Site icon Polytricks.in

పథకాల అమలు కోసం కేసీఆర్ కు ఇన్ని కష్టాలా..?

పెండింగ్ హామీలను నెరవేర్చేలా ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ సర్కార్ కు నిధుల సమస్య ఎదురైంది. దాంతో ఈ సమస్య నుంచి బయట పడేందుకు భూములను అమ్మకానికి పెట్టేసి ఆదాయం సమకూర్చుకున్నారు. కోకాపేటలో 43ఎకరాల విలువైన భూములను అమ్మి రూ. 3300 కోట్ల వరకు నిధులను సమీకరించుకోగలిగారు. ఈ ఆదాయాన్నే రైతు రుణమాఫీ కోసం వాడాలనే యోచనలో సర్కార్ ఉంది.

రైతు రుణమాఫీ చేయకపోవడంతో తెలంగాణ రైతాంగం బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉందని కేసీఆర్ కు నివేదికలు అందాయి. దాంతో ఆరునూరైన రుణమాఫీ చేయలనుకున్నారు. అందుకోసం 19వేల కోట్ల నిధులు అవసరం. ఇప్పటికిప్పుడు ఆ నిధులు సమకూరడం కష్టమని అధికారులు చెప్పినా కేసీఆర్ వినలేదు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏదీ తమకు ప్రతికూలంగా మారొద్దని…భూముల అమ్మకంతో వచ్చిన నిధులను రైతు రుణమాఫీ కోసం వాడాలనుకుంటున్నారు.

భూముల అమ్మకంతో 3300కోట్ల ఆదాయం, మద్యం దుకాణాల పేరిట రెండు వేల కోట్లు ఆదాయం సమకూరింది. ఓటర్ రిండ్ రోడ్డు లీజ్ తో 7వేల పైచిలుకు ఆదాయం వచ్చింది. వీటన్నింటితో రైతు రుణమాఫీ చేసి రైతుల్లో బీఆర్ఎస్ పై గూడుకట్టుకున్న వ్యతిరేకతను తగ్గించాలని ప్లాన్ చేశారు. అంటే కేసీఆర్ స్కీమ్స్ లకు నిధుల సమస్య తీరినట్లేనని అర్థం అవుతోంది.

మిగులు బడ్జెట్ తోనున్న తెలంగాణ అప్పులు పాలు కావడంతో పథకాల అమలు కేసీఆర్ సర్కార్ కు కష్టంగా మారింది. పథకాలను అమలు చేయకపోతే మరోసారి అధికారం దక్కడం కష్టం. అందుకే భూములను అమ్మడం, మూడు నెలల ముందుగానే మద్యం దుకాణాల టెండర్లు పిలవడం వంటివి చేస్తున్నారు. నిధులకు ధోకా లేదని చెప్పిన కేసీఆర్ కొన్నాళ్ళుగా భూములను అమ్మి నిధులు సమకూర్చుకునే స్థాయికి తెలంగాణ ప్రగతిని తీసుకెళ్లారనే సెటైర్లు పేలుతున్నాయి.

Also Read : లిక్కర్ ఆదాయంపై కేసీఆర్ ఫోకస్ – అందుకోసమేనా ఈ హడావిడి..?

Exit mobile version