Site icon Polytricks.in

జీవితా రాజశేఖర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్.

తిరుపతి: నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

జ్యోస్టర్ ఎండీ హేమ, జీవితపై ఫిర్యాదు చేశారు.

ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జీవితారాజశేఖర్‌పై ఆరోపణలున్నాయి.

ఆమె తనకు ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయని హేమ చెబుతున్నారు.

రూ.26 కోట్లు ఎగ్గొట్టారని జీవితారాజశేఖర్‌పై హేమ ఆరోపణలు చేస్తున్నారు.
:::::
జీవితపై జ్యోస్టర్ ఎండీ హేమ దంపతుల ఆరోపణలు చేశారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం జీవితారాజశేఖర్ దంపతులకు రూ.26 కోట్లు అప్పు ఇచ్చామని తెలిపారు. అప్పుకోసం ఆస్తి డాక్యుమెంట్లు తనఖా పెట్టారని, అయితే తమకు తెలియకుండా ఆ ప్రాపర్టీని మరొకరికి అమ్మారని తెలిపారు. జీవితా రాజశేఖర్‌ రూ.26 కోట్లు ఎగ్గొట్టారని చెప్పారు. ఈ వ్యవహారంపై తిరువాళ్లూరులో కేసు పెట్టామని ఆమె పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్‌పై చెక్‌బౌన్స్‌ కేసు నడుస్తోందని హేమ తెలిపారు.

Exit mobile version