Site icon Polytricks.in

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ కు షాక్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.

సిట్ కు బదులుగా సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్ పై సుదీర్ఘ  వాదనలు విన్న న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ నిలిచిపోనుంది.

ఇక , సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం కూడా ఉంది.

Exit mobile version