Site icon Polytricks.in

ఈడీ విచారణలో కవితని అడిగిన ప్రశ్నలివే

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత విచారణ ముగిసింది. మొత్తం 9గంటల పాటు కవితను విచారించారు ఈడీ అధికారులు.అయితే… ఈ నెల 16 న మరోసారి విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

శనివారం కవితని ఈడీ ఏయే అంశాలపై విచారించిందో చూద్దాం…

* ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన చేసింది మీరేనా..?

*మద్యం పాలసీ మార్పు వెనక ఎవరెవరి హస్తముంది..? మీకు మనీష్ సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడింది..?

* ఢిల్లీ సర్కార్ కు సౌత్ గ్రూప్ కు మధ్యవర్తి మీరేనా..?

* లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏమిటి..? మీరేమంటారు..?

* అరుణ్ రామచంద్ర పిళ్ళై మీకు బినామీనా..?

*మీ బినామీ అని పిళ్ళై అంటున్నారు..ఇందులో నిజమెంత..?

* పిళ్ళై కు , మీకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా..?

* పిళ్ళై తో బిజినెస్ చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పారా..?

* చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి 130 కోట్లు లంచం ఇచ్చారా..?

* 130 కోట్లు లంచం ఎక్కడిది..?ఎవరిచ్చారు..?

*ఇందుకోసం మీకు చార్టెడ్ ఫ్లైట్ ఎవరు ఆరెంజ్ చేశారు..?

*ఫేస్ టైం లో మీరు సమీర్ మహేంద్రతో మాట్లాడారా..?

* శరత్ చంద్రారెడ్డినీ ఎన్నిసార్లు కలిశారు..?

* శరత్ తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి..?

* ఆధారాలు మహం చేసేందుకు సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?

* సిమ్ కార్డులు ఎందుకు మార్చాల్సి వచ్చింది..?

ఈ ప్రశ్నలతో కవితని ప్రశ్నించినట్లు సమాచారం.

Exit mobile version