టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఉన్నత అధికారి, అడిషనల్ కమిషనర్ అఫ్ పోలీస్ ఏ ఆర్ శ్రీనివాస్ దూకుడు పెంచారు. ‘రాబందువులు, గద్దలను వదిలి కాకుల వెంట పడ్డారు ఈ ఖాకి అధికారి’ అని నిన్నటివరకు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు అందరికి సరైన జవాబు చెపుతూ ఆయన ఉక్కుపాదంతో ఇక గద్దల వెంట ఇప్పుడు పడ్డారు.
మొదటివరకు తోలి దశలో చిన్న చిన్న ఉద్యోగులను అరెస్ట్ చేసిన అయన ఇప్పుడు రెండో దశ దర్యాప్తు మొదలు పెట్టారు. అందుకే టీఎస్ పీఎస్సీ బోర్డుకు కూడా నోటీసులు పంపి అందరికి షాక్ ఇచ్చారు అని తెలిసింది. టీఎస్ పీఎస్సీ బోర్డ్ ఛైర్మన్ జనార్ధనరెడ్డితో పాటు మరో ఏడుగురు సభ్యులకు నోటీసులు పంపినట్లు తెల్సింది.
వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని రాజకీయ ఒత్తిళ్ళు ఆయనకు ఇన్నప్పటికీ, వాటిని లెక్క చేయకుడా తన విధి నిర్వహణలో చెలరేగిపోతున్నారు. ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతి రేచ్చిపోయినట్లు, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రెచ్చిపోయే ఐపిఎస్ పోలీసు అధికారులు మనకు చాలా అరుదు. వీళ్ళు పోలిస్ శాఖకు రోల్ మోడల్స్.
అందులో ఒకనాడు చమండ వ్యాస్, ఉమేష్ చంద్ర ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న కొత్త బ్యాచ్ లో వి సి సజ్జనార్, ఏ ఆర్ శ్రీనివాస్ లాంటి వాళ్ళను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రేప్ చేసిన నిందుతులను కాల్చి చంపిన అభియోగాన్ని వి సి సజ్జనార్ ఎదుకుంటున్న విషయం తెలిసిందే. నాడు రేపిస్ట్ లు చనిపోయిన రోజు సజ్జనార్ ఫొటోకు ఆడవాళ్ళు పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రభుత్వం తట్టుకేలేక తెలంగాణ ఆర్టిసికి ఎండి గా పంపిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఆ పోలీసు అధికారి స్టానంలో సిట్ అధికారి ఏ ఆర్ శ్రీనివాస్ వచ్చారు. వీళ్ళకు ప్రజల్లో అభిమానులు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
ప్రశ్నపత్రాలు లీక్ కాగానే బోర్డు మూడు పరీక్షలను రద్దుచేసి చేతులు దులుపుకుంది. కింది స్టాయి ఉద్యోగులు ఈ స్కాం చేశారు అని తప్పుకోడానికి చూశారు. అయితే పెద్దవాళ్ళ ప్రమేయం లేనుండా చిన్నవాళ్ళు ఈ స్టాయిలో అవినీతికి పాల్పడరు అని ఏ ఆర్ శ్రీనివాస్ అనుమానం. అందుకే ఆ దిశగా అపరాధ పరిశోధన మొదలు పెట్టారు.
బోర్డును వెంటనే రద్దు చేయాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు. గవర్నర్ దీని మీద నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారి చేశారు.
ఇప్పుడు ఈ కేసులో టీఎస్ పీఎస్సీ బోర్డ్ ఛైర్మన్ జనార్ధనరెడ్డితో పాటు మరో ఏడుగురు సభ్యులలో ఎవ్వరయిన దోషులుగా తేలితే మాత్రం ఈ బోర్డ్ ను రద్దు చేయాలనీ శ్రీనివాస్ సిఫార్సు చేయవచ్చు. ఈ రెండో దశ పూర్తి కాగానే ఆయన మూడో దశలో అసలు రాబండువులను కూడా వదిలి పెట్టరాని తెలుస్తోంది.