గుడివాడ ఎమ్మెల్యే, పలు వివాదాలను తలా మీద వేసుకున్న కొడాలి నానిని అరెస్ట్ చేయడనిని దాదాపు రంగం సిద్దమయ్యింది. ఆయన పై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్లో ఉంది. లోగడ ఆయనకు ఎన్నిసార్లు సమన్లు పంపినా కోర్టుకు హాజరు కాలేదు. అందుకే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కన్నెర్ర చేసింది.
ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన గవర్నర్పేట సీఐ సురేష్ కుమార్ని ‘నాని ఎందుకు హాజరు కావడం లేదని’ న్యాయమూర్తి ప్రశ్నించారు. పని ఒత్తిడి వళ్ళ రాలేకపోతున్నారని ఆయన ఎప్పటిలా తప్పించుకునే దోరణిలో జవాబు చెప్పినట్లు తెలిసింది. దాంతో ఆగ్రహించిన న్యాయమూర్తి నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని, దాన్ని వెంటనే అమలు చేయాలని సీఐని జస్టిస్ గాయత్రీదేవిని ఆదేశింకారని తెలిసింది.
అసలు కేస్ ఏమిటంటే, నాటి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించడం లేదంటూ భారీగా ఆందోళనలు చేశారు. పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మే 10న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే కారణంగా కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాక పోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అది ఇంతకాలం పెండింగ్లో పడుతూ వచ్చింది. ఇప్పుడు దానికి రెక్కలు వచ్చేలా ఉన్నాయి.