Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
2014 జూన్ ! డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 59. 15 2022 జూన్ 29 … 78. 97 పైసలకు పతనమై.. 80 రూపాయిలకు చేరవు అవుతోన్న రూపాయి విలువ ! నరేంద్ర మోదీ పరిపాలన మొదలైన తర్వాత 8 ఏళ్లలో అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ ఎన్నడూ చూడని కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ పతనం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. 2022 జనవరి 12న ఒక డాలర్కి రూపాయి మారకం రూ. 73.77గా ఉంది. అప్పటి నుంచి మన కరెన్సీ విలువ రూ.5 పడిపోయి, బుధవారం (జూన్ 29 ) నాటికి రూ.78.97కి చేరుకుంది. అతితక్కువ సమయంలో ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ రూపాయి విలువ ఇంతలా పడిపోలేదు. 2022 – 23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూపాయి మరింతగా క్షీణించి రూ. 81 కి చేరవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.…
నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి ప్రాజెక్టుల పేరుతో అరాచకాలు చేస్తున్న ప్రభుత్వంరైతులపై లాఠీఛార్జీ, సంకెళ్లు వేయడంపై నీలదీతకేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ, తీవ్రంగా మండిపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు, సాగునీరు పేరుతో అరాచకాలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల గురించి వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పరిహారం అడిగిన నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసి, చేతులకు బేడీలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఖమ్మంలో ఆదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారని గుర్తుచేశారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సమంజసమా…? అని ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. రైతులపై పెట్టిన కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులు కోరకున్న విధంగా పరిహారం ఇవ్వాలని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని రీడిజైన్తో ముంపు…
టీడీపీ వద్దనుకుంటున్న ఆ ఎంపీని వైసీపీ చేర్చుకుంటుందా? బెజవాడ రాజకీయం కాకరేపుతోంది. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీతో కొంత కాలంగా అంటీముట్టనట్లు ఉంటున్న కేశినేని నాని.. పార్టీలోనే ఉంటారా.? లేక వైసీపీలోకి జంప్ అయిపోతారా.? అన్నది చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నలు రావడానికి కారణాలు లేకపోలేదు. కొద్దిరోజులుగా నాని వ్యవహారం.. సొంతపార్టీ నేతలకే ఇబ్బందికరంగా మారింది. అసలు ఇయన పార్టీలో ఉన్నాడా లేదా.? అన్న చర్చ జరుగుతోందంటే.. పార్టీ క్యాడర్తో ఆయన ఎంత టచ్లో ఉన్నారో అర్థమవుతోంది. ముందు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని.. ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కుమార్తెను బరిలోకి దించి కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. అయితే కొద్దిరోజులుగా పార్టీలో ఇమడలేకపోతున్న కేశినేని.. అధికార పార్టీ వైపు చూస్తున్నారని…
రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యశ్వంత్ సిన్హా కూడా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. జూన్ 27న ఉదయం 11.30గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్దతు తెలిపారని శరద్ పవార్ చెప్పారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకు యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు. సిన్హా రాజకీయ నేపథ్యమిది.. 1984లో ఐఏఎస్కు రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హా జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ జాతీయ…
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో… అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా గెలుపు బావుటా ఎగురవేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను జనంలో ఎండగట్టాలని విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ ముఖ్యనేతలు తెలంగాణలో వరుస పర్యటనలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యనేత రాహుల్ గాంధీ వరంగల్ సభతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నేతలు వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. పార్టీ ఎజెండా నచ్చడంతో పలువురు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. కాంగ్రెస్ లో జోష్ రైతులకు మేలు జరగాలన్నా… ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమనే విషయాన్ని ఆ పార్టీ నేతలు జనాలకు వివరిస్తున్నారు. గ్రామగ్రామాన రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజా…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శ్రీలంక విద్యుత్ బోర్డు ఛైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలంకలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని భారత పారిశ్రామికవేత్త అదానీకి కట్టబెట్టేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై నరేంద్ర మోదీ ఒత్తిడి చేశారని వెల్లడించారు. ఇదే విషయాన్ని రాజపక్స స్వయంగా తనకు చెప్పారని పేర్కొన్నారు. జూన్ 10న శ్రీలంకలో జరిగిన ప్రభుత్వ సంస్థల కమిటీ ఓపెన్ హియరింగ్ లో సెలాన్ విద్యుత్ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాన్డో ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో ట్విటర్లో బాగా వైరల్ అవుతోంది. వీడియోలోని వివరాలు ఇలా ఉన్నాయి. “గతేడాది నవంబర్ 24న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో నేను భేటీ అయిన సమయంలో.. మన్నార్ జిల్లాలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని అదానీ గ్రూప్ కి ఇవ్వాలని భారత ప్రధాని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయంతో తనకు కానీ, విద్యుత్ బోర్డుకి…
తెలంగాణలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో కీలకం. టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో కొంచెం ఇష్టం – చాలా కష్టం అన్న భావన వచ్చింది. గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు జనం నాడిని పరిశీలిస్తే.. వారంతా మంచి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ.. అధికారం కోసం పోటాపోటీగా పోరాడుతున్నాయి. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే మాత్రం.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే… కాంగ్రెస్ వల్లే సాధ్యమన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లోను నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే, మెజారిటీ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది సీనియర్ నాయకుల అంచనా. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన…
ఆమె బాట…. పూల బాట కాదుఆమె ప్రయాణం… నల్లేరుపై నడక కాదుఅనుకున్న గమ్యం దిశగా సాగిన గమనంలోఎంచుకున్న లక్ష్యం దిశగా నడిచిన ప్రయాణంలోఆటుపోట్లు ఎదుర్కొంటూకష్టాలు ఓర్చుకుంటూకన్నీళ్లను దాచుకుంటూమనసులో చీకట్లు కమ్ముకున్నామోముపై చిరునవ్వులు చిందిస్తూఅందరికీ ఆత్మీయ పలకరింపుగా మారారువిమర్శల రాళ్లను విజయ సౌధానికి పునాదిగా మలచుకున్నారుపేరు చెబితే… పరిచయం అవసరం లేని స్థాయికి చేరుకున్నారు. https://youtu.be/Vz-Ro_8UR9E ఆమెది.. తలవంచని వ్యక్తిత్వం…. ముక్కుసూటి మనస్తత్వంకల్మషమెరుగని చిరునవ్వుతో… ఆత్మీయ పలకరింపుతోప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారుటీవీ రంగంలో ఠీవీగా నిలిచారు. ఆమె… తెలుగునాట తొలితరం యాంకర్ఆమెది… బుల్లితెరపై అలుపెరుగని కెరియర్విరామమే తప్ప… విరమణ ఎరుగని ప్రయాణంలోయూట్యూబ్ వేదికగామనతో మరిన్ని ముచ్చట్లు చెప్పేందుకు వస్తున్నారు….ఆమె….. మరెవరో కాదు….ప్రేక్షకుల మదిలో ప్రతిధ్వనించే ‘హృదయాంజలి’….. ఉదయభాను.
-రెపో రేటు పెంచిన ఆర్బీఐ-సవరించిన రేట్లు ప్రకటన భారత రిజర్వ్ భ్యాంక్-ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందుకు రెపోరేటును పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాల్ని ప్రకటించారు. రెపో రేటును పెంచి 4.90 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. రెపో రేటు అంటే.. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు అని అర్థం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో పాటు పలు వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది. పెంచిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని శక్తికాంత దాస్ తెలిపారు. అటు.. రేపోరేట్లు పెరగడంతో వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచనున్నాయి. ప్రస్తుత రెపో రేటుతో…
ఎమ్మెల్యే కొడుకు రేప్ కేసులో ఉన్నాడు అంటాడు కాని వాడి పేరు చెప్పడు రఘునందన్ రావు.అక్కడ అత్యాచారం జరిగింది అంటూనే కేసును తప్పుదోవ పట్టించేందుకు mutual kiss ఫోటోను వైరల్ చేస్తాడు. పింక్ సినిమా చూసాం కదా. NO means NO అని. ఆ అమ్మాయి ఒంటిమీద గాయలున్నాయని కదా పోలీసుల, అమ్మాయి తండ్రి కథనం. కారు మార్చి తనపై బలవంతం చేశారని కదా ఫిర్యాదు. A kiss is not an invitation for sex. ఈ కాలం అమ్మాయిలకు, అబ్బాయిలకు ఈ విషయం బాగా తెలుసు. అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటో రోడ్డెక్కిన మనుషులపై కుక్కలను వొదులుతారు ఫ్రెండ్లి పోలీసులు. పిలిస్తే రాలేదని కాళ్ళూ విరగ్గొడతారు. KTR నిర్భయ కేసు నిరసనల వెనుక పెల్లుబికిన ప్రజాగ్రహంలో అన్ని పార్టీలు ఉన్నాయి. కాని, కాంగ్రెస్ ఆ నిరసనలపై చేసిన దాడి బీజేపీ కి ప్లస్ అయింది. దానికి తోడు…