Author: Prashanth Pagilla

నిరుద్యోగులకు అండగా ఉంటామని వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ చేపట్టిన బండి సంజయ్… మొదట ప్రధాని ఇంటి దగ్గర నిరుద్యోగ మార్చ్ చేపట్టాలని చురకలంటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోడీ మోసం చేశారని మండిపడ్డారు. 22 కోట్ల 6లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్‌లో ప్రధాని సమాధానం ఇచ్చారన్న రేవంత్… అంటే పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు మోడీ అంగీకరించినట్లేనని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోడీ మోసం చేశారో… బండి సంజయ్ కూడా అదే విధమైన హామీని ఇస్తున్నట్టున్నారని మండిపడ్డారు రేవంత్. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నారని… ఆయన చేసిన వ్యాఖ్యలు విని నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా…

Read More

తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హెల్త్ డైరక్టర్ గా కొనసాగుతున్న ఆయన మూఢనమ్మకాలకు జనాలు ఆకర్షితులు అయ్యేలా కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గడల శ్రీనివాసరావు, తాను ఈరోజు బ్రతికి ఉన్నానంటే కారణం తనకు కట్టిన తాయత్తు వలనేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ స్థాయికి చేరడంలోనూ తావీజ్ మహిమ ఉందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైద్యులు నయం చేయలేని జబ్బును తాయత్తు నయం చేసిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే పోలిటికల్ ఎంట్రీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ చేయడమే అసలైన రాజకీయమని.. తనకు కేసీఆర్ టికెట్ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసే ఆలోచనతోనున్న శ్రీనివాసరావు గత కొంతకాలంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు చేరువ అయ్యేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా…

Read More

వైఎస్ వివేకా హత్యలో కీలక పాత్ర భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలదేనని సీబీఐ ఆరోపించింది. ఈమేరకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు నివేదించింది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరియు ఉదయ్ కుమార్ రెడ్డిలను తమ కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ లతోపాటు ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా వివేకా హత్యలో వీరిద్దరి పాత్రను తెలిపింది సీబీఐ. వివేకా హత్యకు ఉపక్రమించిన సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి తదితరులు వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితులని సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేకాతోనున్న రాజకీయ విబేధాలే ఆయనను హతమార్చేందుకు మర్డర్ ప్లాన్ వేశారని సీబీఐ ఆరోపించింది. 2017 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకా ఓటమి పాలయ్యారు. తన ఓటమికి భాస్కర్ రెడ్డి కారణమని ఆయన ఇంటికి వెళ్లి వివేకా ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇది మనస్సులో పెట్టుకొని వివేకా…

Read More

జాతీయ రాజకీయాలంటూ బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు సభలను నిర్వహించిన బీఆర్ఎస్ మరోసారి భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ నెల 24న ఔరంగాబాద్ లో సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఏపీ, ఓడిశా రాష్ట్రాలకు బీఆర్ఎస్ రాష్ట్ర అద్యక్షులను కూడా ప్రకటించిన కేసీఆర్… ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించలేదు. కానీ మహారాష్ట్రలో రాష్ట్ర అద్యక్షుడి వెతుకులాటలోనున్న బీఆర్ఎస్ మాత్రం అక్కడ వరుసగా సభలు నిర్వహించడం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికలున్న కర్ణాటకను వదిలేసి మహారాష్ట్రలో ఇలా సభలు ఏర్పాటు చేయడానికి గల ప్రత్యేక కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఇప్పటివరకు మహారాష్ట్రల్లో నిర్వహిస్తోన్న సభలు ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్నవే. పైగా మహారాష్ట్ర శివారు అంటే తెలంగాణ సరిహద్దుతోనున్న ప్రాంతాలే. మహారాష్ట్ర శివారు ప్రాంత ప్రజలకు నగదు బదిలీ వంటి…

Read More

ఏళ్లకు ఏళ్లుగా విడిపోయిన వారిని బలగం సినిమా ఏకం చేస్తోంది. మనుషుల మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించేస్తు కొత్త చరిత్రను లిఖిస్తోంది. ప్రతి వారితో కన్నీరు పెట్టిస్తు పెరిగిపోయిన ఎడబాటును పూడ్చివేస్తోంది బలగం సినిమా. సినిమా చూసి హీరోయిజం ప్రదర్శించేవాళ్ళను, కామెడి చేసే వాళ్ళను చూసాం కానీ, తెగిపోయిన బంధాలను తిరిగి వెతుక్కుంటున్న స్థితిని బలగం సినిమా కల్పించింది. బలగం సినిమాను గ్రామాల్లో సర్పంచ్ లు, గ్రామ యువత ముందుకు వచ్చి విశాలమైన ప్రాంతాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామాల్లో ఈ సినిమాను ప్రదర్శించడం జరిగింది. సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ గతంలో విడిపోయిన బంధువులు కలిసిపోతున్న సంఘటనలు చాలానే ఉంటున్నాయి. ఇటీవల భూ వివాదం తలెత్తడంతో అన్నదమ్ములు మాట్లాడుకోవడం మానేశారు. కానీ ఈ బలగం సినిమా చూస్తూ ఒక్కటి అయ్యారు. సినిమా ప్రదర్శిస్తోన్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడే ఉండటంతో మేము కలిసిపోతామని ముందుకు వచ్చారు. తాజాగా ఇలాంటి…

Read More

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరుగుతోన్న వేళ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివేకా క్యారెక్టర్ కు మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా కేసు నిందితుడిగానున్న సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడంతోనే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశాడని ఆరోపించిన అవినాష్ రెడ్డి ఇప్పుడు కొత్త ఆరోపణలు చేశారు. వివేకా కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో సంచలన ఆరోపణలు చేశారు అవినాష్ రెడ్డి. మహిళలతో వివేకాకున్న వివాహేతర సంబంధాలే ఈ హత్యకు దారి తీసి ఉంటాయని పేర్కొన్నారు. ఇదివరకు ఓ ముస్లిం మహిళతో సంబంధం..వారి కొడుకునే రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పారని… ఇదంతా మనస్సులో పెట్టుకొని ఆస్తి తగాదాలతోనే వివేకాను అతని అల్లుడు హత్య చేసి ఉంటాడని ఆరోపించాడు అవినాష్ రెడ్డి.…

Read More

ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ కర్ణాటకలో బీజేపీ గ్రాఫ్ డమాల్ మంటోంది. ఇప్పటికే ఆ పార్టీని అరవై మంది నేతలు వీడారు. ఈ ఒక్క ఉదంతం చాలు. కర్ణాటకలో బీజేపీ గెలుపుపై ఆ పార్టీ నేతలకు నమ్మకం ఎంత సన్నగిల్లిందో చెప్పేందుకు. కాంగ్రెస్ లోకి పెరుగుతోన్న చేరికలను చూసి కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమని పోలింగ్ కు ముందే ఓ అంచనాకు వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హవా కొనసాగిన సమయంలోనూ కర్ణాటక కాంగ్రెస్ లో ఈస్థాయి చేరికలు లేవు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీనే కొనసాగుతున్నా..కర్ణాటక ఎన్నికలపై అమిత్ షా , జేపీ నడ్డాలు ఫోకస్ చేస్తున్నా ఆ పార్టీని వీడే నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయా పార్టీలను వీడుతోన్న నేతలంతా తమ రైట్ ఛాయిస్ గా కాంగ్రెస్ నే ఎంచుకుంటున్నారు. కాంగ్రెస్ గెలుపుపై నమ్మకం కల్గుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారు. టికెట్ కోసం పక్క…

Read More

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ భేటీ అయింది. సుమారు ఆరు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఇటీవలే బీఆర్ఎస్ సస్పెన్షన్ కు గురైన పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది రాహుల్ గాంధీ టీమ్. వీరి భేటీలో రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాహుల్ గాంధీ టీమ్ స్పష్టమైన నివేదికను పొంగులేటి ముందు ఉంచడంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు కానీ, సీట్ల కేటాయింపులో తనకు స్పష్టమైన హామీ కావాలంటూ పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ లో చేరికపై పొంగులేటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. తన అనుచరులకు పది టికెట్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ టీమ్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. మధిర, భద్రాచలం మినహా ఖమ్మం జిల్లాలోని మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్ ఇవ్వడంతోపాటు కంటోన్మెంట్ లో కూడా తన అనుచరుడికి టికెట్…

Read More

పుల్వామా దాడి ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన విషయాలను వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి జవాన్లకు ముప్పు ఉందని నిఘా వర్గాలు 11సార్లు హెచ్చరించినా కేంద్రం పట్టించుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదుల నుంచి సైనికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జవాన్లను రోడ్డు మార్గంలో పంపడం సరైంది కాదని… వారిని ఎయిర్ క్రాఫ్ట్ లో పంపించాలని తాను సూచనలు చేసినా ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా లు పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఎటాక్ జరిగిన తరువాత తాను చేసిన సూచనలు , కేంద్రం పెడచెవిన పెట్టిన అంశాలను ఎక్కడ లీక్ చేయవద్దని ప్రధాని చెప్పారని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు. పుల్వామా దాడి పూర్తిగా కేంద్రం నిర్లక్ష్యమేనని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలతో వచ్చిన ట్రక్కు ఇండియాలో కీలక ప్రాంతాల్లో తిరిగిందని కానీ…

Read More

వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన కుమారుడు అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్లు ఉంది. నెక్స్ట్ అరెస్ట్ తనదేనని గ్రహించినట్లు ఉంది. అందుకే తనను అరెస్ట్ చేయడకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం మధ్యాహ్నం 2 : 30కు విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ధర్మసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. వివేకా హత్య కేసులో ఆదివారం భాస్కర్ రెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేసిన సీబీఐ… అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందని ప్రచారం జరిగింది. పులివెందులలో అవినాష్ రెడ్డి కోసం వెతికినా ఆయన అక్కడ లేకపోవడంతో హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి మరో సీబీఐ బృందం వెళ్ళింది. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో అవినాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళారన్న…

Read More