వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదా..? అంటే అవుననే అంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ .
ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై ప్రశ్నించారు. అవును…కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారు. గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదని పునర్దాటించారు. మరి.. మీరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించగా..నా భవిష్యత్ ను కేసీఆరే డిసైడ్ చేస్తారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూరేనని, దాంతో మంత్రి కేటీఆర్ తన నానమ్మ ఊర్లో ఐదు కోట్లతో అభివృద్ధి పనులతోపాటు రెండున్నర కోట్ల రూపాయలతో స్కూల్ కట్టించారని గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి నుంచి పోటీపై కేసీఆర్ వెనకంజ వేస్తే తానే పోటీ చేస్తానని వెల్లడించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ పేరును తెరమీదకు తెస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని చెప్పగా.. ఓడిపోతానన్న ప్రతిసారి తనే గెలుస్తున్నట్లు గంప గోవర్ధన్ చెప్పారు.
Also Read : కేసీఆర్ కు బిగ్ షాక్ – డేంజర్ జోన్ లో 49మంది ఎమ్మెల్యేలు..?