Author: Duriki Mohan Rao

నిన్న, అంటే మార్చ్ 16 న ఈడి విచారణ తర్వాత ఎమ్మెల్సి కవిత తప్పక అరెస్ట్ అవుతారు అని మొత్తం తెలుగు ప్రజానీకంతోపాటు యావత్తు దేశం కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూసింది. ఉదయం పది గంటల ముప్పయి నిముషాలకు ఆమె ఈడి కార్యాలయానికి వస్తారు అని ప్రెస్ పడిగాపులు కాసింది. ఈడితోపాటు ఇతర నిందితులు కూడా కార్యాలయం లోపల ఎదురు చూశారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఆమె హాజరు కాకుండా తన   లాయర్ని పంపి జంప్ జిలాని లా తప్పించుకున్నారు. కవిత ఓ కుంటిసాకు చూపడం చాలా బాధాకరం. మీరు పంపిన నోటిసులో ఈ నెల 16న గ్రూప్ విచారణ ఉన్నదని ఆదేశించారు, కానీ అందులో ‘నేను వ్యక్తిగతంగా పాల్గోనాలి’ అని రాయలేదు. కావున నా తరపున నా లాయర్ని పంపుతున్నారు అని చాలా తెలివిగా ఈడి అధికారులకు ఆమె జవాబు ఇచ్చారు. ‘నన్ను పేరంటానికి పిలిచారు, కానీ బొట్టు…

Read More

నాడు ఆడదాని కోసం యుద్దాలు; నేడు ఆడదానికోసం స్కాం లు? ఒక చిన్న హోల్ మొత్తం పడవనే ముంచుతుంది అన్నది ఓ సామెత. అలాగే ఒక ఆడదాని మీది చిన్న వ్యామోహం జీవితాలనే నట్టేట ముంచుతుంది. నాడు పాంచాలి కోసం మహాభారతం పుట్టింది. కురుక్షేత్రంలో లక్షలాది మంది చనిపోయారు. సీత కోసం రామాయణం పుట్టింది. రాముడి బాణాలకు లక్షల మంది మరణించారు అని చెపుతారు. అవి ఎంతవరకు నిజమో, కానీ నేడు జరిగిన రెండు సంఘటనలు అవి నిజమే అనిపించేలా చేసాయి. ఓ ఆడదాని కోసమే టి ఎస్ పి ఎస్ సి పరీక్షా పేపర్ లీక్? టి ఎస్ పి ఎస్ సి ఉద్యోగి ప్రవీణ్ పెద్ద ‘కాట్రాజు’. నచ్చిన అమ్మయి కోసం ఏ నేరానికైనా  సిద్దం. ఆ విషయం మహబూబ్ నగర్ జిల్లాలోని పంచగల్ తండాకు చెందిన రేణుకకు తెలిసింది. ఆమె గొప్ప అన్దేగత్తే కాకపోయినా మంచి కండ…

Read More

స్త్రీ గిల్లు తుంది. ఎవ్వరికీ కనిపించదు. వినిపించదు. మగాడు కొడతారు. అందరికీ కనిపిస్తుంది. వినిపిస్తుంది.  అందుకే ఆడాళ్ళ మీద సింపతి ఎక్కువ. మరి ఎవ్వరికీ కనిపించకుడా స్త్రీ తో గిల్లించుకునే పీడిత పురుషల కోసం ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ కమిషన్ ఏర్పాటు చేయాలనీ మహేష్ కుమార్ తివారీ అనే న్యాయవాది ఓ పిటిషన్ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేశారు. అతను ఓ భార్య పీడితుడు. అతని వాదనలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అతని వాదనతో సుప్రీం కోర్ట్ కూడా చాలావరకు ఎకీభవించింది. అతను ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. అందులో మన దేశం వాళ్ళే ఎక్కువా అని వివరిచాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో భార్య పీడిత భర్తల ఆత్మహత్యలు మరీ ఎక్కువగా…

Read More

ఎమ్మెల్సి కవితను ఈరోజు అరెస్ట్ చేయడానికి ఈడి దాదాపు రంగం సిద్దం చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వార తెలిసింది. సుప్రీం కోర్ట్ లో ఆమె కేసు వేసి ఈ రోజు ఈడి ఎదుట హాజరు కాకుండా తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమెకు కూడా తెలుసు. అందుకే చాలా తెలిసివిగా ఈ కేసు మీద స్టే ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ని కోరారు. దానికి సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. కానీ కేసును విచారించేందుకు తీసుకుంది. ఆమె ఈ నెల 24న సుప్రీం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడి నుంచి తప్పించుకుని నేరుగా  సుప్రీం కోర్ట్ కి గా వెళ్ళాలని ఆమె ఎత్తుగడ. కానీ అవన్నీ బెడిసి కొట్టడంతో ఆమెకు అన్ని తలుపులు దాదాపు      మూసుకున్నాయి. న్యూ ఢిల్లీలో కవితను ఈ నెల్ 11 న ఈడి తమ కార్యాలయంలో…

Read More

ఆడవాళ్ళ నగ్న విడియోలు తీసేది ఆడవాళ్లేనా? నిన్నటివరకు మగాళ్ళు మాయమాటలు చెప్పి తన గర్ల్ ఫ్రెండ్, లేదా ప్రేయసి నగ్న వీడియోలు తీసి బ్లాకు మెయిల్ చేసేవాళ్ళు. ఇది 4జి మోసాలు. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి 5జి వచ్చింది. నేరస్తులు కొత్త పద్దతులు అవలంభి స్తున్నారు. సైబర్ నేరాల గురించి తెలుసుకున్న అమ్మాయిలు కూడా జాగ్రత్త పడుతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ నగ్న చిత్రాలు ఎక్కడ తీస్తాడోనని భయపడి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆ కేటుగాళ్ళు 5జి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ కేటుగాళ్ళు ముందుగా ఒక ‘కిరాయి కేడి అమ్మాయిని’ బుక్ చేసుకుంటాడు. ఆ అమ్మాయికి సిసి కెమెరాలు, సెల్ ఫోన్ లు ఇస్తాడు. దానిని ఎలా వాడాలో, ఎవరి మీద వాడాలో ట్రైనింగ్ ఇస్తాడు. ఓ గొప్పింటి అమ్మాయితో స్నేహం చేయిస్తాడు. ఆ ఇద్దరు హోటళ్లకు, పబ్ లకు వెళ్లే ఖర్చులు కూడా భరిస్తాడు. ఇద్దరి మధ్య…

Read More

‘కాట్రాజు’, ‘రసికరాజు’, ‘కాట్రవల్లి’, ‘పెద్ద కళాకారుడు’గా అనే నిక్ నేంలతో పేరు పొందిన తాడికొండ రాజయ్య రాసలీలను సర్పంచ్ నవ్య తొలిసారి  బయటపెట్టారు. తీగ కదిలింది. దొంక బయటపడింది. దాంతో ఆయన పబ్లిక్ గా చేసిన వికృత చేష్టలను సోషల్ మీడియా బయట పెట్టింది. మా ‘పోలి ట్రిక్స్’ ఓ అడుగు ముందుకేసే ఆయన చేసిన రాసలీలల విడియోలను వరుసపెట్టి ప్రసారం చేసింది. ఆ వార్త సంచలనం రేపింది. చివరికి కెసిఆర్ దగ్గరికి కూడా వెళ్ళింది. వెంటనే అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. తాడికొండ రాజయ్యకు కెసిఆర్ తొడపాశం పెట్టారు. మొట్టికాయలు వేశారు. విడియోలతో సహా నిజం బయటపడింది. కాబట్టి ఇక బుకాయించి ప్రయోజనం లేదని తాడికొండ రాజయ్య తోక ముడిచాడు. తల వంచాడు. నవ్య పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు. ఆమెకు అందరి సమక్షంలో క్షమాపణలు కూడా చెప్పాడు. తన వక్రబుద్ది మార్చుకుని ఇకనుంచి…

Read More

అవును. మీరు చదివింది అక్షరాలా నిజమే. ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ, మాటలు రాసి, దర్శకత్వం వహించింది అక్షరాలా ప్రధాని నరేంద్ర సింగ్ మోడీ. ఆ సినిమా లోని ‘నాటు నాటు’ పాట రాసింది బోస్ కాదు. నరేంద్ర సింగ్ మోడీ. అసలు ఆ సినిమాకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడానికి కారణం కూడా మోడీ నే. నిజమా? మరి ఆర్ ఆర్ఆర్ సినిమాకు దర్శకుడి గా రాజమౌళి తన పేరు ఎందుకు వేసుకున్నారు? ‘నాటు నాటు’ పాటను తాను రాశానని చంద్ర బోస్ ఎందుకు అబద్దం చెప్పారు? ఎంత మోసం? ఈ మాటలు చెప్పింది ఎల్లిగాడో, మల్లిగాడో, సుబ్బిగాడో కాదు. ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరిస్తున్న మల్లికార్జున ఖర్గే స్వయంగా చెప్పారు. ఎక్కడో ఇరాని హోటల్లో చాయి తాగుతూ చెప్పిన సొల్లు మాటలు కావు. స్వయంగా పార్లమెంట్లో 552 మంది పార్లమెంట్ సభ్యుల సమక్షంలో బల్ల…

Read More

”ఈడి  కవితను ముద్దు పెట్టుకుంటుందా?” అని డబుల్ మీనింగ్ ధ్వనించేలా బండి సంజయ్ లోగడ ఎంఎల్సి కవితను కించపరిచిన విషయం తెలిసిందే. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్య లను సొంత బిజెపి నాయకులే తప్పుపట్టారు. దీనిని తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని అతని మీద కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి జరిపే విచారణకు ఈ నెల 15 తేదినా హాజరు కావాలని నోటీసులు పంపింది. దీనిని బండి సంజయ్ ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందువల్ల తాను ఈ నెల 15 న హాజరు కలేనని, ఈ నెల 18 న హాజరు అవుతానని లేఖ రాశారు. అయితే దీనికి ముందు తాను  హాజరు కావలసి అవసరం ఎందుకు వచ్చిందో వివరణ కావాలని అతను రాసిన లేఖలో అడిగారు. దీనికి మహిళా కమిషన్ జవాబు ఇస్తేనే తాను  హాజరవుతాను అనే…

Read More

జనసేన పదో ఆవిర్భావ సభలో నిన్న పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగిస్తూ వంగవీటి రాధా ‘కులం’ పుట్టుపూర్వోత్తరాలను బయటపెట్టి ఎన్నో సంచలనాలకు తెర లేపారు. వంగవీటి రాధా తండ్రి వంగవీటి మోహన రంగా కాపు వర్గానికి గుడి లేని దేవుడు. కానీ రంగకు అసలు ఏ కులం ఫీలింగ్ లేదు అన్నార. ఆ విషయం చాటు కోడానికే అయన కావాలని కమ్మ సామజిక వర్గానికి చెందిన ఆడపడుచును పెళ్లి చేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఈది చాలామందికి తెలియదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ రెండు కులాల కలయికవల్ల పుట్టినవాడే వంగవీటి రాధా అని వివరించారు. ఇప్పుడు వంగవీటి రాధా  ఏ కులానికి చెందినవాడు? అని సభలో ప్రశ్నించాడు. నిజానికి వంగవీటి రాధాకు కూడా ఎలాంటి  కులం ఫీలింగ్ లేదు అని మెచ్చుకున్నారు. ఇంకా లోతుకు వెళ్ళితే కాపు సామజిక వర్గానికి చెందిన తాను కూడా కమ్మ…

Read More

జనసేన పదో ఆవిర్భావ సభలో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఉద్వేగతభరిత ప్రసంగం సంచలంగా మారింది. ఆ మాటలు మోడీని, అమిత్ షాను, బండి సంజయ్ లకు ఓ హెచ్చరిక ను జారిచేసినట్లు ఉన్నాయి. తాను బిజెపి తో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం అని ఒప్పుకున్నారు. వాళ్ళ హిందూ పదజాలం తనను ఆకర్షించింది అని ఒప్పుకున్నారు. అయితే బిజెపి హిందువులకు మేలు చేసే క్రమంలో మన దేశంలోని మైనారిటీలకు ద్రోహం చేస్తే మాత్రం ఊరుకోను అని సభాముఖంగా ఆయన ఘాటుగా బిజెపికి హెచ్చరికలు పంపారు. బిజెపిని సున్నితంగా మందలించారు. తాను ఇప్పటివరకు మైనారిటీలకు ఎలాంటి ద్రోహం తలపెట్టలేదు అని పవన్ కళ్యాన్ చెప్పారు. తాను వాళ్ళను ఇష్టపడతాను అన్నారు. వాళ్ళకు ఇబ్బంది కలిగించే ఏ చిన్న పని కూడా చేయలేదు అన్నారు. తాను రోడ్ షోలు నిర్వహించేటప్పుడు లౌడ్ స్పీకర్లో శబ్దం పెద్దగా వినిపించేవి. చుట్టుపక్కల మజీద్ లో ఎవ్వరయినా…

Read More