ఇండియన్ ఐకాన్ నటుడిగా పిలువబడే అమిత బచ్చన్ కు మూడు రోజుల కిందట ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్లో ప్రమాదం జరిగింది అనే వార్త దేశ వ్యాపంగా వైరల్ గా మారింది. కోట్లాదిమంది అభిమానులు ఆందోళన చెంది టివిల ముందు, సెల్ ఫోన్ లకు అతుక్కుపోయారు. దేశం మొత్తం అట్టుడికి, ఈ అంశం చుట్టే తిరిగింది. చాలా షూటింగ్ లు ఆగిపోయాయి. దేశ ప్రధాన మొదలు కొని, కార్పొరేటర్ వరకు అందరు ఈ విషయం మీదా ఆరా తీసారు. అందులో నిజం లేదని మరికొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి.
అయితే అమితా బచ్చన్ ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ లో తనకు ప్రమదం జరిగిందని, కొన్ని గాయాలు అయ్యాయని, ఇప్పట్లో షూటింగ్ లో పాల్గోనలేనని తన బ్లాగ్ లో ప్రకటించారు. దాంతో దేశం మొత్తం ఆందోళన చెందింది. ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్న ఇదే వార్త.
‘ప్రాజెక్ట్ కే’ లో అమితా బచ్చన్, దీపికా పాడుకొన్, ప్రభాస్ నటి నటులు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్తు. అయితే అమితా బచ్చన్ కు షూటింగ్ లో ఎలాంటి ప్రమదం జరగలేదు అని ఆ సినిమా నిర్మాత సి. అశ్విని దత్తు మీడియాతో చెప్పారు. షూటింగ్ జరిగాకా మూడు రోజుల కిందటే అమితా బచ్చన్ తన ఇంటికి ముంబైకి క్షేమంగా వెళ్ళారని వివరించారు.
అయితే నిజంగా అమితా బచ్చన్ కు ప్రమాదం జరిగితే అయన ముంబాయికి వెళ్ళిన మూడు రోజుల తర్వార ఎందుకు వెలుగులోకి వచ్చింది? అనే అనుమానం అందరిని వెంటాడుతోంది. అంటే ఆ సినిమా నిర్మాత సి. అశ్విని దత్తు మీడియాతో చెప్పింది నిజమే అనిపిస్తోంది.
లోగడ అమితా బచ్చన్ కి ‘కూలి’ సినిమాలో ప్రమాదం జరిగితే కేవలం పది నిముషాలల్లో ప్రపంచం మొత్తం తెలిసింది. ఎందుకంటే తుమ్మినా – దగ్గినా ఎవ్వరికీ తెలియని ఆ రోజుల్లోనే ఆ వార్త అంత వైరల్ గా మారింది. మరి అడుగడునా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో మూడు రోజులుగా ఆ వార్త దాగుతుందా? ఇదే అనుమానం అందరిని వెంటాడుతోంది.
అయితే ఇక్కడో సెంటిమెంట్ బలంగా ఉంది. అమితా బచ్చన్ షూటింగ్ లో ఏ చిన్న ప్రమదం జరిగినా, ఆ వార్త ప్రజల్లోకి వెళ్ళినా ఆ సినిమా అఖండ విజయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ అమితా బచ్చన్ కి బాగా కలిసి వస్తుంది. ‘షోలే, ముఖద్దర్-కా-సికందర్, డాన్, కూలి, సర్కార్’ లాంటి సినిమాలల్లో కూడా ఇలాంటి పుకార్లే పుట్టాయి. ఆ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో అందరికి తెలిసిందే.
అంటే ‘ప్రాజెక్ట్ కే’ సినిమా కూడా ఆ తరహాలోనే అఖండ విజయం సాధించ బోతోందన్నమాట. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవ్వరి సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి. సినిమాలల్లో ఆ నమ్మకాలు మరీ ఎక్కువా. మొత్తానికి అమితా బచ్చన్ మాత్రం క్షేమంగా ఉన్నారని ఈ రోజు తెలిసింది. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అభిమానులు ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.