Site icon Polytricks.in

వివేకా తరహాలోనే నన్ను చంపేస్తారామో- శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి, డాక్టర్ సుధాకర్ తరహాలో తనను చంపుతారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ప్రాణ భయంతోనే తాను ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చేశానని చెప్పారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. ఏపీకి వస్తే ఎలాంటి ప్రాణహాని ఉండదని మనవ హక్కుల కమిషన్ హామీ ఇస్తేనే ఏపీకి వస్తానని ప్రకటించారు శ్రీదేవి.

హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నుంచే తనపై పార్టీ నేతలు కుట్రలు చేశారని మండిపడ్డారు.మహిళా నేత అని కూడా చూడకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. శ్రీదేవి ఎక్కడ అంటూ మాట్లాడుతున్నారని.. తను ఏమైనా గ్యాంగ్ స్టార్ నా అని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా,ఇళ్ళ స్థలాలపెరుతో వేల కోట్ల దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు.

అమరావతి ఎక్కడికి పోదని చెప్పినందుకే తనను వేధించడం స్టార్ట్ చేశారని… అమరావతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని స్పష్టం చేశారు ఉండవల్లి శ్రీదేవి. అమరావతి అభివృద్ధిని విస్మరించారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిలో పదిశాతం కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తాను అమ్ముడుపోయినట్లు ఆరోపణలు చేస్తున్నారు కదా ప్రమాణం చేయడానికి తాను సిద్దం మీరు సిద్దమా అంటూ సజ్జలకు సవాల్ చేశారు శ్రీదేవి.

నాలుగేళ్ళు బానిస సంకెళ్ళలో ఉన్నానని…ఇప్పుడు తాను సస్పెండ్ కావడంతో స్వతంత్రంగా వ్యవహరించవచ్చునని శ్రీదేవి అన్నారు.  జగన్ మమ్మల్ని కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయిందని.. త్వరలోనే జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు.

Exit mobile version