Author: ADMIN

ఈ రోజు TJS పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతు క్రిష్ణ జలాల పరిరక్షణ యాత్ర వచ్చే నెల 4 వ తేదీన నుండి నల్గొండ జిల్లా ఉదయ సముద్రం నుండి నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని బ్రమ్మన వెళ్లెముల ప్రాజెక్టు,మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చర్ల గూడేo ప్రాజెక్టు,డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని SLBC టన్నెల్ నక్కల గండి ప్రాజెక్టు వరకు ఈ యాత్ర కొనసాగుతుంది . ఈ యాత్ర లో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన krmb గెజిట్ వెంటనే రద్దు చేయాలని మరియు క్రిష్ణ పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పూర్తిచేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు,మరియు 2వ గోదావరి జలాల సాధన యాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది ఎందుకంటే 8000 కోట్ల రూపాయలు గత…

Read More

తిరుపతి: నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జ్యోస్టర్ ఎండీ హేమ, జీవితపై ఫిర్యాదు చేశారు. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జీవితారాజశేఖర్‌పై ఆరోపణలున్నాయి. ఆమె తనకు ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయని హేమ చెబుతున్నారు. రూ.26 కోట్లు ఎగ్గొట్టారని జీవితారాజశేఖర్‌పై హేమ ఆరోపణలు చేస్తున్నారు.:::::జీవితపై జ్యోస్టర్ ఎండీ హేమ దంపతుల ఆరోపణలు చేశారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం జీవితారాజశేఖర్ దంపతులకు రూ.26 కోట్లు అప్పు ఇచ్చామని తెలిపారు. అప్పుకోసం ఆస్తి డాక్యుమెంట్లు తనఖా పెట్టారని, అయితే తమకు తెలియకుండా ఆ ప్రాపర్టీని మరొకరికి అమ్మారని తెలిపారు. జీవితా రాజశేఖర్‌ రూ.26 కోట్లు ఎగ్గొట్టారని చెప్పారు. ఈ వ్యవహారంపై తిరువాళ్లూరులో కేసు పెట్టామని ఆమె పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్‌పై చెక్‌బౌన్స్‌ కేసు నడుస్తోందని హేమ తెలిపారు.

Read More

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అచ్చే దిన్ తీసుకొస్తానని ఇప్పుడు 1050 రూపాయలకు పెంచి ప్రజలకు సచ్చే దిన్ తీసుకొచ్చాడు 8ఏండ్లల్లో ఎంత మందికి కొత్త ఫించన్లు , డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారు? ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం పీపుల్స్ మార్చ్ రణయాత్ర కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు పిపిటి కిట్లు ధరించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను తిరిగి ప్రజలకు వైద్యం అందేలా కృషి చేశాను.…

Read More

యాసంగి ధాన్యం కొనుగోలు వ్యవహారంకేంద్ర,రాష్ట్రప్రభుత్వాల నడుమ పెద్ద దుమారమే రేపింది.ఇప్పుడిప్పుడేకాస్త కుదుట పడుతుందని భావిస్తున్న తరుణంలోఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరొక సమస్య తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగుల లేకపోవడంతో అధికారులను బ్యాగుల కొరత వేధిస్తున్నట్లు సమాచారం.ధాన్యం సేకరణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అవసరం ఉండగా,ప్రస్తుతం 8 లక్షల గోనే సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది.వాటిని కూడా మిల్లర్ల నుంచి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారని వినికిడి.వాస్తవానికి ధాన్యం సేకరణకు నెలరోజుల ముందే పౌరసరఫరాల శాఖ గన్నీ బ్యాగుల సేకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Read More

దేశంలో మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్లుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న HYD ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఢిల్లీలోని అక్షర్ ధామ్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి మరో యువతి సూసైడ్కు యత్నించింది. అప్పటికే విషయం తెలుసుకున్న CISF జవాన్లు ఆమెను కాపాడేందుకు కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. దీంతో కిందకు దూకిన యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.

Read More

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేస్తోంది.ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ అధికారులు విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురియవచ్చని, 30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనీ ఐఎండీ తెలిపింది.రాగల 24 గంటలపాటు హైదరాబాద్ లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.ఉపరితల గాలులు దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్‌, 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే…

Read More

దేశంలో అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు కేజ్రీవాల్ మాత్రమేనని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంచార్జి సోమ్ నాథ్ భార్తి అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందించడం కోసం విప్లవాత్మక విధానాలకు కేజ్రివాల్ రూపకల్పన చేస్తున్నారని అన్నారు. ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. అంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర ద్వారా కేజ్రీవాల్ తీసుకొస్తున్న విప్లవాత్మక విధానాలను గడప గడపకూ తీసుకువెళ్తామన్నారు. అవినీతి రూపుమాపడంతోపాటు, తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నెరవేరుస్తామని అన్నారు. తెలంగాణలో రాజకీయ ప్రక్షాళన జరగాలంటే ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ హక్కున చేర్చుకోవాలని కోరారు. మొదటి రోజు ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గరి నుంచి మొదలైన పాదయాత్ర గాంధీనగర్ న్యూ…

Read More

ప్రజల సొమ్ములను కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు దోచిపెడ్తున్నాయి మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోంది. మేకిన్ ఇండియాలో భారీ అవినీతి జరుగుతోంది ఫేం అనే పథకం ద్వారా జరిగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అవినీతి జరిగింది. మేకిన్ ఇండియా ప్రోగ్రాం 100శాతం ఫెకిన్ ఇండియా గా మారింది మేకిన్ ఇండియా ప్రోగ్రాం నిబంధనలకు విరుద్దంగా జరుగుతోంది హీరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కుంభకోణం జరిగింది స్కూటర్ లు తయారు చేయడానికి 200 పాట్స్ అవసరం.. అవి కూడా ఇండియాలోనే తయారు కావాలి స్వదేశంలో తయారు చేసే పాట్స్ తోనే వాహనం తయారు చేయాలి కానీ పాలసీకి విరుద్దంగా హీరో ఎలక్ట్రిక్ మోటర్ వెహికిల్ 13 మోడల్స్ చేస్తున్నారు. 2021 -22 ఫైనాన్సియల్ ఇయర్ లో. హీరో కంపెనీ లక్ష 40 వేల స్కూటర్ లు అమ్మేశారు దానికి 400 కోట్లు సబ్సీడీ.. కేంద్రం ఇచ్చింది. 28 వేల చొప్పున ఒక్కొక్క వాహనానికి…

Read More

తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్‌ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఎవరి కోసం బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నారా? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని పాదయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదల అకౌంట్స్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి వేయనందుకా పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పెట్రో, డీజిల్‌ ధరలు పెంచమని పాదయాత్ర చేస్తున్నారా బండి సంజయ్..అని ప్రశ్నించారు భట్టి.

Read More

• సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాసేపు అయోమయం… • అంబేద్కర్ కి నివాళులు అర్పించేందుకు వచ్చిన బిఎస్పి నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ • మంత్రి ప్రోటోకాల్ అంటూ అడ్డుకున్న అధికారులు • విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వెంటబెట్టుకుని ఇద్దరు కలిసి అంబేద్కర్ కి పూలమాల వేసి నివాళులర్పించారు . • అడ్డుకున్న అధికారుల పై అసహనం వ్యక్తం చేసిన ప్రవీణ్ కుమార్ • ప్రోటోకాల్ పేరుతో దళితులను అంబేద్కర్ కి దూరం చేస్తారా అని మండిపాటు • అధికారులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తా అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ …

Read More