ఇకనుంచి మీరు ఇంటిలో ఉంది మీ ఓటు హక్కును వినియోగించుకునే హాకును కేంద్ర ఎన్నిక సంఘం ప్రవేశ పెడుతోంది. దీనిపేరు ‘వి ఎఫ్ ఎం’. అంటే ‘వోట్ ఫ్రమ్ హోమ్’. అంటే ఇంట్లో ఉంది ఓటు వేసే ప్రయోగం. అయితే ఇది అందరికి వర్తించదు. 80 ఏళ్ళు నిండిన వృద్దులకు మాత్రమే వర్టిస్తుంది. ముందుగా ఓటర్ తన వివరాలను ఎన్నిక కమిషన్ వెబ్ సైట్ లో నమోదు చేసుకుని ఓ పాస్ వర్డ్ తీసుకోవాలి.
ఓటింగ్ రోజు మాత్రమే ఇది పనిచేస్తుంది. మొబైల్ లేదా డెస్క్ టాప్ నుంచి వృద్దులు ఇంట్లోంచి ఆన్ లైన్ ద్వార ఓటు వేయవచ్చు. ఈ ప్రయోగాన్ని కర్ణాటకలో వచ్చే ఎన్నికలలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. దీనివలన ఆ రాష్ట్రం లో ఉన్న దాదాపు 12 లక్షల 50 వేల మంది వృద్దులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అని ఎన్నిక సిఈఓ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇది విజయవతం అయితే దేశ వ్యాప్తంగా అమలు చేస్తారు.