Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ధరణి, రైతు రుణమాఫీ, పోడు భూముల వంటి సమస్యలతోపాటు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని టీపీసీసీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం, అసమర్ధతను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ నేతృత్వంలో రైతులతో కలిసి పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా గాలి అనిల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ధరణి ద్వారా భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో జరిగిన అవకతవకల వల్ల రైతులు భూమిపై హక్కులను కోల్పోయారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్ళుగా కాలయాపన చేస్తున్నాడని కేసీఆర్ వైఖరిని తూర్పారపట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి…
ముందుగా చెప్పింది చేస్తే కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎలా అవుతానని అనుకుందేమో ఏమో కాని ఎమ్మెల్సీ కవిత మాట మార్చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో సీబీఐ తనకిచ్చిన నోటీసులకు ఆరో తేదీన వివరణ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆరోజు తనకు వీలుపడదని ప్రకటించింది. ఆరో తేదీన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని.. ఆ రోజు బిజీగా ఉంటానని సీబీఐకి కవిత మెయిల్ పంపారు. ఈ నెల 11, 12,14,15 తేదీల్లో హైదరబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తేదీని ఖరారు చేయాలంటూ సీబీఐని కోరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తుకు సంబంధించి తాను పూర్తిగా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. దర్యాప్తుకు సహకరించడానికి మీకు పంపిన తేదీలలో ఓ రోజు నా వివరణ తీసుకోవచ్చునంటూ లేఖలో ప్రస్తావించారు. తను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని తెలిపారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన…
నటి కల్పిక గుర్తుండే ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టుతో గుర్తింపు పొందిన కల్పిక ఆ తరువాత చాలా సినిమాలోనే నటించింది. ఇటీవల విడుదలైన యశోదా సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది కూడా.పదుల సంఖ్యలో సినిమాలో నటించినప్పటికీ, హీరోయిన్స్ కంటే అందంగా ఉంటాననే అక్కసుతో తనను పక్కన పెట్టేశారని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను 30 సినిమాలో నటిస్తే అందులో విడుదలైనవి సగం మాత్రమేనని చెప్పింది. అలాగే పలు విషయాలను నిర్మొహమాటంగా పంచుకుంది. అందరిలోనూ కామం ఉంటుంది. అమ్మాయిలు అందుకు మినహాయింపేమి కాదు. కాకపోతే దానిని ఎక్కడ ప్రదర్శించాలి అనేది ముఖ్యం. అబ్బాయిలు లిమిట్ క్రాస్ చేయకుండా వ్యవహరించాలి. మాట్లాడాలి. అమ్మాయి సెక్సీగా ఉంటుంది… హాట్ గా ఉంటుందనే కామెంట్స్ ఒకే. అంతవరకు ఉంటె సమస్య లేదు కాని, పరిధి దాటితేనే అసలు సమస్య అని చెప్పుకొచ్చింది కల్పిక. మనం పొరుగు అమ్మాయిల విషయంలో ఏమైనా చేయాలనుకుంటే ఆ…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. ఆరో తేదీన హైదరాబాద్ లోని కవిత నివాసంలో విచారణ జరగనుంది. ఆ తరువాత నెక్స్ట్ ఏంటన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయముందని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న ఈడీ.. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. ఇప్పుడు సీబీఐ విచారణ జరగనుండటంతో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుపోతోంది. మద్యం పాలసీ వ్యవహారంలో కవితకు భారీగా ముడుపులు అందినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. విషయం తెలిసినా వెంటనే ప్రగతి భవన్ లో కవితను కేసీఆర్ మందలించారని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీతో కేసీఆర్ కయ్యానికి సిద్దపడిన వేళ అవినీతి వ్యవహారాల్లో కవిత తలదూర్చడం పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా…విచారణ సంస్థలు కూడా కవిత టార్గెట్ గా విచారణ చేస్తున్నాయని స్వయంగా టీఆర్ఎస్ నేతలే…
తెలంగాణ సీఎం కేసీఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటిసులు ఇవ్వడం బాగానే ఉంది. నోటీసులకు సమాధానం చెబుతానని ఆమె అంగీకరించడం కూడా ఒకే. కాని తెలంగాణలో సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ జనరల్ కన్సెంట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి కవితను విచారించేందుకుగాను సీబీఐకి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇస్తుందా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ జనరల్ కన్సెంట్ ను తెలంగాణ సర్కార్ రద్దు చేయడంతో నేరుగా దర్యాప్తు చేసేందుకు సీబీఐకి వీలు ఉండదు. ఎవరినైనా విచారించాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. సర్కార్ ఒకే చెప్తే విచారణ చేసుకోవచ్చు. లేదంటే లేనట్టే లెక్క. ఏవరైనా అవినీతికి పాల్పడినట్లు సీబీఐకి సమాచారం ఉంటె రాష్ట్ర స్థాయిలో ఏసీబీ అధికారులే దాడి చేస్తారు. అయితే, సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు వింటేనే పూనకంతో ఊగిపోయే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎట్టకేలకు రేవంత్ తో కలిసిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇక నుంచి రేవంత్ తో కలిసి కొట్లాడుతానని వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి చెప్పాల్సిన విషయాలను ఇటీవలి ప్రెస్ మీట్ లో చెప్పెశానని, ఇక ఎన్నికలు ముగిసేవరకు రేవంత్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఉండగా.. తమ మధ్య ఎలాంటి పంచాయితీలు లేవని రేవంత్ అన్నారు. తమ మధ్య ఉన్నది తోటి కోడళ్ళ పంచాయితీ మాత్రమేనని నవ్వుతు చెప్పారు. కొట్లాడాల్సిన చోట కోట్లడుకుంటాం. కలిసినప్పుడు మాట్లాడుకుంటామంటూ జగ్గారెడ్డి బదులిచ్చారు. మీడియాకు మాత్రం తాము కత్తుల దూసుకోవాలని ఉంటుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇటీవల మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి రేవంత్ ఏ కార్యక్రమం చేపట్టిన తప్పకుండా సహకరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.…
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియా – వెస్టిండిస్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో కామెంటరీ చెప్తుండగా పాంటింగ్ కు చాతిలో నొప్పి వచ్చింది. దాంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ కు గుండెపోటు వచ్చిందని తెలుసుకొని క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గుండెపోటుకు గురైన పాంటింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాంటింగ్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 1995నుంచి 2012వరకు 17 ఏళ్లపాటు ఆస్టేలియాకు పాంటింగ్ ప్రాతినిధ్యం వహించారు. 198టెస్టు మ్యాచ్ లో 13,378 పరుగులు చేయగా ఇందులో 41 శతకాలు ఉన్నాయి. 375వన్డే మ్యాచ్ లో 13,704పరుగులు చేయగా ఇందులో 30సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియా సారధిగా రెండు ప్రపంచ కప్ లను అందించిన ఘనత పాంటింగ్ దే.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఖాయమైంది. బీఆర్ఎస్ కు రేపోమాపో అన్ని అనుమతులు రానున్నాయి. దీంతో తెలంగాణలో తదుపరి సీఎం ఎవరన్న చర్చ జరుగుతుండగా కూకట్ పల్లిలో టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. కూకట్ పల్లిలో మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. గతంలో కేటీఆర్ సీఎం అని మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానించారు. అప్పుడు కేటీఆర్ సీఎం అనేప్రచారం జరిగినా ముగింపు పడింది. తాజాగా మరోసారి కేటీఆర్ సీఎం అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. సంక్రాంతికి నూతన సచివాలయం ప్రారంభం కానుంది. ఆ తరువాత మార్చిలో బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించి కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్…
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ కూతురి వివాహ వేడుక ఇటీవల అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధువరులను ఆశీర్వదించారు. గుంటూరులో రిసెప్షన్ ఏర్పాటు చేయగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరై నూతన దంపతులను దీవించారు. అలీ కూతురి పెళ్లి వేడుకకు జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. రాజకీయలను పట్టించుకోకుండా పవన్ – అలీల సాన్నిహిత్యం దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఈ మ్యారేజ్ కు అటెండ్ అవుతారని అనుకున్నారు కాని, జనసేనాని పెళ్లికి హాజరు కాకపోవడంతో రకరకాల ప్రచారం జరిగింది. Also Read : ” జై భీమ్ ” కు సీక్వెల్ రాబోతుందా..? ఈ విషయంపై తాజాగా అలీ స్పందించారు. తాను పెళ్లికార్డు పవన్ కు ఇచ్చానని తెలిపారు. ఫిలింసిటీలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లి పవన్ కల్యాణ్ తోపాటు డైరక్టర్ క్రిష్ కు పెళ్లి…
మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా తెరకెక్కిన హిట్ 2 తాజాగా రిలీజ్ అయింది. హిట్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాను డైరక్టర్ శైలేష్ కొలను రూపొందించారు. ట్రైలర్, సాంగ్స్ తో హిట్ 2 పై అంచనాలను పెంచేసిన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం స్టొరీ కేడి అలియాస్ కృష్ణ దేవ్ ( అడివి శేష్ ) చాలా కూల్ ఆఫీసర్. ఏ కేసులనైనా ఇట్టే డీల్ చేసేయడం ఆయన స్పెషల్. అలాంటి కృష్ణదేవ్ కు సంజన అనే అమ్మాయి మర్డర్ కేసు సవాల్ గా పరిణమిస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సంజన మర్డర్ కు సంబంధించి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆమె హత్య వెనక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని కృష్ణదేవ్ తెలుసుకుంటాడు. ఇంతకీ సంజనను హత్య చేసిన కిల్లర్ ఎవరు..? అసలు సంజనను హత్య చేసేందుకు కారణం ఏంటి..?ఈ కేసు…