Author: Admin

తేల్చిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించిన కమిషన్పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారు10 మంది పోలీసులపై హత్యానేరం కేసులకి సిఫార్సు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసు.. తెలంగాణ పోలీసుల మెడకు చుట్టుకుంది. ఎన్ కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్. సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులు చట్టపరమైన నిబంధనలు, పోలీసు మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించింది. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, తమపై దాడి చేశారన్న పోలీసుల వాదనలో నిజం లేదని పేర్కొంది. నిందితులు పోలీసుల నుంచి తుపాకులు లాక్కునేందుకు యత్నించారనడం కట్టుకథలాగే ఉందని, ఈ విషయంలో పోలీసులు చెప్పినవేవి నమ్మశక్యంగా లేవని పేర్కొంది. ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ అభిప్రాయపడింది. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం 2019 డిసెంబర్ 6వ…

Read More

12 నెలల్లో తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్తెలంగాణ ఏర్పడినప్పుడు రూ. 69 వేల కోట్ల అప్పు7 ఏళ్లలో రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్తెలంగాణలో శ్రీలంక పరిస్థితులుప్రజలు తిరగబడే దుస్థితి కల్పించారుత్వరలో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్లుమీట్ ది ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి 30 రోజుల్లో రైతులకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ హామీ అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామన్నారు. సబ్బండ వర్ణాల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని.. వారిని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్ కే…

Read More

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వస్తున్నాయి కనుకనే కావచ్చు కానీ, ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతం గురించీ, వ్యవసాయ రంగం గురించీ చాలా కాలం తరువాత మళ్ళీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో, రాజకీయ పార్టీల మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీలు రాష్ట్ర రైతులకు అనేక హామీలు గుప్పిస్తుంటే, , ప్రాంతీయ పార్టీగా ఉన్న తెరాస కూడా జాతీయ వ్యవసాయ విధానం గురించి చర్చలు కొనసాగిస్తోంది. వీటన్నిటి మధ్యలో నిజమైన రైతులు,ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా, ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలకు, ఆర్ధిక నష్టాలకు బలవుతూ , అప్పుల ఊబిలో కూరుకుపోతూ , బలవన్మరణాలవైపు నడుస్తూనే ఉన్నారు .ఇప్పటి రాజకీయ పార్టీలు , నాయకులు అవకాశవాదంతో వ్యవసాయ రంగాన్ని గందర గోళంలోకి నెట్టారు కానీ , భారత రాజ్యాంగ రచయితలు వ్యవసాయ రంగం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగానే బాధ్యతలను నిర్దేశించారు . స్థానిక వైవిధ్య పూరిత…

Read More

అమిత్ షాకు రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలు టీబీజేపీ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తోన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తోన్న కేంద్ర బీజేపీ నాయకత్వం.. ఎవరిపై పోరాటం చేసేందుకు రాష్ట్రానికి వస్తున్నారని నిలదీశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తోడుదొంగలై.. పంటల బీమా పథకాన్ని నీరుగార్చారని విమర్శించారు. అమిత్ షాకు రేవంత్ ప్రశ్నలు.. ప్రాజెక్టుల రీడిజైనింగ్.. కాళేశ్వరం పేరిట సీఎం కేసీఆర్ కమిషన్లు దండుకున్నారని మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం. 8 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా ?తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపా చీకటి…

Read More

-చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలు-పిటిషన్లపై విచారణ జరపొద్దని రెండు రోజుల క్రితం వాదన-బ్రిటిష్ కాలం నాటి చట్టంపై మోదీ సర్కార్ యూటర్న్ మార్పులు అవసరమని, పరిశీలిస్తామని అఫిడవిట్ దాఖలు వివాదాస్పద రాజద్రోహ చట్టంపై కేంద్ర ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. చట్టంలోని సెక్షన్ 214ఏ నిబంధనల్ని పునఃపరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు తలిపింది. మార్పులకు అవకాశముందని వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసే మార్పుల కసరత్తు పూర్తయ్యేంత వరకు వేచి ఉండాలని కోరింది. అటు.. రాజద్రోహ చట్టాల రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మే 10 నుంచి వింటామని గతంలోనే సుప్రీంకోర్టు వెల్లడించింది. నేటి నుంచి పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. పిటిషన్ లో పేర్కొన్న అంశాలివీ..! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ…

Read More

నారాయణ గుట్టులాగిన పోలీసులు నారాయణ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్, ప్రధాన నిందితుడు గిరిధర్‌రెడ్డిని విచారించిన పోలీసులు మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించిన గిరిధర్‌ రెడ్డి జేఈఈ, నీట్‌ లాంటి పరీక్షల్లో ర్యాంకులపైనే నారాయణ సంస్థలు దృష్టి ఎక్కువగా పెడతాయని వెల్లడి మాథ్స్, సైన్స్‌లపైనే ప్రధాన దృష్టి ఉంటందన్న గిరిధర్‌ రెడ్డి తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజ్‌ సబ్జెక్టులు, సోషల్‌స్టడీస్‌పై నిర్లక్ష్యం ఉంటుందని చెప్పిన ప్రధాన నిందితుడు అందుకే విద్యార్థులకు వీటిపై పట్టు ఉండదని వెల్లడి వీటన్నింటినీ అ«ధిగమించి పదోతరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడానికి నారాయణ సంస్థలు ప్రయత్నాలు చేస్తాయని పోలీసులకు చెప్పిన గిరిధర్‌ రెడ్డి దీంట్లో భాగంగానే ప్రతి ఏటా పదోతరగతి పరీక్షల ముందు ఉభయ తెలుగురాష్ట్రాల్లోని స్కూల్‌ డీన్లు, వైస్‌ ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్‌తో భౌతికంగా విజయవాడలో లేదా, వర్చువల్‌గా నారాయణ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పిన గిరిధర్‌ రెడ్డి నారాయణ ఆదేశాల ప్రకారం, ఆయన…

Read More

తెలంగాణ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ యువకుడు పెట్రోల్ పోసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎస్సై, తహసీల్దార్ తప్పించుకోగా, ఎంపీవో గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేయడంతో ప్రాణాపాయం తప్పింది. పెట్రోల్ స్ప్రే చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దారి వివాదం – పెట్రోల్ తో దారుణం దారి వివాదం తలెత్తడంతో.. అదే గ్రామానికి చెందిన యువకుడు గంగాధర్, రోడ్డుకి అడ్డంగా కర్రలు, ఇటికలు పెట్టాడు. స్థానికులు వారించినా వినిపించుకోలేదు. దీంతో గ్రామస్తులు అధికారులకి ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ఎస్సై, తహసీల్దార్, ఎంపీవో గ్రామానికి వచ్చారు. కర్రలు, ఇటికలు తొలగించేందుకు ప్రయత్నించారు. గంగాధర్ ముందుగానే పెట్రోల్ తో నింపిన స్ప్రేయర్ తీసుకొని.. అధికారులపై స్ప్రే చేశారు. ఈ క్రమంలో ఎస్సై ప్రతిఘటించి అడ్డుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో గంగాధర్ నిప్పంటించాడు. ఎస్సై అక్కడి నుంచి పక్కకు పరిగెత్తారు. పక్కనే…

Read More

భారత దేశం మొత్తం అప్పు రూ. 135.87 లక్షల కోట్లుస్వాతంత్రానంతరం 67 ఏళ్లలో రూ. 55 లక్షల కోట్ల అప్పులుమోదీ హయాంలో ఈ 8 ఏళ్లలో రూ. 80 లక్షల కోట్ల అప్పులుఏటా సగటున రూ. 10 లక్షల కోట్ల రుణాలుఅప్పుల్లో ప్రపంచ రికార్డు దిశగా ప్రధాని మోదీపన్నుల వసూళ్లలోనూ తగ్గేదిలే అంటున్న కేంద్రంపెట్రో బాదుడే రూ. 3 లక్షల కోట్లులక్షల కోట్ల రుణాలు, పన్నుల వసూళ్లు ఏం చేస్తున్నట్లు ? స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసిన మొత్తం అపులు… రూ. 55,87,149 కోట్లు. బూటకపు వాగ్దానాలతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. అప్పటి నుంచి 2022 వరకు చేసిన అప్పులు రూ. అక్షరాలా.. రూ.80,00,744 కోట్లు. అంటే… 67 ఏళ్లలో దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులు కంటే… కేవలం 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన…

Read More

-సీబీఐ, ఈడీని ఎందుకు ప్రయోగించడం లేదు..?-కేంద్రం చర్యలపై నెల వేచి చూస్తానని స్పష్టీకరణ తెలంగాణకు ప్రాంతీయ పార్టీ అవసరముందని వెల్లడి-మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, జైలుకు పంపుతామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. నెలలు గడచినా అందుకు సంబంధించిన ఊసే ఉండటం లేదు. ఇక దమ్ముంటే టచ్ చేసి చూడాలని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ.. ఇద్దరిలో ఎవరూ మరో అడుగు ముందుకు వేయడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా ఆయన రాజకీయ ప్రయాణం ఎటు..? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్ విసిరారని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా ప్రశ్నించారు. సీబీఐ,…

Read More

-ప్రజాదర్బార్ లు లేవు, గోడు వినే నాథులు లేరు కేసీఆర్ సచివాలయానికి రాడు, ప్రగతి భవన్ కు రానివ్వడు-అర్జీ తీసుకోడు.. ధర్నాచౌక్ లో అరవనివ్వడు-ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం కరవు-నిజంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా..? రాజుల కాలంలో అంతఃపురం వద్ద ధర్మగంట ఉండేది. అక్కడికి వెళ్లి… ఎవరైనా ధర్మగంట మోగిస్తే… ప్రభువైన రాజు బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే వారు. ధర్మగంట మోగిందంటే.. నిద్రలో ఉన్నా.. మేల్కొని.. బయటకు రావడం… జనం గోడు వినడం.. ఆనాటి రాజుల విధ్యుక్త ధర్మం. పాలన ఏ రూపంలో ఉన్నా.. జనం తమ బాధలు చెప్పుకునే ఒక వ్యవస్థ ఉండేది… ఉంటుంది… ఉండాలి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… పాలకులే సేవకులు. ప్రభువులు ఆదేశిస్తే పాలకులు తమ కర్తవ్యం నిర్వర్తించాలి. సేవకులు విధులు నిర్వర్తించకుంటే.. ప్రభువులు ఏం చేయాలి..? ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి తప్ప.. ప్రజలే స్వయంగా పాలకుల్ని మధ్యలో దింపే వ్యవస్థ లేదు. మరేం చేయాలి….?…

Read More