Author: Admin

-చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలు-పిటిషన్లపై విచారణ జరపొద్దని రెండు రోజుల క్రితం వాదన-బ్రిటిష్ కాలం నాటి చట్టంపై మోదీ సర్కార్ యూటర్న్ మార్పులు అవసరమని, పరిశీలిస్తామని అఫిడవిట్ దాఖలు వివాదాస్పద రాజద్రోహ చట్టంపై కేంద్ర ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. చట్టంలోని సెక్షన్ 214ఏ నిబంధనల్ని పునఃపరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు తలిపింది. మార్పులకు అవకాశముందని వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసే మార్పుల కసరత్తు పూర్తయ్యేంత వరకు వేచి ఉండాలని కోరింది. అటు.. రాజద్రోహ చట్టాల రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మే 10 నుంచి వింటామని గతంలోనే సుప్రీంకోర్టు వెల్లడించింది. నేటి నుంచి పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. పిటిషన్ లో పేర్కొన్న అంశాలివీ..! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ…

Read More

నారాయణ గుట్టులాగిన పోలీసులు నారాయణ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్, ప్రధాన నిందితుడు గిరిధర్‌రెడ్డిని విచారించిన పోలీసులు మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించిన గిరిధర్‌ రెడ్డి జేఈఈ, నీట్‌ లాంటి పరీక్షల్లో ర్యాంకులపైనే నారాయణ సంస్థలు దృష్టి ఎక్కువగా పెడతాయని వెల్లడి మాథ్స్, సైన్స్‌లపైనే ప్రధాన దృష్టి ఉంటందన్న గిరిధర్‌ రెడ్డి తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజ్‌ సబ్జెక్టులు, సోషల్‌స్టడీస్‌పై నిర్లక్ష్యం ఉంటుందని చెప్పిన ప్రధాన నిందితుడు అందుకే విద్యార్థులకు వీటిపై పట్టు ఉండదని వెల్లడి వీటన్నింటినీ అ«ధిగమించి పదోతరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడానికి నారాయణ సంస్థలు ప్రయత్నాలు చేస్తాయని పోలీసులకు చెప్పిన గిరిధర్‌ రెడ్డి దీంట్లో భాగంగానే ప్రతి ఏటా పదోతరగతి పరీక్షల ముందు ఉభయ తెలుగురాష్ట్రాల్లోని స్కూల్‌ డీన్లు, వైస్‌ ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్‌తో భౌతికంగా విజయవాడలో లేదా, వర్చువల్‌గా నారాయణ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పిన గిరిధర్‌ రెడ్డి నారాయణ ఆదేశాల ప్రకారం, ఆయన…

Read More

తెలంగాణ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ యువకుడు పెట్రోల్ పోసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎస్సై, తహసీల్దార్ తప్పించుకోగా, ఎంపీవో గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేయడంతో ప్రాణాపాయం తప్పింది. పెట్రోల్ స్ప్రే చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దారి వివాదం – పెట్రోల్ తో దారుణం దారి వివాదం తలెత్తడంతో.. అదే గ్రామానికి చెందిన యువకుడు గంగాధర్, రోడ్డుకి అడ్డంగా కర్రలు, ఇటికలు పెట్టాడు. స్థానికులు వారించినా వినిపించుకోలేదు. దీంతో గ్రామస్తులు అధికారులకి ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ఎస్సై, తహసీల్దార్, ఎంపీవో గ్రామానికి వచ్చారు. కర్రలు, ఇటికలు తొలగించేందుకు ప్రయత్నించారు. గంగాధర్ ముందుగానే పెట్రోల్ తో నింపిన స్ప్రేయర్ తీసుకొని.. అధికారులపై స్ప్రే చేశారు. ఈ క్రమంలో ఎస్సై ప్రతిఘటించి అడ్డుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో గంగాధర్ నిప్పంటించాడు. ఎస్సై అక్కడి నుంచి పక్కకు పరిగెత్తారు. పక్కనే…

Read More

భారత దేశం మొత్తం అప్పు రూ. 135.87 లక్షల కోట్లుస్వాతంత్రానంతరం 67 ఏళ్లలో రూ. 55 లక్షల కోట్ల అప్పులుమోదీ హయాంలో ఈ 8 ఏళ్లలో రూ. 80 లక్షల కోట్ల అప్పులుఏటా సగటున రూ. 10 లక్షల కోట్ల రుణాలుఅప్పుల్లో ప్రపంచ రికార్డు దిశగా ప్రధాని మోదీపన్నుల వసూళ్లలోనూ తగ్గేదిలే అంటున్న కేంద్రంపెట్రో బాదుడే రూ. 3 లక్షల కోట్లులక్షల కోట్ల రుణాలు, పన్నుల వసూళ్లు ఏం చేస్తున్నట్లు ? స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసిన మొత్తం అపులు… రూ. 55,87,149 కోట్లు. బూటకపు వాగ్దానాలతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. అప్పటి నుంచి 2022 వరకు చేసిన అప్పులు రూ. అక్షరాలా.. రూ.80,00,744 కోట్లు. అంటే… 67 ఏళ్లలో దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులు కంటే… కేవలం 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన…

Read More

-సీబీఐ, ఈడీని ఎందుకు ప్రయోగించడం లేదు..?-కేంద్రం చర్యలపై నెల వేచి చూస్తానని స్పష్టీకరణ తెలంగాణకు ప్రాంతీయ పార్టీ అవసరముందని వెల్లడి-మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, జైలుకు పంపుతామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. నెలలు గడచినా అందుకు సంబంధించిన ఊసే ఉండటం లేదు. ఇక దమ్ముంటే టచ్ చేసి చూడాలని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ.. ఇద్దరిలో ఎవరూ మరో అడుగు ముందుకు వేయడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా ఆయన రాజకీయ ప్రయాణం ఎటు..? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్ విసిరారని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా ప్రశ్నించారు. సీబీఐ,…

Read More

-ప్రజాదర్బార్ లు లేవు, గోడు వినే నాథులు లేరు కేసీఆర్ సచివాలయానికి రాడు, ప్రగతి భవన్ కు రానివ్వడు-అర్జీ తీసుకోడు.. ధర్నాచౌక్ లో అరవనివ్వడు-ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం కరవు-నిజంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా..? రాజుల కాలంలో అంతఃపురం వద్ద ధర్మగంట ఉండేది. అక్కడికి వెళ్లి… ఎవరైనా ధర్మగంట మోగిస్తే… ప్రభువైన రాజు బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే వారు. ధర్మగంట మోగిందంటే.. నిద్రలో ఉన్నా.. మేల్కొని.. బయటకు రావడం… జనం గోడు వినడం.. ఆనాటి రాజుల విధ్యుక్త ధర్మం. పాలన ఏ రూపంలో ఉన్నా.. జనం తమ బాధలు చెప్పుకునే ఒక వ్యవస్థ ఉండేది… ఉంటుంది… ఉండాలి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… పాలకులే సేవకులు. ప్రభువులు ఆదేశిస్తే పాలకులు తమ కర్తవ్యం నిర్వర్తించాలి. సేవకులు విధులు నిర్వర్తించకుంటే.. ప్రభువులు ఏం చేయాలి..? ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి తప్ప.. ప్రజలే స్వయంగా పాలకుల్ని మధ్యలో దింపే వ్యవస్థ లేదు. మరేం చేయాలి….?…

Read More

-కాంగ్రెస్ డిక్లరేషన్ తో కంగుతిన్న కేసీఆర్-హస్తం హామీలపై స్పందించేందుకు మల్లగుల్లాలు డిక్లరేషన్ పై మాట్లాడకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం-పొలిటికల్ టూరిస్టులు అంటూ అవాకులు, చెవాకులుకేసీఆర్ మౌనంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ తెలంగాణలో రైతుల్ని బ్రహ్మాండంగా ఉద్ధరించామని, ఇక దేశంలో రైతుల్ని ఆదుకునే దిక్కు ఒక్క టీఆర్ఎస్సేనని, దేశ రాజకీయాల్ని దున్నేస్తానంటూ నాగలి పట్టుకుని బయల్దేరుతున్న కేసీఆర్… నేల విడిచి సాము చేస్తున్నారు. వాస్తవాల్ని కనుమరుగు చేస్తూ… జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఐడియాల మేరకు ఇతర రాష్ట్రాల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా 2014లో మోడీకి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ఐడియా కూడా అదే కదా. కానీ.. కేసీఆర్ నిజంగా రైతు బంధువా…? వరి వేస్తే ఉరే అన్నడు. బీజేపీతో పంచాయితీ పెట్టుకుని అది రైతుల సమస్య అని మభ్యపెట్టలేదా..? కేసీఆర్ తో పంచాయితీ పెట్టుకున్న బీజేపీ రైతుల్ని బలి తీసుకోలేదా…?…

Read More

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో పర్యటించిన రాహుల్ గాంధీ గారినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కో ఆర్డినేటర్ డా. సి. రోహిన్ రెడ్డి. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ గాంధీ గారికి వందలాది మంది కార్యకర్తలతో రోహిన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తాను పోటీ చేయాలని ఆశిస్తోన్న ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హోటల్ తాజ్ కృష్ణలో రాహుల్ బస చేయగా.. వారి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. శనివారం తాజ్ కృష్ణ నుంచి సంజీవయ్య పార్క్ కి రాహుల్ బయలుదేరగా.. వారి వెంట వెంట రోహిన్ రెడ్డి భారీసంఖ్యలో కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ దారిలో బుల్లెట్ ర్యాలీ అందరినీ ఆకర్షించింది, అక్కడి నుంచి గన్ పార్క్ అమరవీరుల స్థూపం మీదుగా గాంధీభవన్ వరకు జై కాంగ్రెస్,…

Read More

సురభీ గౌతమ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని పదో తరగతిలోనే నిర్ణయించుకుంది. మధ్య ప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన, కుగ్రామం నుండి వచ్చిన ఆ అమ్మాయి తన కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది. ఇంగ్లీష్‌ మాట్లాడలేక అవమానపడింది. చివరకు అనుకున్నది సాధించింది. ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు… ‘ఆరో తరగతి లెక్కల పరీక్షలో వందకు వంద మార్కులు సాధించాను. అప్పుడే క్లాసులో నాకంటూ ఓ గుర్తింపు, ప్రోత్సాహం లభించింది. ఎంత శ్రమిస్తే అంత గుర్తింపు వస్తుందని అప్పుడే నాకు అర్థమయింది” అంటూ తన స్కూలు చదువును గుర్తు చేసుకుంది సురభి. పదో తరగతిలో లెక్కలు, సైన్స్‌లో వందకు వంద మార్కులను సాధించింది. ఈ విజయం ఆమెకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కలను నేరవేర్చుకోవడానికి ఈ విజయాన్ని ఓ మార్గంగా భావించింది.బాధ్యతగా భావించిప్రస్తుతం ఓ మనిషి బతకాలంటే కనీసం వైద్యం, విద్యుత్‌ ఉండాలి.…

Read More

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: రేవంత్‌ తెలంగాణ అంటే మాకు ఆత్మగౌరవం: రేవంత్‌రెడ్డి రైతుల కుటుంబాలను కేసీఆర్‌ ఛిన్నాభిన్నం చేశారు: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: రేవంత్‌ ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తాం: రేవంత్‌ రెడ్డి భూమిలేని కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12వేలు సాయం చేస్తాం అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: రేవంత్‌ రెడ్డి రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుంది పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటాం పంటల బీమా పథకం అమలు చేసి.. నష్టపరిహారం వెంటనే అందజేస్తాం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు: రేవంత్‌ రెడ్డి పోడు రైతులకు పట్టాలు ఇస్తాం: రేవంత్‌ రెడ్డి పెండింగ్‌ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తాం: రేవంత్ రెడ్డి చట్టపరంగా రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం:…

Read More