Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. అదే సమయంలో మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైళ్లో ఉన్న ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇతను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను వెనువెంటనే ఆమోదించారు. నిజానికి ఈ ఇద్దరు ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు. ఈ ఇద్దరివల్ల ఆమ్ అద్మి పార్టీ పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. దాంతో కంగుతిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. అందుకే ఆ ఇద్దరినీ ముందుగా రాజీనామాలు చేయమని ఆదేశించినట్లు తెలిసింది. అందుకే వాళ్ళు కిక్కురుమనకుండా రాజీనామాలు చేశారు. దానిని కేజ్రివాల్ వెంటనే ఆమోదించారు. అంతకు ముందు సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని,…
నేడు ప్రపంచాన్ని ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య గుండె నొప్పి. చిన్న పిల్లకు మొదలు మధ్య వయసు వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పగా కూలి ప్రాణాలు వదులుతున్నారు. ఇది భూకంపం లాంటిది. వచ్చే ముందు తెలియదు – వచ్చాకా ఆపలేము. అంతా నిముషాల్లో జరిగిపోతుంది. ”ఆయనకు ఏ జబ్బు లేదు, చాలా ఆరోగ్యంగా ఉండే వారు. ఉన్నట్టుండి గుండె పోటుతో పోయారు” అని మనం తరచూ వింటుంటాము. ఇది నిజం కాదు. వాళ్లు ఈ పది సూత్రాల లోంచి ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి అలా పోయారు. గుండె నొప్పికి ఏ ఒక్క కారణమో మూలం కాదు. కర్ణుడి చావుకి వంద శాపాలు ఎలా కారణమో, గుండె నొప్పికి కూడా వంద సమస్యలు కారణం. మీరు ఈ 10 సూత్రాలు కచ్చితంగా పాటిస్తే మీకు గుండె నొప్పి రాదనీ ఆయుర్వేదిక్ డాక్టర్ల్ లు హామీ ఇస్తున్నారు. వీటిని పాటించి మీకు…
తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ స్టానంలో ఈటెల రాజేందర్ని నియమించే యోచనలో కేంద్రం పెద్దలు ఆలోచనలో ఉన్నట్లు విశ్వాసనీయ వర్గాలద్వార తెలిసింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కేంద్ర బిజెపి ఆశించినంత స్టాయిలో బండి నుంచి ఫలితాలు రావడం లేదని వాళ్లు రహస్యంగా చేపట్టిన సర్వే ఫలితాలు తేల్చాయి. మరో ఏడు నెలల్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలాగైనా 90 సీట్ లు గెలవాలని ‘మిషన్ 90’ ఆపరేషన్ మొదలు పెట్టింది కేంద్రం. ఇది అంత తేలిక కాదు. అందుకే కేంద్రం ఓ ప్రణాళిక తాయారు చేసి బండి మీద మోపింది. అందులు భాగంగా ఇప్పటికే 12౦౦౦ బ్లాక్ స్టాయిలో మీటింగ్ లు జరిపి ప్రతి ఐదు లేదా ఆరు గ్రామాలకు ఒక డివిజన్ చొప్పున కింది స్టాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. కింది క్యాడర్ చాలా బలంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోల్చితే…
”ఈమధ్య పోలిసుల అరాచకాలు మరీ మితిమీరు తున్నాయి. హోటల్లలో వ్యభిచారం చేసుకునే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. కోర్టులు మరీ దారుణం. వ్యభిచారం చేసుకే వాళ్ళకు ఫైన్ వేస్తున్నారు. పవిత్రమైన మన దేశంలో ఒళ్ళు అమ్ముకోవడం కూడా తప్పేనా? ‘ఇల్లు’ అమ్ముకుంటే తప్పు లేదు. మరి ‘ఒళ్ళు’ అమ్ముకుంటే తప్పు ఎలా అవుతుంది? మేము కూడా జిఎస్టి కడుతున్నాము కదా? ఈ అరాచాలకు నేను పుల్ స్టాప్ పెడతాను” అని అనుకుంది ఓ వీరనారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందిన లక్ష్మీ అలియాస్ విజయా అలియాస్ అనురాధా (అసలుపేరు ఎవ్వరికి తెలియదు) కి కొత్త ఆలోచన వచ్చింది. ఒళ్ళు అమ్ముకుని పదిమందిలో పరువు పోగొట్టుకోవడం కంటే గౌరవప్రదంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ద్రౌపతి ఐదుగురిని పెళ్లి చేసుకుంటే లేని తప్పు తాను కూడా చేసుకుంటే ఎలా తప్పవుతుంది? అనుకుంది. పెళ్లి చేసుకుంటే చెడ్డ పేరు రాదు, రైడింగ్ లో దొరకదు. కోర్ట్…
ఇకరి బట్టలు మరొకరు ఎక్స్చేంజ్ చేసుకోడం తెలుసు. ఒకరి బైక్ లు మరొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా చూసాము. కానీ ఒకడి భార్యను మరొకడు ఎక్స్చేంజ్ చేసుకుని పెళ్లి చేసుకున్న సంఘటన గురుంచి మీరు ఈ కలియుడంలో చూసారా? చూడక పొతే ఇప్పుడు చూడండి. బీహార్ లోని ఖగాడియా అనే జిల్లా లోని హర్దియా గ్రామంలో కూలి పని చేసే ముఖేష్ అనే యువకుడు రూబి (సీనియర్) అనే అమ్మయిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. విచ్చలవిడిగా తిరిగారు. కానీ కొన్ని కారణాలవల్లా వాళ్ళ పెళ్లి జరగలేదు. రూబి (సీనియర్) అనబడే ఆమె ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేసే నీరజ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. నలుగు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ముఖేష్ రూబి జూనియర్ ని (ఇద్దరి పేర్లు రూబీ కాబట్టి జూనియర్, సీనియర్ అని రాయాల్సి వస్తోంది) పెళ్లి చేసుకున్నాడు. సంసారం బాగానే…
స్త్రీ ఒంటికి బట్ట కట్టకపోయినా పర్వాలేదు, కానీ నోటికి మాత్రం బట్ట కట్టాలి అని పెద్దలంటారు. ఆ సూత్రం విజయానికి మొదటి సోఫానం. స్త్రీ కాలు జారినా పర్వాలేదు, కానీ నోరు జరకూడదు అని మన పెద్దలు తరచూ హెచ్చరిస్తారు. ఎందుకంటే ఓ తప్పటడుగు వేస్తే వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఓ కారు కూత కూస్తే వెనక్కి తీసుకోలేదు. నోరు మంచిదైతే ఉరు మంచిదవుతుంది. ఎక్కడో రాయలసీమలో పుట్టి, తెలంగాణాలో చదివి, మద్రాస్లో పెళ్లి చేసుకుని, ఆ భర్తను వదిలి, మళ్ళి హైదరాబాద్లో రెండో పెళ్లి చేసుకున్న షర్మిల ఫ్యాక్షన్ భావాజాలంతో నోరు పారేసుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేదు. కులము, మతం అనే తేడా లేకుండా ఎవరినిపడితే వాళ్ళను నోటికి వచ్చినట్లుగా బండబూతులు తిడుతున్నారు. అది రాజకీయం అనిపించుకోదు. పాదయాత్ర పేరుతో గాలిపటంలా తిరుగుతూ ‘గాలిమాటలు’ మాట్లాడితే ఎవ్వరు సహించరు. దీనికి అసలుకారణం ఆమె చేపట్టిన యాత్ర రేవంత్…
ఈ వార్త చదివే ముందు ఓ జోక్ చదివి నవ్వుకోండి. స్కూల్ పిల్లలతో పాటు చంటి జూ పార్క్ కి వెళ్ళాడు. అంతలో పులి బోనులోంచి తప్పించుకుంది. అందరు భయపడి చెట్ల వెనక భయంతో నక్కారు. ఇంట్లో ఉన్న చంటి తల్లికి ఈ వార్త తెలిసి వెంటనే ఫోన్ చేసి ”ఎక్కడున్నావురా?’ భయంతో అడిగింది. చంటి నవ్వి ”పులి బోనులో దాక్కున్నాను. డోంట్ వర్రీ” అన్నడు. ఈ కామెడీ ప్రాక్టికల్ గా జరిగింది. గతకొన్ని రోజులుగా ఉత్తెర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఓ చిరుత పులి జనావాసాల మీద దాడులు చేస్తోంది. దానిని పట్టుకోడానికి అటవీశాఖ నానా తంటాలు పడుతోంది. కొన్ని బోనులను చుట్టూ పక్కల ప్రాంతాలల్లో పెట్టింది. అందులో చిరుత పులికి ఎరగా కోళ్ళను పెట్టింది. ఈ విషయం తెలియని ఓ దొంగ ఆ కోడిని దొంగిలించాలని బోనులోకి మెల్లిగా దూరాడు. ఆ బోనుకు ఆటోమాటిక్ లాక్…
మోసాలల్లో బాబాలు ఎప్పటికప్పుడు హై టెక్నాలజీ వాడుతున్నారు. అందులో ‘కమండలం తిరిగిన’ (చెయ్యి తిరిగిన) జైనుల్ల బుద్దీన్ బాబా అగ్రగన్యుడు. ఇతని భక్తులలో మహిళలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాడు. ఇంత గొప్ప రిజర్వేషన్లు అమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుచేయడం లేదు. మగవాళ్ళు రావడానికి వీల్లేదు. మగాళ్ళకు బదుకు, వాళ్ళ ఆడవాళ్ళను పంపమంటాడు. డబ్బుకు ఆశపడే ఆడవాళ్ళు ఇతని టార్గెట్. ఆశతో వచ్చిన మహిళలకు ముందుగా సృష్టి రహస్యాలగురించి హితబోధ చేస్తాడు. మలముత్రాలు నిండిన ఈ దేహం అశాశ్వతం అంటాడు. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంటరాదు, నడుమ బట్ట కడితే నగుబాటు అని కర్మ సిద్ధాంతాలు వల్లిస్తాడు. మలినమైన ఈ దేహం మీది మురికి బట్టలు ఉండరాదు అంటాడు. ద్యాసం మొత్తం దేవత మీదే ఉండాలి అంటాడు. అలా మనసా, వాచా త్రికరణ శుద్దితో పూజలు చేస్తే కోరుకుంది సిద్దిస్తుంది అని నమ్మబలుకుతాడు. అనారోగ్యం ఉన్నవాళ్ళకు…
అధిక మోతాదు ఆరోగ్యానికి చేటని పెద్దలు చెపుతారు. సెల్ ఫోన్ అధికంగా వాడేవారికి కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఇంకా నమ్మకపోతే ఈ వార్త చదవండి. లండన్ కి చెందిన 29 ఏళ్ల ఫెన్నెల్ల ఫాక్స్ వర్టిగో అనే అమ్మయి ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యి వీల్ చేర్ కి పరిమితమయ్యింది. ఆమెకు అన్నిరకాల వైద్య పరిక్షలు చేసినా రోగం ఏమిటో డాక్టర్లకు అర్థం కాలేదు. అసలు రోగం ఏమిటో తెలిస్తే కదా మందు ఇవ్వడానికి? ఆమె పరిస్టితి రోజు రోజుకు క్షిణిస్తోంది. ఇది ఇప్పటివరకు మెడికల్ చరిత్రలో రాని కొత్తరకం రోగమని డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత ఆ కొత్త రోగాన్ని తెలుసుకోడానికి శాస్త్రవేత్తల బృందం రంగంలోకి దిగింది. ఆమె వివరాలు సేకరించారు. సోషల్ మీడియాలో రోజుకు దాదాపు 14 గంటలు స్క్రోలింగ్ చేసినటు ఆమె డాక్టర్లతో పాటు ‘ది మిర్రర్’ అనే వార్తా సంస్టకు ఇచ్చిన ఇంటర్ వ్యూ…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకున్నారు అన్న వార్త మన దిన చర్యలో ఓ భాగమయింది. అదికూడా గిట్టనివాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెపితేనే కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. లేకపొతే తమ విధులు సరిగ్గా నివహించక దొంగలను వదిలేస్తున్నారు. లేదా పట్టుకున్న కేసుల్లోంచి సగం కేసులు అనధికారికంగా సెటిల్మెంట్ చేసి అందినంతా నొక్కేసి, అందరు సమానంగా పంచుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని కేసులు మాత్రమే అధికారికంగా రికార్డ్ చేసి అరెస్ట్ చేస్తున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి కేసులు రోజు రోజుకు పెట్రోల్ ధరలా ఒక్క హైదరాబాద్ లోనే పెరుగుతున్నాయి కాబట్టి. ఈ రోజు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా తీసుకువచ్చిన 528 గ్రాముల బంగారం ముద్దలను కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 47 లక్షలు ఉంటుంది…