Site icon Polytricks.in

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

కొత్త సంవత్సరంలో తొలి పండగ సెలవులపై ఆతృతతో ఎదురుచూస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.

ఎప్పుడెప్పుడు పరీక్షలు రాసి పట్టణం నుండి పల్లె వైపుకు ప్రయాణం చేయాలన్న ఉత్సుకతతోనున్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీ, గురుకులకు చెందిన విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీల్ మిట్టల్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు.

ఈనెల 14 వ తేదీన భోగి, 15న మకర సంక్రాంతి,16న కనుమ పండగ సందర్బంగా కేవలం మూడు రోజులు సెలవు దినాలుగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు రోజుల సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు మళ్ళి 17 వ తేది మంగళవారం రోజున పునఃప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version