ఆమె మహిళా అధికారిణి, ఆమెకు మీసం లేదు. కానీ మీసాలు తిప్పింది. ఆమె తోడ గొట్టింది. ఆ సౌండ్ కి రాజమహేంద్రవరం దద్దరిల్లింది. ఆమె దాడులు చేస్తుంటే అధికార, ప్రతిపక్ష నేతను అడ్డుపడబోయారు. ‘నేను ఎంఎల్ఏ ని’ అని ఎవరో అన్నారు.
‘అయితే నాకేంటి? ఇది నీ అసంబ్లీ కాదు, నా అడ్డా, తప్పుకోర బిడ్డా’ అని తోసేడింది.
‘నేను ఎంపి మనిషిని’ అని ఎవరో అన్నారు.
‘అయితే నా కెంటి?’ అని అతను చేసిన పోన్ కట్ చేసింది.
‘నేను సిఎం జగన్ మనిషిని’ అని ఎవరో అడ్డుపడ్డారు.
‘ఇంతకీ జగన్ ఎవరు? ఏం చేస్తుంటారు? మా పని మేము చేస్తుంటే వద్దని చెపుతారా? లంచాలు తీసుకుని మిమ్మల్ని వదలమ్నని చెపుతారా? అయితే నాకు ఫోన్ చేయించు. లంచం తీసుకుని మిమ్మల్ని వదిలేస్తాను’ అని హెచ్చరించింది.
అది ఆమె అహంకారం కాదు. ఆమె కర్తవ్యం. ఉద్యోగ ధర్మాని నమ్మిన ఆమె రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పర్యావరణ ఇంజనీర్ (ఈఈ), పేరు సైదా. ఆమె తన సిబ్బందితో మార్కెట్ కు వచ్చారు. పర్యావరణానికి హాని చేసున్న ప్లాస్టిక్, సంచులు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి అందర్నీ హడలగోట్టారు. ఎదురు తిరిగిన వాళ్ళ వస్తువులను ట్రక్ లో వేయించ్చారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్ట్ మెట్లు ఎక్కించారు.
ఇది తెలిసి అధికార, ప్రతిపక్ష నేతను అడ్డుపడబోయారు. తమ గుండాయిజం చూపబోయారు. కానీ ఆమె ‘తగ్గేదేలే’ అని అల్లు అర్జున్ లా స్టైల్ కొట్టి వాళ్ళను తిట్టి పంపారు. తన విధినిర్వహణకు ఎవ్వరైనా అడ్డుపడితే తాటా తీస్తా అని సివంగిలా ఉగిపోయారు.
ఎస్! ఇలాంటి అడపులులే మనకు కావాలి. కానీ ఎంతమంది అధికారులు ఆమెలా తమ విధులు సరిగ్గా నిర్వహిస్తారు?