అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. 80మందితో కూడిన మొదటి జాబితాను బీఆర్ఎస్ ఆగస్ట్ లో విడుదల చేయనుంది. కాంగ్రెస్ కూడా మొదటి విడతను ఈ నెల చివర్లో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ధీటుగా తామూ ముందంజలో ఉన్నామని చాటేందుకు అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తోంది. అందుకే 30మందితో మొదటి జాబితాను ప్రకటించేందుకు కమలం అగ్రనేతలు రెడీ అయ్యారు.
అయితే ఇదివరకు ఈటల రాజేందర్ ప్రకటించినట్లుగా ఆయన్ను గజ్వేల్ నుంచి బరిలోకి దించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో ఈటల భార్య జమునను బరిలో నిలిపి గజ్వేల్ లో ఈటలను పోటీకి దించాలని ఎత్తుగడ వేస్తునున్నట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థులు వీరే అని కొన్ని పేర్లతో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అందులో గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి – అంబర్ పేట్
కే. లక్ష్మణ్ – ముషీరాబాద్
బండి సంజయ్ – కరీంనగర్
సోయం బాపూరావు – బోధ్
ధర్మపురి అరవింద్ – ఆర్మూర్
ఈటెల రాజేందర్ – గజ్వెల్
రఘునందన్ రావు – దుబ్బాక
డీకే అరుణ – గద్వాల
జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు
మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి
ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్
వివేక్ – చెన్నూరు
విజయశాంతి – మెదక్
యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్
రామచంద్ర రావు – మల్కాజ్ గిరి
ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్
ఆచారి – కల్వకుర్తి
జయసుధ – సికింద్రాబాద్
మహేశ్వర్ రెడ్డి – నిర్మల్
రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్
పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం
బాబు మోహన్ – ఆందోల్
నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరు
కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్
బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం
విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్
గరికపాటి మోహనరావు – వరంగల్
ఈటల జమున – హుజురాబాద్
విక్రమ్ గౌడ్ – గోషామహల్
అయితే ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఖండించింది. అభ్యర్థుల విషయంలో జాతీయ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనే ఫైనల్ అంటూ పేర్కొంది.
Also Read : హరీష్ రావుతో భేటీ- బీఆర్ఎస్ లో చేరికపై రాజాసింగ్ క్లారిటీ