Site icon Polytricks.in

శ్రీశైల పుణ్యక్షేత్రము 19 నుంచి 23 వరకు మూసివేత? ఎందుకో తెలుసా?

ఈనెల ఉగాది 19 నుంచి 23 వరకు నంద్యాల జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షేత్రములో ఉగాది మహోత్సవాలు జరుపనున్నారు. అందుకే ఈనెల 19 నుంచి 23 వరకు మల్లికార్జున స్వామి ‘స్పర్శ దర్శనాన్ని’ నిలిపి వేసున్నట్లు దేవస్తానం  ఈవో లవన్న అధికారికంగా ప్రకటించారు.

అయితే భక్తులకు ‘అలంకార దర్శనం’ కల్పిస్తారని ఆయన వివరించారు. కాబట్టి ఈ విషయంలో భక్తులు నిరాశకు గురి కావద్దని, విఐపి లకు కూడా ఈనెల 19 నుంచి 23 వరకు మల్లికార్జున స్వామి ‘స్పర్శ దర్శనం’ కల్పించమని చెప్పారు.

అయితే ఈ నెల్ 9 నుంచి 18 వరకు విశిష్ట వేళల్లో నాలుగు విడతల్లో భక్తులకు ‘స్పర్శ దర్శనం’ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అదికూడా ఒక్కొక విడతలో కేవలం 1500 భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీని టికెట్ ధర కేవలం రూ. 500 అని ప్రకటించారు.

Exit mobile version