొత్స ఝూన్సీకి వైజాగ్ లో గెలుపు అవ‌కాశాలు ఎంత‌వ‌ర‌కూ ఉన్నాయి? తన సతీమణి దాదాపుగా పదేళ్ళ తరువాత ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. పైగా ప్రైమ్ సీటు. విశాఖ లాంటి మెగా సిటీలో ఎంపీ అంటే మామూలు విషయం కాదు. ఆ గోల్డెన్ చాన్స్ ఇపుడు కళ్ళముందు ఉంది. దాంతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.ఆయన చీపురుపల్లిని అలా వదిలేశారు. అక్కడ గెలుపు గ్యారంటీ అని ఆయన మాటలలోనే వ్యక్తం అవుతోంది. రోజుకో మీడియా మీటింగ్ ఆ మీదట పార్టీ జనాల మీటింగ్ ఇలా విశాఖలోనే మంత్రి గారు గడిపేస్తున్నారు. ఒక‌వైపు క‌ళా త‌న‌పై పోటీ చేస్తున్నా…చీపురుప‌ల్లిని ప‌క్క‌న పెట్టి మ‌రీ బొత్స త‌న భార్య సీటు మీదే ఫోక‌స్ పెట్టారు. విశాఖ ఎంపీ సీటులో సతీమణిని కూర్చోబెట్టేందుకు తనదైన స్కెచ్ ని…

Read More

ఈ మూవీకి ఇప్ప‌టికే బ‌న్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?.ఈ మూవీ స‌మంత తో పాటు త్రిష‌కూడా హీరోయిన్ గా చేస్తోందా?..బ‌న్నీ తో త్రిష కాంబో ఎలా ఉండ‌బోతోంది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏ దర్శకుడితో తొందరగా సినిమా స్టార్ట్ చేస్తాడ నే విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ఫ్యాన్స్ అయితే బన్నీ నెక్స్ట్ అనౌన్స్మెంట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లిస్టులో ఇదివరకే చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా అట్లీ పేరు టాప్ లిస్టులో చేరిపోయింది. తప్పకుండా మంచి ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు తోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ తో పాటు సన్ పిక్చర్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఒక క్లారిటీ…

Read More

పాలిట్రిక్స్ ఎప్పుడూ ప్రజల పక్షనా నిలిచింది. ప్రజల గొంతుకై మాట్లాడింది. అక్షరాలను సాయుధం చేసి అక్రమార్కుల గుండెల్లో దింపింది. అందుకే పాలిట్రిక్స్ పై ఎన్నో ఒత్తిళ్లు. అయినా…సవాళ్ళను ఎదుర్కొని నిలబడింది తప్పితే ఎక్కడా వెన్ను చూపలే. అందుకే తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. https://www.youtube.com/watch?v=AOR7GS1Echw కాళేశ్వరం అవినీతిపై అక్షరాలను ఆయుధంగా మలిచి కన్నెర్ర జేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయములో పెద్దల ప్రమేయాన్ని ప్రజల ముందు ఉంచింది. జర్నలిజం అంటే నిజాన్ని ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా చెప్పడమే. పాలిట్రిక్స్ అదే పని చేసింది. 2023లో కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని ముందే వెల్లడించింది. పాలిట్రిక్స్ చేసిన సర్వేలు నిజం అయ్యాయి. నవంబర్ 30న వీ6 వేదికగా పాలిట్రిక్స్ సర్వే ఫలితాలను ప్రకటించాం.. సరిగ్గా అవే ఫలితాలు వచ్చాయి. నాడు పాలిట్రిక్స్ చెప్పిన సర్వే రిపోర్ట్ లను చూసి కాంగ్రెస్ కు బాకా ఊదుతుందని అనుకున్నారు..కానీ, డిసెంబర్3న ఫలితాలు చూసి…

Read More

అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ కీలక నేతల తీరు ఏమాత్రం మారడం లేదు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి అడుగు బయటపెట్టడం లేదు. హరీష్ రావు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ తాను ఇంకా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఆయన తీరు చూసి ఆయన రాజకీయ సలహాలు ఇస్తోన్న వారిని తిట్టిపోస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. ఏదీ మాట్లాడినా అది పార్టీ అధికారిక ప్రకటనే. కానీ ఇదేమి పట్టించుకోకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న ఇష్యు అని కొట్టిపారేస్తున్నారు. ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఫోన్ ట్యాపింగ్ చేశారని.. దానిని పెద్ద ఇష్యుగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వస్తానికి ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద విషయం. ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాలంటే కేంద్రం అనుమతి ఉండాలి. కానీ గత బీఆర్ఎస్ సర్కార్…

Read More

రేవంత్ పై హైకమాండ్ పూర్తి భరోసా..అందుకే తాజా ఎంపిక..!!తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మరో నాలుగింటిని పెండింగ్ లో పెట్టింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదారాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వీటిని హోల్డ్ లో పెట్టేశారు.భువనగిరి ఎంపీ అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి కుటుంబం పట్టు పట్టింది. కానీ, అదే స్థానం నుంచి సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ టికెట్ కోసం ప్రయత్నించారు. ఇప్పటికే కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఇద్దరికీ పదవులు ఉండటంతో మరొకరికి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని చామలకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే, మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధుకు అవకాశం దక్కింది. ఆయన టికెట్ పై హామీతో కాంగ్రెస్ లో చేరారు. కానీ, ఈ స్థానం నుంచి జగ్గారెడ్డి ఫ్యామిలీ ప్రయత్నించింది. సర్వేలో నీలంకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని…

Read More