Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
వైసీపీ నుంచి బహిష్కరణ వేటుకు గురైన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు..? టీడీపీలో చేరనున్నారా..? లేక మరో పార్టీని ఎంచుకునే అవకాశం ఉందా..? అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరుఫున విజయం సాధించారు. ఆ తరువాత మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని గట్టి ప్రయత్నాలు చేసింది కానీ జగన్ కరుణించలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసిందని శ్రీదేవిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. జగన్ తనకు మైండ్ బ్లాక్ అయ్యే గిఫ్ట్ ఇచ్చారని తాను త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నిజానికి ఉండవల్లి శ్రీదేవికి పెద్దగా రాజకీయానుభవం లేదు. ఆమె అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. జగన్ సతీమణి భారతికి ఉండవల్లి శ్రీదేవి స్నేహితురాలు. ఆవిధంగా…
వైసీపీలో జగన్ తరువాత అంత సజ్జల రామకృష్ణానే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలో ఎప్పుడు ఏం చేయాలి..? ఎవరిని దూరం పెట్టాలి..? ఎవరికి గాలం వేసి గుంజాలి..? అనే విషయంలో సజ్జల సూచనలను జగన్ అమలు చేస్తారన్న ప్రచారం ఉండనే ఉంది. అయితే…ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణం సజ్జల గైడ్ లైన్స్ మాత్రమేనని ఇందులో జగన్ కు ఎంత మాత్రం ఓటమిని ఆపాదించవద్దునని మీడియాలో కథనాలు వస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సజ్జల వలెనే జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకొకున్నారని అది పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైందని వైసీపీ అనుకూల మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. జగన్ దగ్గరకు ఎమ్మెల్యేలు వెళ్ళాలంటే ముందు సజ్జల పర్మిషన్ తీసుకోవాలని.. దాంతోనే జగన్ కు ఎమ్మెల్యేలతో గ్యాప్ ఏర్పడిందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో జగన్ చరిష్మా మసకబరాకుండా ఉండేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఓటమికి సజ్జలే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా పని చేసి రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డీఎస్ ఇప్పుడు కుమారుల రాజకీయంతో సతమతం అవుతున్నారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తిరిగి సోమవారం ఆయన పేరుతో విడుదల లేఖలో మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో చేరనేలేదని.. పార్టీలో చేరినట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ లేఖలో ప్రకటించారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగానే గాంధీ భవన్ కు వెళ్లాను తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాదని ఆయన పేరిట విడుదలైన లేఖలో పేర్కొన్నారు. గాంధీ భవన్ కు వెళ్తే అక్కడ అభిమానంతో తనకు కండువాలు కప్పారన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్ …తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారు. ప్రస్తుతం డీఎస్ ఆరోగ్యం ఏమాత్రం…
తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు కర్తవ్యాన్ని మరిచాడు. విద్యార్థులకు మంచి, చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్ధినిలను పిలిచి అర్దనగ్నంగా డ్యాన్సులు వేయించి వారితో అనుచితంగా ప్రవర్తించాడు. బాలికలు వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా వారితో బట్టలు విప్పించి మరీ స్టెప్పులు వేయించాడు ఓ మాష్టర్. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో రామ్ సింగ్ ఠాకూర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 11న పాఠశాలకు చెందిన విద్యార్ధినిల తరగతిలోనే అర్దనగ్నంగా డ్యాన్సులు చేయించాడు. బాలికలు అలా చేయలేం సార్ అని చెప్పడంతో వారిని బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడిన విద్యార్థినులు బట్టలు అయిష్టంగానే విప్పి అర్దనగ్నంగా డ్యాన్సులు చేశారు. అదే సమయంలో సెల్ ఫోన్ లో వీడియో…
అన్ని ప్రాణులకు నీరు అనేది జీవనాధారం అని తెలిసిందే. నీరు తాగకుండా ఏ జీవి మనుగడ కొనసాగించలేదు. ఉదయం పరిగడుపునే నీరు తాగడం అనేక విధాల శ్రేయస్కరం. ఎందుకంటే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం నిద్ర లేచే వరకు కడుపుకు విశ్రాంతినివ్వడంతో కడుపు ఇబ్బందిగా ఉంటుంది. అదే సమయంలో ఉదయాన్నే నీటిని తాగడం వలన మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే మంచి నీళ్ళు తాగడం వలన జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం ఇబ్బందిగా ఉండదు. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు ఉదయాన్నే నీళ్ళు తాగడం మరీ మంచిది. కడుపులో ఎసిడిటి తగ్గుతుంది. జీర్ణక్రియలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తుంది. ఇంకా చర్మం ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. పరిగడుపున నీళ్ళు తాగడం వలన శరీరంలో ఉండే ట్యాక్సిన్లు బయటకు వెళ్ళేలా చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్ళు…
రాననుకున్నారా..? రాలేననుకున్నారా..? అంటూ కరోనా మహమ్మారి సవాల్ విసురుతున్నట్లుంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు రెండంకెలకు మించకపోవడంతో కరోనా పీడ విరగడ అయిందనుకున్నారు. కరోనా మూడు వేవ్ లు చూసిన జనాలు కరోనా స్వభావంపై ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతిసారి కరోనా కేసుల సంఖ్య అత్యంత దిగువ స్థాయికి చేరి ఆ తరువాత పతాక స్థాయిని చేరుకుంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశానికి మళ్ళీ కరోనా టెన్షన్ పట్టుకుంది. కొత్త కేసులు రెట్టింపు స్థాయిలో నమోదు అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 24గంటల వ్యవధిలో 56,551మందిని పరీక్షించగా…1, 805అందికి కరోనా వైరస్ సోకినట్లు తెలిపింది. ముందు రోజు కూడా ఇదే స్థాయిలో కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. రోజువారీ పాజిటివిటి రేటు 3.19శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో కొత్త…
టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారి ఎ.ఆర్ .శ్రీనివాస్ ఈ సిట్ కు అనర్హుడా..? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్షతోపాటు జరినామా పొందిన అధికారికి ఇంతటి కీలకమైన కేసును ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. జైలు శిక్ష పడకుండా శ్రీనివాస్ తెచ్చుకున్న స్టే గడువు కూడా ముగిసిందన్నారు. అంతేకాదు ఎ.ఆర్ శ్రీనివాస్ నియామకం వెనక కుట్ర కోణం ఉందని జడ్సన్ ఆరోపిస్తున్నారు. పలు కేసుల్లో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన సిట్ లకు తమ అనుకూలురును చైర్మన్ లుగా నియమించేసి కేసు మొత్తాన్ని ప్రభుత్వం డైవర్ట్ చేసిందని జడ్సన్ అన్నారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఏర్పాటు చేసిన సిట్ కు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ భర్త ఆకున్ సబర్వాల్ ను నియమించి ఆ కేసును…
వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణాధికారిని మార్చాలని లేదా మరో అధికారిని నియమించాలని సీబీఐని ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఇప్పటివరకు పరిణామాలను వివరిస్తూ రూపొందించిన రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. ఇందులో ఎక్కడ చూసినా రాజకీయ దురుద్దేశమే ఉన్నట్లు పేర్కొన్నారని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా చేస్తే నిందితులకు శిక్ష పడదన్నారు. హత్యకు దారితీసిన ప్రధాన కారణాలు దాని వెనుక ఉన్న ఉద్దేశాలను సీబీఐ బయటపెట్టాలని న్యాయస్థానం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు ఏమాత్రం సరిగా లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కుట్ర కోణం గురించి ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ఏమాత్రం సరిగ్గా లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులోనున్న సూత్రాధారులు దాని…
దేశంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టసభలో అవకాశం ఉండాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెద్ద పోరాటమే చేశారు. రిజర్వ్డ్ స్థానాలు ఉండాల్సిందేనని పట్టుబట్టి విజయం సాధించారు. ఏ కులాలైతే రాజ్యాధికారానికి దూరంగా ఉంటాయో ఆ కులాలు కాలక్రమంలో అంతరించిపోతాయని బాబా సాహెబ్ చెప్పి ఉన్నారు. అందుకే రాజ్యాధికారంలో వాటా కోసం రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండాలన్నారు అంబేద్కర్. ఇందుకోసం మహాత్మా గాంధీని సైతం ధిక్కరించాడు. ఏదీ ఏమైనా భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ఎస్సీ, ఎస్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమైతే దక్కింది కానీ , అంబేడ్కర్ ఏ ఆశయం కోసమైతే చాలా దూరదృష్టితో రిజర్వ్డ్ స్థానాలు ఉండాలని పట్టుబట్టారో ఇప్పుడు ఆ స్థానాల్లో ఆధిపత్య కులాలవారే రాజ్యం ఏలుతున్నారు. అదేంటి.. ఇది నిబంధనలకు విరుద్దం కదా అనే సందేహం రావొచ్చు. కానీ చాలా తెలివిగా ఆధిపత్య కులాల పార్టీలు రిజర్వ్డ్ స్థానాల్లో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్…
రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా గాంధీ భవన్ లో ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్ష నిర్వహించారు. రాహుల్ గాంధీకి వస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకే రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని.. ఇదంతా మోడీ కుట్రేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ సంకల్ప్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ లో ఎదుర్కొలేకే అనర్హత వేటు వేశారన్నారు. దేశం కోసం ఎప్పుడు ముందుండే గాంధీ కుటుంబంపై మోడీ కుట్రలు పన్నుతున్నాడని అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టాల్సిన కార్యాచరణపై ఏఐసీసీ కసరత్తు చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామా చేయాలనే అంశంపై పార్టీ చర్చిస్తోందని…ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు రేవంత్…