ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండు గౌరవము
అని మన రాయప్రోలు సుబ్బారావు గొంతు ఎత్తి పాడారు. కానీ మన భారతీయులు దానిని ఇలా మారుస్తున్నారు –
ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
తిట్టారా నీ తల్లి భూమి భారతిని
అపఖ్యాతి చేయరా నీ జాతి నిండు గౌరవము.
వివరాల్లోకి వెళ్ళితే – మన భారత పౌరుడు, 40 ఏళ్ల సిమ్రంజిత్ సింగ్ మన దేశం లో స్మగ్లింగ్ కుట్రకు సంబంధించిన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడినుంచి పారిపోయి కెనడాలో తలా దాచుకున్నాడు. అక్కడైనా బుద్దిగా ఉన్నాడా అంటే అదీ లేదు. కెనడాలో నివసిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ అక్రమ రవాణాకు సంబంధించిన ఎన్నో ఆరోపణలు ఎదుర్కున్నాడు.
కెనడాలో ఉండి తన దందాను పెంచుకున్నాడు. కోట్లు గడించాడు. అక్కడితో తృప్తి పడలేదు. అక్కడ పోలీసు కేసులు నమోదు చేశారు. వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడు. మొత్తానికి కెనడా పోలీసులు అతనిని పట్టుకోగానే అమెరికా పోలీసులు ఇంటర్ పోల్ కేస్ ద్వార అమెరికాకు పిలిపించి ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. అప్పటికే అమెరికాలో కూడా చాలా స్మగ్లింగ్ పనులు చేసి పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. అక్రమ రవాణా స్మగ్లింగ్కు సంబంధించి మూడు కేసులతో పాటు, ఆరు ఇంటర్పోల్ కేసులు అతనిపై ఉన్నాయి.
మార్చి 2020 మార్చి 2021 మధ్య సెయింట్ లారెన్స్ నది ప్రాంతంలోని కార్న్వాల్ ద్వీపం అక్వేసాస్నే మోహాక్ ఇండియన్ రిజర్వేషన్ ద్వారా కెనడా నుండి అమెరికాకు భారతీయులను అక్రమంగా తరలించే ప్రయత్నంలో పాల్గొన్నాడని కూడా తేల్చారు. ఇతని మీద మన దేశంలో, కెనడా, అమెరికాలో, ఆస్ట్రేలియాలో దాదాపు 55 కేసులు ఉన్నట్లు తెలిసింది. ఈ దెబ్బతో అమెరికాలో బుద్దిగా ఉద్యోగాలు చేసుకునే మన భారతీయులను పోలీసులు ఎయిర్ పోర్ట్ లల్లో అడుగడునా పరీక్షించి అవమానపరుస్తున్నారు.