నిజం నిప్పులాంటిది. అబద్దం అనే ఎండుటాకులు ఎన్ని కప్పినా అది ఏంతో కాలం దాగదు. అది ఇంకా రాజుకుని మంటలా బగ్గున పైకి వస్తుంది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మాహత్య విషయంలో కూడా అది మరోసారి రుజువయ్యింది. ప్రీతి తనకు తాను ఓ విషపూరిత ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తండ్రి, సోదరుడు మొదటినుంచి వాదిస్తున్నారు. నిజం తెలుసుకోవాలని పోలీసులు ఆమె వాడిన విషపూరిత ఇంజక్షన్, ఆమె బ్లడ్ సంపుల్స్ టాక్సీకాలజి కి పంపి నివేదిక కోరారు. ఆమె వాడిన ఇంజక్షన్ లో ఎలాంటి మత్తు మందు ఆవశేశాలు లేవనీ, ఎలాంటి హానికర రసాయనాలు లేవని ల్యాబ్ రిపోర్ట్ లో తెలిసింది.
దానితో ఆమె ఆత్మహత్య చేసుకోలేదు అని తేటతెల్లమయ్యింది. అది కచ్చితంగా హత్యానే అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. మరి ఆ హత్య ఎవరు చేశారు అన్నది పోలీసులు తేల్చాలి. ఆమెను చంపవలసిన అవసరం ఎవరికుంది? ఆమెను చంపవలసినంత కసి ఎందుకుంది?
ఏ కోణంలో చూసినా పోలీసుల అనుమానాలన్నీ ఆమె ప్రియుడు అని పిలవబడే సైఫ్ చుట్టే కందిరిగాల్లా తిరుగుతున్నాయి. నిజంగా అతను ప్రీతి ప్రియుడే అయితే ఎందుకు చంపుతాడు? అనేది మొదటి ప్రశ్న. లేదా ఆమెను ప్రేమించినట్లు నటించి హత్య చేసి ఉండాలి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది ‘లవ్ జిహాది’ అని మతం రంగు పులిమన బిజెపి తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజాయి ఇప్పుడు ఏమంటాడో చూడాలి.
నిందితుడు సైఫ్ కస్టడి 4 రోజుల్లో పూర్తి కానుంది. నిజానిజాలు తేల్చడానికి సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని ప్రీతి తండ్రి వేడుకుంటున్నాడు.
Also Read : ప్రీతి మృతిపై సందేహలెన్నో…ఈ 11సందేహాలకు సమాధానమేది..?